India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్ల దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లు హీరో నాగార్జున తెలిపారు. ‘వివాదం తర్వాత సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. నాకు, నా కుటుంబానికి మాత్రం అపాలజీ చెప్పలేదు. అందుకే ఇప్పటికే సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కేసు వేశాం. క్షమాపణ చెప్పినా కేసు వెనక్కి తీసుకోం. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. వివాదంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది’ అని ఆయన TimesNowతో చెప్పారు.
కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. సర్టిఫికేషన్ సంబంధిత సమస్యలను CBFCతో పరిష్కరించుకున్నట్టు చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టుకు తెలిపారు. బోర్డు సూచించిన మార్పులకు ఫిలిం మేకర్స్ అంగీకరించారు. అన్ని మార్పులతో కూడిన చిత్రం కాపీని బోర్డు మరోసారి వీక్షించనుంది. ఈ ప్రక్రియతో సర్టిఫికెట్ జారీకి 14 రోజులు పడుతుందని కోర్టుకు బోర్డు తెలిపింది.
మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ముందు న్యూజిలాండ్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా కివీస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు ప్లిమ్మర్(34), బేట్స్(27) శుభారంభాన్ని ఇచ్చారు. మరో బ్యాటర్ డివైన్ (57) అర్థసెంచరీ చేయడంతో NZ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక 2, అరుంధతి, శోభన తలో వికెట్ తీశారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దుల్లో మావోలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టారు. వారికి మావోలు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు మరణించారు.
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కమల అభ్యర్థిత్వ నామినేషన్కు ఒబామా, ఆయన సతీమణి మిచెల్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. స్వింగ్ ఓటర్లే లక్ష్యంగా Oct 10న పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో ఒబామా మొదటి ప్రచార సభ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సభలో కమల కూడా పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
తెల్ల దుప్పటి కప్పుకొని కనిపించే అంటార్కిటికా పర్యావరణ మార్పు కారణంగా పచ్చబడుతోంది. పరిశోధకులు ఈ విషయాన్ని నేచర్ జియోసైన్స్ జర్నల్లో తెలిపారు. గడచిన 4 దశాబ్దాల్లో అంటార్కిటికా పచ్చదనం 10 రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 1986లో 0.4 చదరపు మైళ్లున్న పచ్చదనం 2021 నాటికి 5 చదరపు మైళ్ల విస్తీర్ణానికి చేరిందని వెల్లడించారు. ఈ మార్పు భూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై డైరెక్టర్ RGV మరోసారి స్పందించారు. ‘సురేఖ గన్ గురిపెట్టింది కేటీఆర్కు. కాల్చింది మాత్రం నాగార్జున, నాగచైతన్యను. కానీ క్షమాపణ చెప్పింది సమంతకు. ఐన్స్టీన్ కూడా ఈ ఈక్వేషన్ను పరిష్కరించలేడేమోనని నాకు డౌట్’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. కాగా RGV అంతకుముందు సమంతను సురేఖ పొగిడారని <<14260907>>కామెంట్<<>> చేసిన విషయం తెలిసిందే.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈనెల 12న ఉప్పల్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. మ.12.30 గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. టికెట్ల ప్రారంభ ధర రూ.750 కాగా గరిష్ఠ ధర రూ.15వేలుగా నిర్ధారించినట్లు చెప్పారు. బుక్ చేసుకున్నవారు ఈనెల 8-12 మధ్య జింఖానా స్టేడియంలో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు.
గత ఏడాది యూకే పర్యటన సందర్భంగా వినాయక్ దామోదర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కేసులో రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు జారీ చేసింది. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో పదే పదే సావర్కర్ పరువు తీస్తున్నారని సావర్కర్ సోదరుడి మనమడు సాత్యకి కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీని చట్ట ప్రకారం విచారించి శిక్షించాలని, నష్టపరిహారం విధించాలని సాత్యకి కోరారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మరోసారి సెటైర్ వేశారు. ‘చె గువేరాతో ప్రారంభమై.. సనాతన ధర్మం వరకూ సాగిన మీ ప్రయాణం.. ఇంకెక్కడి దాకా స్వామీ?’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ‘బాబు సిట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.