News October 15, 2024

BRS అనుమతిచ్చిన దాన్నే KTR వ్యతిరేకిస్తున్నారు: CMO

image

TG: తమ పదేళ్ల పాలనలో దామగుండం ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము ఒప్పుకోలేదన్న KTR వ్యాఖ్యలపై CMO స్పందించింది. గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. BRS తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టుపై ఇప్పుడు KTR రాజకీయం చేస్తున్నారని వివరించింది.

News October 15, 2024

ఆలయంపై దాడితో కలవరపడ్డా: KTR

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి తనను కలవరపాటుకు గురిచేసిందని KTR చెప్పారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్ సహనశీలతకు మచ్చ అని ఆయన స్పష్టం చేశారు. ఆలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని విమర్శించారు.

News October 14, 2024

ఎన్నిక‌ల కోస‌మే ట్రూడో ‘అనుమానిత’ స్టంట్‌

image

కెనడాలో ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జ‌ర్ హ‌త్య‌ను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కెన‌డాలో ఇటీవల జీవ‌న వ్య‌యాలు భారీగా పెరగడంతో స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ట్రూడో ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ప్రాబ‌ల్యం ఉన్న ఖ‌లిస్తానీ వేర్పాటువాదుల మ‌ద్ద‌తు కోసమే నిజ్జర్ హత్యను ట్రూడో రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.

News October 14, 2024

ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

image

నిజ్జర్ హత్య కేసులో కెన‌డా దుందుడుకు ప్ర‌య‌త్నాల‌పై భార‌త్ చ‌ర్య‌లకు ఉపక్రమించింది. ఆరుగురు కెన‌డా దౌత్య‌వేత‌ల‌ను బ‌హిష్క‌రించింది. భార‌త్‌లో కెన‌డా తాత్కాలిక హైక‌మిష‌న‌ర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ పాట్రిక్ హెబర్ట్ సహా నలుగురు కార్యదర్శులను బహిష్కరిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వీరంద‌ర్నీ అక్టోబ‌ర్ 19న రాత్రి 11.59 గంట‌ల‌లోపు భార‌త్ వీడి వెళ్లాల‌ని ఆదేశించింది.

News October 14, 2024

పాక్ ఘోర ఓటమి.. భారత్‌కు బిగ్ షాక్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో 54 రన్స్ తేడాతో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. దీంతో భారత్, పాక్ టోర్నీ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. 111 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కాగా గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌లో పాగా వేయగా తాజాగా న్యూజిలాండ్ బెర్తు ఖరారు చేసుకుంది.

News October 14, 2024

PHOTOS: చెమటోడ్చిన భారత క్రికెటర్లు

image

భారత సీనియర్ క్రికెటర్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కెప్టెన్ రోహిత్‌శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, పేస్ గన్ బుమ్రాతో పాటు యువ ఆటగాళ్లు సైతం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. Oct 16-Nov 5 వరకు 3 టెస్టులు జరగనున్నాయి. టెస్టుల్లో రోహిత్‌సేన ఇటీవల బంగ్లాదేశ్‌‌ను చిత్తుచేసిన విషయం తెలిసిందే.

News October 14, 2024

ఏపీ, తెలంగాణకు గుడ్‌న్యూస్

image

AP, TGలో పలు రోడ్ల నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నల్గొండలో రూ.516 కోట్లతో 4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించనుంది. దీని ద్వారా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ మధ్య ట్రాఫిక్ సమస్య తీరనుంది. అటు APలో రూ.400 కోట్లతో 200KM మేర 13 స్టేట్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.

News October 14, 2024

పాకిస్థాన్ లక్ష్యం 111 రన్స్.. భారత్ సెమీస్ వెళ్లాలంటే ఇలా జరగాలి..

image

భారత్ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20ఓవర్లలో 110/6 స్కోర్ చేసింది. మహిళల T20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ వెళ్లాలంటే 10.4 ఓవర్ల తర్వాతే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ 10.4 ఓవర్ల లోపు టార్గెట్ ఛేదిస్తే పాకిస్థాన్ క్వాలిఫై అవుతుంది. పాక్ ఓడితే పాకిస్థాన్, ఇండియా రెండూ ఇంటి ముఖం పడతాయి. కీలకమ్యాచ్‌లో పాక్ 8క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం.

News October 14, 2024

కుంగిన రైల్వే ట్రాక్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

image

AP: గుంటూరు జిల్లా పొన్నూరు(మ) మాచవరం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో మాచవరం చేరుకున్న తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఇబ్బంది తలెత్తగా, రైలును వెనక్కి మళ్లించి 3వ రైల్వే లైన్ ద్వారా HYD పంపించారు. మాచవరంలో ట్రాక్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు.

News October 14, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిల్లో ఉంటున్న విద్యార్థులను సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని సూచించారు. అటు వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.