India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం 2 కళ్లలా భావిస్తోందని CM రేవంత్ వెల్లడించారు. కలెక్టర్లు ఇంకా పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. IAS, IPS అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలన్నారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్కు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. JAN 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని, నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

‘గేమ్ఛేంజర్’లో రామ్చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. ‘నిజాయితీ కలిగిన అప్పన్నగా, ఐఏఎస్ అధికారి రామ్నందన్గా చరణ్ అద్భుతంగా నటించారు. అతనికి వస్తున్న అభినందనలు చూసి సంతోషంగా ఉంది. నటీనటులు, నిర్మాత రాజు, దర్శకుడు శంకర్, మూవీ బృందం అందరికీ కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు.

TG: ఆదివాసీలపై CM రేవంత్ వరాల జల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమురం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని వారితో భేటీలో తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు 100% ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తామన్నారు. గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ మోటర్లు అందిస్తామని, ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోండు భాషలో బోధనపై నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఐర్లాండ్ మహిళా టీమ్తో జరిగిన <<15119434>>తొలి వన్డేలో<<>> 29 బంతుల్లో 41 రన్స్ చేసిన స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. అత్యంత వేగంగా(95 మ్యాచ్లు) 4,000 ODI పరుగులు పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్గా నిలిచారు. ఓవరాల్గా మూడో క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన బిలిందా క్లార్క్(86), మిగ్ లానింగ్(87) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గతంలో మిథాలీరాజ్ 112 వన్డేల్లో ఈ ఫీట్ నమోదుచేశారు.

పరువు నష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2023 మార్చిలో లండన్ వేదికగా VD సావర్కర్పై రాహుల్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

హంస నీటి నుంచి పాలను వేరు చేసి వాటిని మాత్రమే సేవిస్తుందని చెబుతుంటారు. దీంతోపాటు మరో గొప్ప గుణమూ హంసకు ఉంది. ఇవి తమ భాగస్వామితో బలమైన, జీవితకాల బంధాలను ఏర్పరచుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. హంస తన భాగస్వామిని కోల్పోతే, అది తీవ్ర దుఃఖాన్ని అనుభవించడంతో ఆరోగ్యం క్షీణించి మరణిస్తుందని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఇలా తమ భాగస్వామిని ప్రేమించాలని ఉదాహరణగా వ్యాఖ్యానిస్తుంటారు.

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విచారకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిపైనా నెట్టడం లేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వారి పిల్లలకు చదువులు చెప్పించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

<<15098726>>స్టేడియాలు సిద్ధంగా లేకపోవడంతో<<>> పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేరే దేశానికి వెళ్లనుందని వచ్చిన వార్తలపై పీసీబీ స్పందించింది. సుమారు 12 బిలియన్(పాక్ రూపాయలు) వెచ్చించి స్టేడియాల్ని సిద్ధం చేశామని స్పష్టం చేసింది. స్టేడియాల సన్నద్ధతపై వచ్చిన వార్తల కారణంగా గందరగోళం ఉండకూడదనే ప్రకటన విడుదల చేశామని తెలిపింది. పనులు వేగంగా జరుగుతున్నాయని, టోర్నీ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేసింది.

వివిధ అభియోగాలున్న 258మంది పాకిస్థానీ పౌరుల్ని 7 దేశాలు తమ భూభాగం నుంచి వెళ్లగొట్టాయి. పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం.. సౌదీ అరేబియా అత్యధికంగా 232మందిని, యూఏఈ 21మందిని.. చైనా, ఇండోనేషియా, సిప్రస్, నైజీరియా, ఖతర్ తలా ఒకరిని తిప్పి పంపించాయి. వీరిలో ఏడుగురు యాచకులు ఉండటం గమనార్హం. 258మందిలో 16మందికి వీసా గడువు లేకపోవడంతో కరాచీకి రాగానే పాక్ అధికారులు అరెస్ట్ చేశారు.

వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మండిపడ్డారు. ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. భార్య వైపు భర్త ఎందుకు తదేకంగా చూడకూడదు? ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా’ అని ఆమె ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.