News January 9, 2025

ఏంటి సార్.. మీ కోసం రోజుకు 12 గంటలు పనిచేయాలా?

image

వారానికి 70 గంటలు వర్క్ చేయాలని నారాయణమూర్తి, 90 గంటలు పనిలో ఉండాలని సుబ్రహ్మణ్యన్(L&T ఛైర్మ‌న్) సలహా ఇస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై సగటు వేతన జీవులు ఫైరవుతున్నారు. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సాధ్యమని, ఆఫీసులోనే సగం రోజు గడిపేస్తే భార్య, పిల్లలకు టైమ్ కేటాయించడమెలా అని నిలదీస్తున్నారు. కంపెనీ ఎదుగుదల కోసం వారు చెప్పినట్లే 90 గంటలు వర్క్ చేసినా శాలరీ హైక్స్ మాత్రం ఉండవంటున్నారు. మీరేమంటారు?

News January 9, 2025

తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

image

AP: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

News January 9, 2025

తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News January 9, 2025

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

image

TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

News January 9, 2025

BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్

image

BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

News January 9, 2025

Results Season: నష్టాలు తెచ్చాయి..!

image

స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా న‌ష్ట‌పోయాయి. కార్పొరేట్ సంస్థ‌లు Q3 ఫ‌లితాలు ప్ర‌క‌టించే సీజ‌న్ ప్రారంభంకావ‌డంతో ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. సెన్సెక్స్ 442 పాయింట్లు న‌ష్ట‌పోయి 77,681 వ‌ద్ద‌, నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. India Vix 14.69గా ఉంది. రియ‌ల్టీ, IT, మెట‌ల్‌, PSU బ్యాంక్స్‌, ఫైనాన్స్‌ రంగాలు న‌ష్ట‌పోయాయి. BAJAJ Auto టాప్ గెయినర్.

News January 9, 2025

గంభీర్ మోసకారి: మనోజ్ తివారీ

image

IND హెడ్ కోచ్ గంభీర్ మోసపూరిత వ్యక్తి అని, అతడు చెప్పినవాటినే పాటించడని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శించారు. IPLలో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నే మోర్కెల్‌ను ఏరికోరి తన టీమ్‌లోకి తెచ్చుకున్నారని, వారేం చేశారని ప్రశ్నించారు. కెప్టెన్‌ రోహిత్‌తో గంభీర్‌కు సమన్వయం లేదన్నారు. గతంలో KKR విజయాల కోసం తాను, కల్లిస్, నరైన్ తదితరులు ఎంతో కృషి చేసినా గౌతీ క్రెడిట్ తీసుకున్నాడని దుయ్యబట్టారు.

News January 9, 2025

CTET ఫలితాలు విడుదల

image

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 31వ తేదీన కీని విడుదల చేసి, జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థులు రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 9, 2025

‘భూభారతి’కి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.

News January 9, 2025

ఢిల్లీని గాలికొదిలేసిన గాంధీలు.. మీ కామెంట్!

image

సోనియా కుటుంబానికి తెలియకుండా కాంగ్రెస్‌లో చీమైనా చిటుక్కుమనదు! అలాంటిది ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటికీ రాహుల్, ప్రియాంకా గాంధీలు ఢిల్లీ దంగల్‌ను పట్టించుకోవడమే లేదు. AAP, BJP పోటాపోటీగా దూసుకెళ్తుంటే క్యాంపెయిన్ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాల్లో కాంగ్రెస్ వెనకబడింది. అగ్రనేతలెవరూ కానరావడం లేదు. RG ఎక్కడున్నారో తెలియదు. వారి తీరు ఓడిపోయే మ్యాచుకు ఆర్భాటం అనవసరం అన్నట్టుగానే ఉందా? మీ COMMENT