India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటక ఎమ్మెల్యే రాజు కాగే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘గ్యారంటీ స్కీం పొందిన వారు ఇతరులకు ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే, ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసినట్లే..’ అని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ పేదలు, రైతుల గురించి నోరు విప్పలేదని, బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.
AP: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 25న ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగియనుందని అధికారులు చెబుతున్నారు. నేడు మధ్యాహ్నం వరకు 95% పూర్తవుతుందన్నారు. ఈసీ అనుమతి తీసుకున్నాకే ఫలితాలను వెల్లడిస్తారని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈనెల 30లోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కోతుల బారి నుంచి చిన్నారిని కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించిన 13 ఏళ్ల <<13002122>>బాలిక<<>>కు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఊహించని ఆఫర్ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక ఆమె కార్పొరేట్ ఉద్యోగం చేయాలని అనుకుంటే తమ కంపెనీలో చేరవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఎల్లప్పుడూ మానవ చాతుర్యానికి దోహదపడుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఆమె సమయస్ఫూర్తి అభినందనీయమని కొనియాడారు.
బిహార్కు చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక్కసారి కూడా విజయం సాధించకపోయినా ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉన్నారు. కిషన్గంజ్కు చెందిన ఛోటేలాల్ మహతో 2004 నుంచి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా కిషన్గంజ్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఎవరైనా విరాళాలు ఇస్తున్నా తీసుకోకుండా తన సొంత ఖర్చుతోనే ఎన్నికలకు వెళ్తున్నారు.
కోహ్లీ వంద శాతం ఎఫర్ట్ పెట్టినా ఆర్సీబీ గెలవట్లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. బ్యాటింగ్ భారాన్ని విరాట్ తన భుజాలపై మోస్తున్నారని, ఏ ఒక్కరి నుంచి సపోర్ట్ రావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది IPLలో విరాట్ 105 సగటు, 146 స్ట్రైక్రేట్తో 316 రన్స్ చేయగా, మిగతా RCB ప్లేయర్లందరూ కలిపి 496 రన్స్ మాత్రమే చేశారు. దీంతో కోహ్లీ ఆర్సీబీ నుంచి వెళ్లిపోవాలని, అతడికి మంచి టీమ్ అవసరమంటున్నారు.
బాలకృష్ణ, కేఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి ‘వీర మాస్’ అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నారట. ఆ పేరును నిర్మాతలు ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు వార్తలొస్తున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సెంటిమెంట్ ప్రకారం ‘వీర’ అనే అక్షరాలు కలిసివచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారట.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ ఎమ్మెల్సీకి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాప్ చేసే పరికరాలకు సదరు ఎమ్మెల్సీ నిధులు సమకూర్చారని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయనను విచారిస్తే మరికొందరి నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారట. ఇప్పటివరకు పోలీసుల చుట్టే తిరిగిన ఈ కేసు ఇకపై రాజకీయ నేతల చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది.
IPL: రాజస్థాన్ రాయల్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాను ఆడిన మ్యాచులో ఒక్కో సిక్సర్కు 6 ఇళ్ల చొప్పున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో నిన్న RCBతో మ్యాచులో మొత్తం 13 సిక్సర్లు నమోదయ్యాయి. అంటే 78 ఇళ్లకు సౌర విద్యుత్ కల్పించనుంది ఆ ఫ్రాంచైజీ.
AP: జ్వరం నుంచి కోలుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా నేడు సాయంత్రం అనకాపల్లిలో రోడ్ షో, సభలో పాల్గొంటారు. రేపు ఎలమంచిలిలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.
TG: ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. BA, BCOM, BSC ఇతర డిగ్రీ కోర్సుల్లో 2000-2019 వరకు ఫెయిలైన వారు ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుముతో ఈనెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఒక్క సబ్జెక్టుకు ₹10వేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు ₹2వేలకు తగ్గించినట్లు తెలిపారు. వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.