India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వైతిలింగానికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. కాగా ఇక్కడి ఏకైక ఎంపీ స్థానానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది.
AP: మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ అంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘అధికారాన్ని చంద్రబాబు దోచుకోవడానికి ఉపయోగించాడు. నేను సంక్షేమానికి వినియోగించాను. ప్రతి గ్రామంలో మా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా’ అంటూ ప్రశ్నించారు.
AP: అభివృద్ధికి ఓటు వేస్తారా? విధ్వంసానికి వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ‘ఈ ఐదేళ్లలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు. సంక్షేమానికి ఓటు వేస్తారా? సంక్షోభం సృష్టించిన వైసీపీకి వేస్తారా? వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు. జగన్ 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు’ అని పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో బాబు ఆరోపించారు.
చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైనా గుర్తొస్తుందా అంటూ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రశ్నించారు. ‘మేనిఫెస్టోను 99శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ప్రతి సంక్షేమ పథకంలో మీ బిడ్డ కనిపిస్తాడు. వాలంటీర్లను చంద్రబాబు ఆంబోతులంటూ కించపరిచాడు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది’ అని పేర్కొన్నారు.
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తమ జట్టుకు పాకిస్థాన్ సెలక్టర్లు కోచ్గా వ్యవహరించనున్నారు. మహమ్మద్ యూసుఫ్, అబ్దుల్ రజాక్ తాత్కాలిక హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించనున్నారు. WC నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే మ్యాచ్లు ఆడుతోంది. ఇటీవల కొందరి పేర్లను పరిశీలించినా వారు ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జాసన్ గిల్లెస్పీ, సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్ పేర్లను PCB పరిశీలిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెల్లడిస్తారు. ఏప్రిల్ 16 వరకు తన కొడుకుకు పరీక్షలు ఉన్నాయని అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
వరుస అప్డేట్లతో పుష్ప-2 టీజర్పై మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. మాస్ జాతర అంటూ ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్ తాజాగా మరో పోస్టర్తో అంచనాలను అమాంతం పెంచేశారు. చేతిలో గొడ్డలితో సింహాసనంపై కూర్చున్న పుష్పరాజ్ మాస్ లుక్లో కనిపిస్తున్నారు. ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ రిలీజ్ కానుంది. పుష్పరాజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే గంటలు లెక్కేసుకుంటున్నారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘అవ్వాతాతల్ని చంపుతున్న హంతకుడు చంద్రబాబు. తన మనిషి నిమ్మగడ్డతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి పెన్షన్లను నిలిపివేయించాడు. మండే ఎండల్లో పేదల్ని రోడ్డుపై నిలబెట్టాడు. రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబుది శాడిజం కాక మరేమిటి? చంద్రబాబు రాజకీయం మొత్తం దగా, మోసం, వెన్నుపోటే’ అని మండిపడ్డారు.
మాతృత్వంపై కన్నడ నటి హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. మీకు పెళ్లై నాలుగేళ్లవుతున్నా ఎందుకు పిల్లల్ని కనలేదు? అన్న ప్రశ్నకు ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. ఈ విషయంలో భర్త మద్దతు కూడా ఉంది. నా దృష్టిలో సొంతంగా పిల్లల్ని కనడం కన్నా ఓ కుక్క పిల్లని కూడా సొంత బిడ్డలా పెంచుకోవచ్చు. ఇక వృద్ధాప్యం గురించి నాకు ఏ మాత్రం బాధలేదు’ అని ఆమె చెప్పారు.
AP: ఎన్నికల ప్రచారంలో NDA కూటమి దూకుడు పెంచనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు కలిసి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీళ్ల ప్రచారం ఉండే ఛాన్సుంది.
Sorry, no posts matched your criteria.