India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కుప్పంలో చంద్రబాబు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలవుతారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేశారు. డబ్బుల కోసం నేనెప్పుడూ కక్కుర్తి పడలేదు. బాబు తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నారు. పవన్ రెండు రోజులు ప్రచారం చేసి 5 రోజులు పడుకుంటారు. పొత్తు పెట్టుకోవడం అంటే సమాధి కట్టుకోవడమే’ అని ఆయన మండిపడ్డారు.
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ విడుదలైన 9 రోజుల్లోనే రూ.101.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఎల్లప్పుడూ గొప్ప కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలని పేర్కొంది. కాగా వచ్చే మూడేళ్లలోపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసే ఫిల్మ్లో తాను నటించాలని కోరుకుంటున్నానని 2022లో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
AP: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ‘పుష్ప-2’ టీజర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ క్రేజీ ట్వీట్ చేసింది. ‘పుష్ప-2’ టీజర్ విడుదలకు అంతా సిద్ధమని పేర్కొంది. ఈ క్రమంలో టీజర్ కట్ పూర్తయినట్లు తెలిపేలా ఉన్న ఫొటోను పంచుకుంది. కాగా ‘పుష్ప’కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చంద్రబాబుపై YCP నేత విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు చిప్ బాగా వీక్ అయింది. ప్రచారంలో మళ్లీ హాస్యగుళికలు విసురుతున్నారు. విద్యార్థులకు రిజర్వేషన్లు తెచ్చింది ఆయనేనట! అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి తెచ్చారట! గతంలో తాను బ్రిటిష్ వారిపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చానని బాంబు పేల్చారు. జనం ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఆ కామెడీ ఏంటి బాబు గారూ?’ అని ట్వీట్ చేశారు.
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమలు’ ఆహాలో రానుంది. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు AHA ట్వీట్ చేసింది. ‘అందరూ ఇష్టపడే మూవీ, ప్రేమలు ఆహాలో వస్తోంది. ఆధునిక ప్రేమ కథను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
AP: కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ప్రకటించిందనే వార్త వైరల్ అవుతోంది. దీన్ని టీడీపీ ఖండిస్తూ ట్వీట్ చేసింది. ‘జగన్, నువ్వు ఎన్ని ఫేకులు చేసినా, పులివెందులలో కూడా నువ్వు ఓడిపోవడం ఖాయం. బాబాయ్ హత్యకు, కడప జిల్లా ప్రజలు నీకు బుద్ధి చెప్పడం ఖాయం’ అని పేర్కొంది.
ఆర్సీబీ వరుస ఓటములపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు ఆ టీమ్ ట్రోఫీ గెలవకపోవడానికి మాజీ ఓనర్ విజయ్ మాల్యా కారణమని నెట్టింట తిట్టిపోస్తున్నారు. ‘తండ్రి చేసిన పాపాలు పిల్లలకు తగిలినట్లు.. మాల్యా చేసిన పాపాలు ఆర్సీబీకి తగిలినట్లున్నాయి’ అని పోస్టులు పెడుతున్నారు. భారత్లోని పలు బ్యాంకులకు రూ.వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన మాల్యా దేశం విడిచి ఇంగ్లండ్కు పారిపోయిన విషయం తెలిసిందే.
ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన విద్యుత్ బిల్లు బకాయిల సమస్యకు పుల్స్టాప్ పడనుంది. 2015 నుంచి ఉన్న బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు TSSPDCL CMD ముషారఫ్ ఫరూఖీతో చర్చించినట్లు ఆయన ట్వీట్ చేశారు. విద్యుత్ శాఖకు HCA రూ.1.67 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్న విషయం తెలిసిందే.
అన్నం వండలేదని ఓ వ్యక్తిని అతడి స్నేహితులే కొట్టి చంపారు. ఈ ఘటన HYDలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. బిహార్కు చెందిన బినయ్ సింగ్, సోనూతివారీ, సందీప్, హన్స్రామ్ కుత్బుల్లాపూర్లోని ఓ గదిలో అద్దెకుంటూ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సందీప్, సోనూ మద్యం తాగి గదికి వచ్చారు. అన్నం ఎందుకు వండలేదని ఇద్దరూ కలిసి హన్స్రామ్ను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Sorry, no posts matched your criteria.