News October 3, 2025

PHOTO GALLERY: ఘనంగా ముగిసిన ‘విజయవాడ ఉత్సవ్’

image

AP: విజయవాడలో తొలిసారి నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 22 నుంచి నేటి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు, ఈవెంట్లు ప్రజలను ఆకట్టుకున్నాయి. చివరి రోజు నిర్వహించిన కార్నివాల్‌ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. సీఎం చంద్రబాబు నేటి కార్నివాల్‌కు హాజరై ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు.

News October 3, 2025

వారంతా మూడేళ్లలో తిరిగి వస్తారు: చంద్రబాబు

image

AP: దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ విజయవాడకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని పనులు తిరిగి ట్రాక్‌లో పెట్టామని, ఉపాధి కోసం విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు మూడేళ్లలో ఇక్కడే స్థిరపడడానికి వెనక్కి వస్తారని చెప్పారు. విజయవాడ ఉత్సవ్‌తో నగరంలో నూతన ఉత్సాహం కన్పిస్తోందన్నారు. టెంపుల్ టూరిజం కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ముఖ్యం అని విజయవాడ ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.

News October 3, 2025

‘కాంతార ఛాప్టర్-1’ వచ్చేది ఈ OTTలోనే!

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార ఛాప్టర్-1’ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్‌ను ZEE నెట్‌వర్క్ కొనుగోలు చేసింది. రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

News October 2, 2025

కాసేపట్లో కర్రల సమరం

image

AP: కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో కాసేపట్లో కర్రల సమరం ప్రారంభం కానుంది. ఏటా దసరా రోజు బన్ని ఉత్సవంలో భాగంగా అర్ధరాత్రి 12గంటలకు మాళమ్మ మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. వాటిని దక్కించుకోవడానికి ఇరు వర్గాలు పోటీపడతాయి. ఈ ఉత్సవంలో హింస చెలరేగకుండా 800మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. 50 పడకల తాత్కాలిక వైద్య శిబిరాన్ని సిద్ధం చేశారు.

News October 2, 2025

రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు: APSDMA

image

AP: రేపు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఉదయానికి బలహీనపడనుండగా, దాని ప్రభావం రేపు కొనసాగనుంది.

News October 2, 2025

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

AP: ధ్వజావరోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్ 24న ధ్వజారోహణంతో మొదలైన ఉత్సవాలు ఇవాళ్టి వరకు వైభవంగా జరిగాయి. చివరి రోజైన ఇవాళ శ్రీవారు బంగారు తిరుచ్చి వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడి రూపంలో దర్శనమిచ్చారు. లక్షల మంది భక్తులు వివిధ వాహన సేవల్లో మాడ వీధుల్లో ఊరేగిన వేంకటేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

News October 2, 2025

పాకిస్థాన్‌కు మరో ఘోర పరాజయం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ షాకిచ్చింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన PAK 129 పరుగులకే ఆలౌటైంది. అనంతరం BAN 130 పరుగుల లక్ష్యాన్ని 31.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా ఇటీవల మెన్స్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో పాక్ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

News October 2, 2025

త్వరలో భారత్ – చైనా మధ్య విమాన సర్వీసులు

image

భారత్ – చైనా మధ్య త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గల్వాన్ ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ఐదేళ్లుగా సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత నెలలో మోదీ, అంతకుముందు జైశంకర్ చైనాలో పర్యటించడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలో విమాన సర్వీసుల రాకపోకలకు మార్గం సుగమమైంది.

News October 2, 2025

స్వగ్రామంలో ముగిసిన సీఎం రేవంత్‌ పర్యటన

image

TG: తన స్వగ్రామమైన నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లిలో దసరా పండుగను జరుపుకున్న సీఎం రేవంత్ కొడంగల్‌కు చేరుకున్నారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. అంతకుముందు కొండారెడ్డిపల్లిలో కోట మైసమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి జమ్మిచెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

News October 2, 2025

ఇక విండోస్ 10కి కాలం ముగిసినట్లే!

image

OCT 14 నుంచి విండోస్ 10కు ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ ఉండబోవని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే సపోర్ట్ నిలిపివేసినా OS మాత్రం పనిచేస్తుందని పేర్కొంది. సెక్యూరిటీ రిస్క్, మాల్‌వేర్, కంపాటబిలిటీ వంటి సమస్యలతో ముప్పు ఉందని వివరించింది. యూజర్లను విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. విండోస్ 10నే వినియోగించాలనుకుంటే ఏడాదిపాటు ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ కవరేజీకి అవకాశం కల్పిస్తోంది.