India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఆమ్రపాలి, కరుణ, వాణి ప్రసాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)ను ఆశ్రయించారు. ఏపీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని, TGలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. DOPT ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈనెల 16లోపు ఏపీలో రిపోర్టు చేయాలని వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యులర్ సర్వీస్ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.
అక్టోబర్లో జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో ఇండియా-A జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ తిలక్వర్మ కెప్టెన్సీ చేయనున్నారు. అతడికి డిప్యూటీగా అగ్రెసివ్ ఓపెనర్ అభిషేక్శర్మ వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ ఒమన్ వేదికగా అక్టోబర్ 18-27 మధ్య జరగనుంది. గ్రూప్-Aలో బంగ్లాదేశ్-A, శ్రీలంక-A, అఫ్గానిస్థాన్-A, హాంకాంగ్ ఉండగా గ్రూప్-Bలో ఇండియా-A, పాకిస్థాన్-A, UAE, ఒమన్ ఉన్నాయి.
చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. కొందరు ఒకేసారి ఎక్కువగా టీ పెట్టుకొని మరలా కాచుకొని తాగుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ కాచుకున్న 15-20 నిమిషాల్లోపు తాగడం మంచిదని చెప్పారు. దీనిని విస్మరిస్తే జీర్ణశయాంతర వ్యవస్థ, ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుందన్నారు. జపాన్లో కాచి పక్కన పెట్టిన టీని పాము విషం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని తెలిపారు.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘2008లో కోహ్లీ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడిపై నా అభిప్రాయం మారలేదు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్. శ్రీలంకపై తొలిమ్యాచ్లోనే ఆయనతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం నాకింకా గుర్తుంది. ఎప్పుడూ పరుగుల ఆకలితో ఉండటం ఆయన్ను దిగ్గజ క్రికెటర్ను చేసింది. NZ, AUS టెస్టు సిరీస్ల్లోనూ కోహ్లీ రాణిస్తారు’ అని తెలిపారు.
ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. డారెన్ ఏస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ.రాబిన్సన్ ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన అధ్యయనానికి గానూ వీరికి పురస్కారం దక్కిందని తెలిపింది.
TG: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కొందరు ఆశావహులు మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం తెస్తున్నారు. తాజాగా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న యాదాద్రి(D) తుర్కపల్లి(M) మల్కాపూర్కి చెందిన కొడారి లత మల్లేశ్ మ్యానిఫెస్టో వైరల్ అవుతోంది. ఆడబిడ్డ పుడితే ₹5వేలు, ఉచిత మంచి నీరు, ఇంటి పన్ను ఫ్రీ, ఎవరైనా మరణిస్తే ₹20 వేలు ఇస్తామంటూ ఆమె ఇచ్చిన హామీలు గ్రామస్థుల్ని ఆశ్చర్యపర్చాయి.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్లో హత్యకు గురైన మాజీ మంత్రి బాబా సిద్దిఖీ సహా ఆయన కుమారుడు, MLA జీషన్ సిద్దిఖీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దర్నీ చంపడానికి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. హత్యకు ప్లాన్ చేసిన స్పాట్లో సిద్దిఖీతోపాటు జీషన్ కూడా ఉంటారని నిందితులకు సమాచారం ఉందని, ఎవరు కనిపిస్తే వారిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.
TG: గ్రూప్-1 హాల్టికెట్లను TGPSC విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ TGPSC ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్టికెట్లు పొందవచ్చు. హాల్టికెట్ల కోసం ఇక్కడ <
ప్రస్తుత రోజుల్లో జాబ్ కొట్టడమనేది యువతకు కత్తి మీద సామే. అయితే డిఫరెంట్ అప్రోచ్, స్కిల్స్ ఉంటే కొలువు ఈజీగానే పొందవచ్చనడానికి ఈ ఘటనే నిదర్శనం. పని అనుభవం లేని, రెజ్యూమ్ కూడా పెట్టని లైబా అనే యువతికి ఓ ఏజెన్సీ CEO తస్లీమ్ జాబ్ ఇచ్చారు. తన స్కిల్స్ వివరిస్తూ లైబా క్రియేట్ చేసిన వీడియో ఆకట్టుకుందని తస్లీమ్ తెలిపారు. 800 మందిని కాదని ఆమెను సెలక్ట్ చేయగా, మంచి పనితీరుతో రాణిస్తున్నారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.