India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 19న MCA వేడుకలు నిర్వహించనుంది. గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, రవిశాస్త్రి, సచిన్ లాంటి లెజెండరీ ప్లేయర్లతోపాటు రోహిత్, రహానే, సూర్య తదితర ముంబై క్రికెటర్లందరూ హాజరుకానున్నారు. 1974లో 33వేల మంది కెపాసిటీతో ప్రారంభమైన ఈ గ్రౌండులో ఇప్పటివరకు 56 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి.

సంభల్లోని షాహీ జామా మసీదు వద్ద ఉన్న బావి విషయమై తమ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్థానిక యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు సర్వేను సవాల్ చేస్తూ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై CJI బెంచ్ విచారించింది. బావి ప్రదేశాన్ని హరి మందిర్గా పేర్కొనడాన్ని పిటిషనర్లు తప్పుబట్టారు. స్టేటస్ కో కొనసాగించాలని, ఎలాంటి ఆదేశాలను అమలు చేయకూడదని స్పష్టం చేసింది.

ప్రముఖ నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకలను అల్లు అర్జున్ వినూత్నంగా నిర్వహించారు. ‘పుష్ప కా బాప్’ అంటూ అడవి, ఫైర్, ఎర్ర చందనం దుంగలతో స్పెషల్ థీమ్ కేక్ను రూపొందించారు. అరవింద్ కేక్ కట్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వేడుకలో కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్న. మీ గొప్ప మనసుతో మా జీవితాలను ప్రత్యేకంగా మార్చినందుకు థాంక్స్’ అని రాసుకొచ్చారు.

భారత క్రికెటర్లు వైవాహిక జీవితాన్ని నిలుపుకోవడంలో విఫలం అవుతుండటం ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తోంది. క్రికెటర్లు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ మనీశ్ పాండే చేరినట్లు తెలుస్తోంది. 2019లో నటి ఆశ్రితా శెట్టిని మనీశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో చేసుకున్నారని, పెళ్లి ఫొటోలు డిలీట్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

AP: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు CRDA టెండర్లు ఆహ్వానించింది. రాజధానిలో రూ.2,816 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 31 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉన్నట్లు పేర్కొంది. గ్రావిటీ కాలువ పనులు, కొండవీటి వాగు పనులు, కృష్ణాయపాలెం, శాఖమూరులో రిజర్వాయర్, వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వివరించింది.

హీరో విశాల్ అనారోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. కష్టాలను అధిగమించి ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ‘విశాల్ చాలా ధైర్యవంతుడు. మంచి మనసున్న వ్యక్తి. ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. త్వరలోనే సింహం మాదిరి గర్జిస్తారు’ అని పేర్కొన్నారు. <<15094492>>‘మదగజరాజు’<<>> ఈవెంట్లో విశాల్ వణుకుతూ మాట్లాడటం అభిమానులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

AP: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఈ ఒప్పందం జరిగింది. జనరేట్ ఏఐని ఉపయోగించేలా ఫ్లాట్పామ్ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

‘గేమ్ ఛేంజర్’ సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. ‘చరణ్.. అప్పన్న క్యారెక్టర్లో ఇరగదీశావ్. ఆ పాత్రకు జీవం పోశావ్. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. ఈ సినిమాను అందించినందుకు శంకర్కు ధన్యవాదాలు. నాకు చరణ్ నటించిన మూవీల్లో మగధీరలో హర్ష& కాలభైరవ, ఆరెంజ్లో రామ్, రంగస్థలంలో చిట్టిబాబు, RRRలో అల్లూరి సీతారామరాజు ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం’ అని తెలిపారు.

AP: తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వీరిపై సీఎం చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘అసలు బాధ్యులను వదిలేసి వేరేవారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ, గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేయడం ఏంటీ? అసలైన బాధ్యులు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబుకు పాపం తగులుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

TG: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. అప్పటి నుంచీ అధికారులు ఆయన్ను పలు ప్రశ్నలపై విచారిస్తున్నారు. రేసు సమయంలో రెడ్డి HMDA ముఖ్య ఇంజినీర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో FEOకి 45.71 కోట్ల బదిలీ, HMDAపై ఆదాయ పన్ను భారంపై ఏసీబీ వరస ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.