News January 10, 2025

IT స్టాక్స్‌ దూసుకుపోతున్నాయ్..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం ఫ్లాట్‌గా ఆరంభ‌మ‌య్యాయి. Sensex 77,682(+62) వ‌ద్ద, Nifty 23,551 (+25) వ‌ద్ద ట్రేడింగ్ ఆరంభించాయి. 5 Min Time Frameలో Bullish Candle ఫాం అయ్యింది. IT స్టాక్స్ 2.23% లాభాల‌తో దూసుకుపోతున్నాయి. రియ‌ల్టీ, ఆయిల్‌&గ్యాస్ షేర్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి.

News January 10, 2025

విదేశీ పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం: సీఎం

image

TG: వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారులకు CM రేవంత్ సూచించారు. మామునూరు విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై స‌మీక్షించారు. విదేశీ పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా ఎయిర్‌పోర్ట్ ఉండాల‌ని, ద‌.కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని వివరించారు. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు.

News January 10, 2025

వన్డే సిరీస్‌.. రాహుల్‌కు రెస్ట్?

image

ఇంగ్లండ్‌తో వచ్చే నెల నుంచి స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ నుంచి తనకు రెస్ట్ ఇవ్వాలని కోరినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. BGT ఆడిన రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం అయ్యేందుకు తనను వన్డే సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పినట్లు వెల్లడించారు. అయితే CTలో శాంసన్, పంత్ నుంచి రాహుల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.

News January 10, 2025

‘హైడ్రా’ నిర్ణయం మంచిదే.. కానీ: వెంకయ్య

image

TG: కనుమరుగవుతున్న చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలని సూచించారు. ఆక్రమణల కూల్చివేతలతో నష్టపోయిన పేదలను ఆదుకోవాలన్నారు. దేశం బాగుండటం అంటే మనుషులతో పాటు నదులు, చెరువులు, అడవులు, పశుపక్షాదులు బాగుండాలని వెంకయ్య అన్నారు.

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’ రివ్యూ&రేటింగ్

image

నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ. సామాజిక కార్యకర్తగా, IASగా రామ్ చరణ్ మెప్పించారు. SJ సూర్య యాక్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. BGM పర్వాలేదు. ‘జరగండి జరగండి..’ సాంగ్ ఆకట్టుకుంటుంది. రొటీన్ స్టోరీ, మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం మైనస్. కామెడీ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ ఫైట్ బోర్ తెప్పిస్తుంది. డైరెక్టర్ శంకర్ మార్క్ పాటలకే పరిమితమైంది.
RATING: 2.5/5

News January 10, 2025

20 కోచ్‌లతో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఉ.5.45 గంటలకు విశాఖ నుంచి, మ.3 గం.కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.

News January 10, 2025

ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం

image

TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 10, 2025

‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం

image

TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.

News January 10, 2025

నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ

image

TG: సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

News January 10, 2025

చైనాలో మంకీపాక్స్ కొత్త మ్యుటెంట్ కలకలం

image

ఇప్పటికే hMPVతో భయపెడుతున్న చైనా మరో బాంబ్ పేల్చింది. మంకీపాక్స్‌కు చెందిన కొత్త మ్యుటెంట్ డిటెక్ట్ అయిందని ప్రకటించింది. కాంగో నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించామని, అతడి నుంచి మరో నలుగురికి ఇది సోకిందని చెప్పింది. కాగా గతేడాది కాంగోలో మంకీపాక్స్ విజృంభించడంతో WHO దాన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తాజాగా ఈ వైరస్ చైనాకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.