News October 15, 2024

భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా

image

కెనడాలోని భారత హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. వారు కచ్చితంగా తమ దేశాన్ని వీడాల్సిందేనని, దౌత్యవేత్తలుగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ ఆరుగురు తమ దేశంలో క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, పబ్లిక్ సేఫ్టీకి విఘాతం కలిగించారని సంచలన ఆరోపణలు చేసింది. కాగా, కెనడా ఈ ప్రకటన చేయకముందే భారత్ ఆ ఆరుగురు <<14357189>>దౌత్యవేత్తలను<<>> వెనక్కి పిలిచింది.

News October 15, 2024

ఇస్రో చీఫ్‌కు వరల్డ్ స్పేస్ అవార్డు

image

ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024ను అందుకున్నారు. మిలాన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది.

News October 15, 2024

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ముందుజాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

News October 15, 2024

అనిల్ అంబానీని లాభాల్లోకి తెచ్చిన వారసులు

image

నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని ఆయన కుమారులు అన్‌మోల్, అన్షుల్ లాభాల్లోకి తీసుకువచ్చి సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. వారి రాకతో రిలయన్స్ పవర్ రూ.20,526 కోట్ల విలువైన కంపెనీగా నిలబడింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలూ లాభాల బాట పట్టడంతో కొడుకులను చూసి అనిల్ మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంతో అనిల్ భూటాన్‌లో సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.

News October 15, 2024

వ్యాయామం ఎంతసేపు చేయాలంటే?

image

ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. కానీ రోజుకు ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలనే దానిపై కొందరికి అవగాహన ఉండదు. వారంలో 5 రోజులపాటు గంట చొప్పున ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు అదుపులో పెట్టుకుని వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి బరువు తగ్గుతారు. అలాగే నడక కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ వీలైనంత దూరం నడక కొనసాగించాలి.

News October 15, 2024

RED ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారత వాతావరణ విభాగం (IMD) నేడు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News October 15, 2024

నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం

image

TG: తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు హాలిడేస్ ఇచ్చారు. 13 రోజుల పాటు సెలవులు కొనసాగాయి. ఇక జూనియర్ కాలేజీలు నిన్నటి నుంచి పున:ప్రారంభమయ్యాయి.

News October 15, 2024

మంత్రి నారాయణ 100 దరఖాస్తులు.. ఎన్ని గెలిచారంటే?

image

AP: తన గెలుపు కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ రూ.2 కోట్లతో 100 వైన్ షాపులకు దరఖాస్తులు చేశారు. వీటిలో 3 దుకాణాలు దక్కగా, ఒక్కో షాపును ఐదుగురికి ఇచ్చేశారు. అలాగే విజయవాడకు చెందిన ఓ బార్ ఓనర్ ఏకంగా 480 దరఖాస్తులు వేయగా 11 షాపులు దక్కించుకున్నారు. ఇక పెనుగంచిప్రోలులోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తినీ అదృష్టం వరించింది. మొత్తం దుకాణాల్లో 10 శాతం మహిళలకే దక్కాయి.

News October 15, 2024

ABDUL KALAM: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా

image

శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు నేడు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఆయన జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మదినోత్సవాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా వరించింది. కలాం ఎప్పుడూ చెప్పే ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశం ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిలిస్తుంది.

News October 15, 2024

ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా మెండిస్

image

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.