India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిసలాటలతో సాగాయి. బెంచ్ మార్క్ సూచీల్లో కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయుల్లో బుల్స్-బేర్స్ తమ పట్టు నిలుపుకున్నారు. Sensex 241 పాయింట్లు కోల్పోయి 77,378 వద్ద, Nifty 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద స్థిరపడ్డాయి. IT స్టాక్స్ 3.44% లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇతర అన్ని రంగాలు నష్టాలబాటపట్టాయి. Q3 ఫలితాలు మెప్పించడంతో TCS 5.60% లాభపడింది.

అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.

దేశంలో hMPV వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ థంబ్నెయిల్స్తో అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది.

టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.

TG: ఈ-కార్ రేస్ కేసులో KTR అరెస్టయితే ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయనేమైనా దేశం కోసం పోరాడారా అని ప్రశ్నించారు. KCR, రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉందని, అందుకే కేసులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. KCR ఫ్యామిలీ అంతా అవినీతిమయమన్నారు. ఈ-కార్ రేసులో ప్రభుత్వానికి రూ.700 కోట్ల లాభాలు ఎక్కడొచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు.

భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయం అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. పుష్ప-2 సినిమా విజయం తర్వాత ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో నటిస్తున్నారు. చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుండగా రష్మిక గాయపడటం గమనార్హం. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని రష్మిక అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ ట్రైలర్ను ఇవాళ సా.5:53 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.
Sorry, no posts matched your criteria.