India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాణ సమయంలో ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీల నుంచి శబ్దం వినిపించేలా పరికరాలను అమర్చాలని కేంద్రం ఆదేశించింది. పాదచారులు, ఇతర వాహనదారులు గుర్తించేందుకు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్(AVAS) అమర్చాలని పేర్కొంది. 2026 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే EVలకు తప్పనిసరి చేసింది. ప్రస్తుత వాహనాలకూ AVASలను అమర్చుకోవాలని తెలిపింది. శబ్దం రాకపోవడంతో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECIL)22 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు OCT 24వరకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.seci.co.in/

‘కాంతార చాప్టర్-1’ సినిమా టికెట్ <<17869775>>రేట్ల పెంపునకు<<>> ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంటే.. మనం వాళ్ల సినిమాలకు రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు తెలంగాణలో సైతం డబ్బింగ్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచడం లేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

విజయదశమి ముంగిట బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.1,18,310కు చేరింది. కాగా ఐదు రోజుల్లోనే రూ.3,870 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,300 ఎగబాకి రూ.1,08,450 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,61,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

AP: పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు రూపాయికే పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 50 చ.గజాల విస్తీర్ణంలో జీ+1, ఆలోపు భవన నిర్మాణానికి ఇది వర్తిస్తుంది. ఇంటి ప్లాన్, అప్లికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసి రూపాయి చెల్లిస్తే పర్మిషన్ వచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రజలకు ఏటా రూ.6 కోట్ల భారం తప్పనుంది.

AP: గుంటూరులో పెద్దలు తమ పెళ్లిని అంగీకరించలేదనే మనస్తాపంతో ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పల్నాడు జిల్లా దమ్మాలపాడుకు చెందిన గోపి ఈ నెల 5న అత్తోటకు చెందిన లక్ష్మీప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 27న రైలు కింద పడి చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక తర్వాతి రోజు అదే ప్రాంతంలో ప్రియాంక కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

శివాలయంలో – 5
వైష్ణవాలయంలో – 7
అమ్మవారి ఆలయాల్లో – 8
ఆంజనేయ స్వామికి – 11
నవగ్రహాలకు – 9
అయ్యప్ప స్వామికి – 5
వినాయకుడికి – 3
సుబ్రహ్మణ్యస్వామికి – 27

వంటల రుచిని పెంచడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. నెయ్యిలో ఉండే విటమిన్-A, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మసౌందర్యాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవారు స్నానం చేసే ముందు నెయ్యిని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని కాంతిమంతం చేయడంతో పాటు ముఖంపై ఉండే ముడతలనూ తగ్గిస్తుంది.
<<-se>>#BodyCare<<>>

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పండుగకు రిలీజయ్యే సినిమాల జాబితా మూడుకు చేరింది. జనవరి-2026, 9న రాజాసాబ్, 14న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ విడుదల కానుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. మరి ఈ మూడు సినిమాల్లో దేనికోసం మీరు ఎదురుచూస్తున్నారు?

కరూర్ తొక్కిసలాట ఘటనతో TVK చీఫ్ విజయ్ ఇంకా రాజకీయ పరిణతి సాధించనట్లు స్పష్టమవుతోంది. దుర్ఘటనలో 41 మంది చనిపోయినా, 50 మందికి పైగా గాయపడ్డా బాధిత కుటుంబసభ్యులను ఇప్పటివరకు పరామర్శించలేదు. కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ‘ఆ ఘటనతో నా గుండె పగిలింది’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే చేశారు. మరోవైపు విజయ్ పరిహారం ప్రకటించారని, ప్రస్తుతం ఆయన షాక్లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.