News April 8, 2024

వివాదాస్పద పోస్ట్.. సారీ చెప్పిన మాల్దీవుల మాజీ మంత్రి

image

భారత్‌పై నోరు జారి పదవి పోగొట్టుకున్న మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియూనా మరోసారి వివాదాస్పద పోస్ట్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి చేసిన పోస్ట్‌లో ఆ పార్టీ లోగోకు బదులు భారత జాతీయ జెండాపై ఉండే అశోక చక్రం ఉంది. దీనిపై విమర్శలు రావడంతో ఉద్దేశపూర్వకంగా తాను ఈ పోస్ట్ చేయలేదని మరియం క్షమాపణలు కోరారు. గతంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు.

News April 8, 2024

శాంతిచర్చల్లో ఎలాంటి పురోగతీ లేదు: హమాస్

image

ఇజ్రాయెల్‌తో శాంతిచర్చల్లో ఎలాంటి పురోగతీ లేదని హమాస్ సంస్థ ప్రకటించింది. ఈజిప్టులో ఇజ్రాయెల్‌తో కొత్తగా మరో దఫా చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదని స్పష్టం చేసింది. యుద్ధం చివరి దశకు చేరిందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులందరినీ విడిచిపెడితే తప్ప యుద్ధాన్ని ఆపేదిలేదని ఆయన తేల్చిచెబుతుండటం గమనార్హం.

News April 8, 2024

సరైన టైమ్‌కి జోక్యం చేసుకున్నాం: మోదీ

image

సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో మణిపుర్‌లో పరిస్థితి కుదుటపడిందన్నారు ప్రధాని మోదీ. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు అత్యుత్తమ వనరులు, నిర్వహణ సిబ్బందిని కేంద్రం రంగంలోకి దింపిందని తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మణిపుర్ చేరుకుని 15కుపైగా సమావేశాలు నిర్వహించి పరిస్థితి పర్యవేక్షించారని పేర్కొన్నారు.

News April 8, 2024

BREAKING: వైసీపీకి మరో షాక్

image

AP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యామినీ బాల తల్లి శమంతకమణి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీని వీడారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించిన వీరికి భంగపాటు ఎదురైంది. దీంతో పార్టీని వీడారు. నిన్న యామినీ బాల వైసీపీని వీడిన సంగతి తెలిసిందే.

News April 8, 2024

సీఎం కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం

image

TG: సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ దగ్గర ఒక్కసారిగా ల్యాండ్ క్రూజర్ టైర్ పేలింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా సీఎం మొయినాబాద్ మీదుగా కొడంగల్ వెళ్లారు.

News April 8, 2024

పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లం: బొత్స

image

AP: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గర పీకే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించారు. మేనేజ్ మెంట్ తప్ప ప్రశాంత్ కిశోర్ చేసేదేమీ లేదని దుయ్యబట్టారు. బిహార్ నుంచి PKను తరిమికొట్టారని అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

News April 8, 2024

నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: MLC నవీన్‌రావు

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు, గెస్ట్ హౌస్ <<13012357>>ప్రస్తావన<<>> రావడంపై BRS ఎమ్మెల్సీ నవీన్‌రావు స్పందించారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారంలో కొందరు కావాలనే నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా గెస్ట్ హౌస్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. కుట్ర పూరితంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు.

News April 8, 2024

మాట నిలబెట్టుకున్న KTR.. స్కూల్ నిర్మాణం పూర్తి!

image

మాజీ మంత్రి కేటీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన అమ్మమ్మతాతలు జె.లక్ష్మి, జె.కేశవరావుల జ్ఞాపకార్థం కొత్త పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని చేసిన ప్రమాణాన్ని నెరవేర్చినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొదురుపాక గ్రామంలో నిర్మిస్తున్న ఈ స్కూల్ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

News April 8, 2024

మూడోసారి ప్రధానిగా జూన్‌లో మోదీ ప్రమాణం: కిషన్ రెడ్డి

image

TS: జూన్ 8 లేదా 9న ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణం చేస్తారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. మోదీ వచ్చాక దేశంలో మత కలహాలు, కర్ఫ్యూలు లేవని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ దిగుమతి చేసుకునేవాళ్లమని.. మోదీ వచ్చాక విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. రాహుల్ గాంధీ దేశాభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

News April 8, 2024

BREAKING: పరీక్షలు వాయిదా

image

దేశంలో ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరగాల్సిన పలు పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) <>రీషెడ్యూల్<<>> చేసింది. జూనియర్ ఇంజినీర్ పరీక్షలను జూన్ 5, 6, 7 తేదీల్లో, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్-XII 2024 పరీక్షలను జూన్ 24, 25, 26 తేదీల్లో, ఢిల్లీ పోలీస్(SI, CAPF) పరీక్షలను జూన్ 27, 28, 29 తేదీల్లో, CHSL(10+2) పరీక్షలను జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తామంది.