India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022, నవంబరు 17న భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ను ‘బ్రిటిష్ ఏజెంట్’గా రాహుల్ అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని తేల్చిచెప్పింది. ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట హీరోల మధ్య వివాదం నెలకొంది. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది సూర్య అని ఆయన తండ్రి శివకుమార్ ఓ కార్యక్రమంలో అన్నారు. అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు. దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. ఆ తర్వాత ‘సత్యం’ కోసం నేను చేశాను’ అని గుర్తుచేశారు. ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.
భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమా విడుదలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని పాటలను యూట్యూబ్ నుంచి మేకర్స్ తొలగించారు. ‘సరిగమ’ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీటిని రిలీజ్ చేయగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రిమూవ్ చేసింది. కాగా ఈ మూవీలో భారతీయ నటి వాణీకపూర్ ఫవాద్కు జోడీగా నటించారు.
IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.
పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది.
అదానీ గ్రూప్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్బర్గ్కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.
సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఓ ముస్లింగా భారతీయులందరికీ క్షమాపణలు తెలియజేశారు. మతం చూసి దాడికి పాల్పడటం హీనమైన చర్య అని ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు. ఈ ఘటన తనపై మానసికంగా ప్రభావం చూపించిందని తెలిపారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా కలిసికట్టుగా పోరాడుదామని పేర్కొన్నారు. భారతీయురాలిగా దేశం తరఫున నిలబడతానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.