India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 30న సీబీఐకి 4 నెలల గడువు ఇవ్వగా, తాజాగా మరింత గడువు ఇవ్వాలని అధికారులు కోరారు. దీంతో ధర్మాసనం మండిపడింది. మరో 4 నెలల్లో విచారణ పూర్తిచేయాలని, ఇకపై గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది. 2011 నుంచి ఈ కేసుల విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఐర్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ప్రతికా రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53) అర్ధ సెంచరీలతో చెలరేగారు. స్మృతి మంధాన (41) పవర్ప్లేలో ధాటిగా ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో మాగూర్ 3 వికెట్లు, సార్జెంట్ ఓ వికెట్ పడగొట్టారు.

AP: రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్పాల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను గుంటూరు జిల్లా రెండో అదనపు కోర్టు కొట్టేసింది. విచారణ సందర్భంగా తనను విజయ్పాల్ చిత్రహింసలు పెట్టారని RRR ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదుకాగా, నిన్నటితో పోలీస్ కస్టడీ ముగిసింది.

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. హరీశ్ తన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరోసారి విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్కు నోటీసులు జారీచేసింది.

TG: ఆదివాసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. తమ సమస్యల్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ‘ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను మంజూరు చేస్తున్నాం. బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తాం. కేస్లాపూర్ జాతరకు నిధుల మంజూరు చేస్తాం. ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం. ఉచితంగా బోర్లు వేస్తాం’ అని CM హామీ ఇచ్చారు.

JEE అడ్వాన్స్డ్-2025 పరీక్షలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3సార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చని గతంలో ప్రకటించిన జాయింట్ అడ్మిషన్ బోర్డు మళ్లీ రెండుసార్లకే పరిమితం చేయడంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. JAB నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. వచ్చే మేలో జరిగే పరీక్షకు 2024, 2025 MARలో ఇంటర్ పాసైనవారే అర్హులు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి JEE అడ్వాన్స్డ్ నిర్వహిస్తారు.

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన నేపథ్యంలో సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ పలు వెబ్సైట్స్ రాసిన రివ్యూలను షేర్ చేశారు. ‘కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలోనూ నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్. లవ్ యూ’ అని రాసుకొచ్చారు.

AP: తెలుగు యూట్యూబర్ భార్గవ్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. కాగా భార్గవ్ ‘ఫన్ బకెట్’ పేరుతో వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

కెనడా PM పదవికి పోటీలో నిలుస్తున్నట్లు భారత సంతతి, లిబరల్ పార్టీ MP చంద్రా ఆర్యన్ ప్రకటించారు. దేశాన్ని మరింత సుస్థిర ప్రగతివైపు నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్యన్ స్వస్థలం కర్ణాటక కాగా కెనడాలో స్థిరపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఆయన, భారత్-కెనడా బంధం బలోపేతానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.