News September 28, 2025

దసరా: పల్లెబాట.. బస్టాండ్లు కిటకిట

image

TG: దసరాకు మరో 3 రోజులే ఉండటంతో ప్రజలు పట్నం నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. HYDలోని JBS, CBS బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు, మియాపూర్, LBనగర్‌, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. TGSRTC సుమారు 7వేలకు పైగా స్పెషల్ బస్సులు నడుపుతున్నా సీట్లు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. అటు MGBSలో బురద తొలగింపు ప్రక్రియ కొలిక్కి రావడంతో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

News September 28, 2025

పాపం.. రెండేళ్ల పిల్లాడూ చనిపోయాడు!

image

విజయ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో లోకం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు వదలడం కన్నీళ్లు పెట్టిస్తోంది. తమ అభిమాన నటుడు, నాయకుడిని చూసేందుకు తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చారు. రెండేళ్ల దురు విష్ణు అనే బాలుడి నుదుటికి TVK కండువా చుట్టి సంబరపడ్డారు. కానీ తొక్కిసలాట రూపంలో వచ్చిన మృత్యువు ఆ పిల్లాడిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మైనర్లు చనిపోయారు. మృతుల్లో పిన్న వయస్కుడు విష్ణునే.

News September 28, 2025

తేగలతో అనీమియాకు చెక్

image

చాలామంది మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపంతో రక్తహీనత ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టడంలో తేగలు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. తాటి టెంకల్ని నాటితే వచ్చే మొలకలే తేగలు. వీటిలో B1, B2, B3, C విటమిన్లతోపాటు పొటాషియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి పోషకలోపాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ C తెల్లరక్తకణాలను పెంచి వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

News September 28, 2025

చొరబాటు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

image

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పాక్ సరిహద్దు నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వారిని కాల్చి చంపాయి. మరికొంత మంది చొరబడే అవకాశం ఉందన్న సమాచారంతో ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తోంది.

News September 28, 2025

నవంబర్ నుంచి కరెంట్ ఛార్జీలు తగ్గింపు: మంత్రి

image

AP: నవంబర్ నుంచి కరెంట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు. యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచిందని విమర్శించారు. ‘అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లను నియంత్రించాం. భవిష్యత్తులో ఛార్జీలను మరింత తగ్గిస్తాం. ప్రజలపై భారం పడకుండా చూస్తాం. ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు తగ్గించాం’ అని తెలిపారు.

News September 28, 2025

ఆదివారాన్ని ఆరోగ్య వారంగా మార్చుకోవాలంటే?

image

ఆదివారం రోజున వేకువనే లేచి, స్నానం చేసి, సూర్యునికి నమస్కరించి, ఆదిత్య హృదయం పఠించి, పాయసం నివేదించడం ద్వారా చక్కని ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భగవదారాధనలో భాగంగా సూర్య నమస్కారాలు చేయడం ముఖ్యమని సూచిస్తున్నారు. ’ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు గోధుమలను గోవుకు తినిపించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. క్రమబద్ధమైన జీవనశైలికి, సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యుని ఆరాధన ఉత్తమ మార్గం’ అని అంటున్నారు.

News September 28, 2025

తొక్కిసలాటలో 40కి చేరిన మృతుల సంఖ్య

image

కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరింది. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న తమిళనాడులోని TVK పార్టీ చీఫ్ విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొలుత ముగ్గురే చనిపోయినట్లు వార్తలు రాగా తర్వాత మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. వీరిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉండటం విషాదకరం. అటు మృతుల కుటుంబాలకు PM మోదీ రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

News September 28, 2025

OFFICIAL: BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

image

బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. ముంబైలో జరిగిన వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, సెక్రటరీగా దేవజిత్ సైకియాను నియమించింది. సెలెక్టర్లుగా మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝాలకు అవకాశం ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన మిథున్ దేశవాళీ క్రికెట్ ఆడారు. IPLలో చెన్నై తరఫున ప్రాతినిథ్యం వహించారు.

News September 28, 2025

ACC ఛైర్మన్ నుంచి IND కప్ తీసుకుంటుందా?

image

ఇండియా, పాక్ మధ్య ఇవాళ ఆసియా కప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ACC ఛైర్మన్‌గా పాక్ మినిస్టర్ నఖ్వీ ఉన్నారు. ఒకవేళ IND గెలిస్తే ఆయన నుంచి ట్రోఫీ తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే ఫైనల్‌కు ముందు జరగాల్సిన కెప్టెన్ల ఫొటో‌షూట్‌ను IND బాయ్‌కాట్ చేసింది.

News September 28, 2025

తొక్కిసలాట.. పోలీసులు Vs టీవీకే

image

కరూర్ తొక్కిసలాటపై పోలీసులు, టీవీకే పార్టీ పరస్పర విమర్శలకు దిగాయి. ‘మీటింగ్‌కు మధ్యాహ్నమే రావాల్సిన విజయ్ సా.7 గంటలకు వచ్చారు. అప్పటికే క్రౌడ్ విపరీతంగా పెరిగి, పరిస్థితి చేయిదాటి పోయింది’ అని పోలీసులు తెలిపారు. అయితే అభిమానులను అదుపు చేయాల్సిన పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగడంతో తొక్కిసలాట జరిగిందని టీవీకే మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొంది. మరి ఈ ఘటనకు తప్పెవరిదని మీరనుకుంటున్నారు?