India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

UP, బెంగాల్, మహారాష్ట్ర తర్వాత నాలుగో అత్యధిక అసెంబ్లీ స్థానాలు(243)న్న బిహార్కు ఇవాళ సాయంత్రం గం.4కు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2020 ఎన్నికల్లో NDA 125, INDIA 110, ఇతరులు 8 స్థానాలు పొందాయి. ఓటుబ్యాంకు: NDA 37.26%, INDIA 37.23%. 20% స్థానాల్లో గెలుపు-ఓటముల తేడా 2.5%లోపే. NDA ఇలా 21, INDIA 22 సీట్లు పొందాయి. రెండు కూటముల మధ్య పోటీతో వేవ్ స్వింగ్ అయ్యే ఈ సీట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి.

సొంతూళ్లకు వెళ్లి మహానగరానికి తరలివస్తోన్న వారితో HYD శివారు హైవేలపై భారీగా <<17927176>>ట్రాఫిక్ జామ్<<>> అవుతోంది. టోల్ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ ఉంటోంది. అలాంటి సమయంలో వాహనాలను టోల్ లేకుండా పంపాలని NHAI నిబంధనల్లో ఉంది. క్యూ లైన్ 100మీటర్ల పసుపు గీతను దాటినా.. సాంకేతిక సమస్యలతో వాహనం 10 సెకన్ల కంటే ఎక్కువ వేచి ఉన్నా ఉచితంగా వెళ్లొచ్చు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించినవి.

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM) 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నిషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, PwDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://www.vismuseum.gov.in/

మారిన జీవనశైలి వల్ల మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు న్యూట్రిషనిస్ట్ లహరి సూరపనేని. దీనికోసం ఆహారంలో మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రమంతప్పని వ్యాయామం, మంచి నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.

చాలా మంది UPI పిన్ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్లో “Forgot UPI PIN” అనే ఆప్షన్ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.

క్యాష్లెస్ పేమెంట్స్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో UPI, ఆన్లైన్ పేమెంట్స్లో సమస్యలెదురైతే ఇలా చేయండి. డబ్బు పంపే సమయంలో మన అకౌంట్లో డెబిట్ అయినా అవతలి వారికి చేరదు. ఇంటర్-బ్యాంక్ సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరగొచ్చు. 3 రోజుల్లో డబ్బు తిరిగి రాకపోతే మీరు వాడిన <<17922440>>UPI<<>> యాప్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా NPCI పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలి. SHARE IT

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9పై సుప్రీంలో కాసేపట్లో విచారణ జరగనుంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపించనున్నారు. అటు ఈ జీవో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషనర్ గోపాల్రెడ్డి వాదిస్తున్నారు. దీంతో జీవోపై SC స్టే విధిస్తే ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? లేక సర్కార్ ముందుకే వెళ్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.

కుటుంబ సభ్యులందరూ భోజనానికి కూర్చున్న సమయంలో భిక్షగాడు వస్తే తప్పకుండా భిక్ష వేయాలని పండితులు చెబుతున్నారు. ఆకలితో అలమటించేవారు ఆ సమయంలో భగవత్స్వరూపులతో సమానమట. అలాంటివారి కడుపు నింపితే ఎంతో పుణ్యం దక్కుతుందని వారు చెబుతున్నారు. అయితే పితృకార్యాలు నిర్వహించేటప్పుడు మాత్రం గృహస్థులు ఎవ్వరికీ భిక్ష ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు.

వాస్తు శాస్త్రం సొంత గృహాలతో పాటు అద్దె ఇళ్లకు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఏ ప్రాంతంలో నివసించేవారైనా వాస్తును అనుసరిస్తే ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. నివాస స్థలంలో తగిన వాస్తు విధానాలు పాటించడం ద్వారా తక్కువ రోజుల్లోనే శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. స్థల యాజమాన్యం కంటే అందులో నివసించే వ్యక్తి పొందే సానుకూల శక్తే ప్రధానమని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.65 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని పేర్కొన్నాయి. అటు బుక్ మై షోలో నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని మూవీ యూనిట్ పేర్కొంది.
Sorry, no posts matched your criteria.