News September 27, 2025

హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్

image

TG: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌‌గా నియమించింది. ప్రస్తుతం HYD సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

News September 27, 2025

ఏపీ న్యూస్

image

* భారీ వర్షాలు.. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత ఆదేశాలు
* ఎంబీబీఎస్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌‌కు రేపు రాత్రి 8గంటల వరకు అవకాశం
* అక్టోబర్ 5న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల(42) భర్తీకి రాతపరీక్ష.. రేపటి నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు
* మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ వచ్చే నెల 6వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు

News September 27, 2025

మార్కెట్ వాల్యూలో ప్రపంచంలోనే టాప్-10లో మారుతీ

image

మార్కెట్ వాల్యూలో ప్రపంచ టాప్-10 వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా మారుతీ సుజుకీ ఇండియా నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 57.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఫోర్డ్, జనరల్ మోటార్స్, ఫోక్స్ వ్యాగన్ వంటి సంస్థలను వెనక్కి నెట్టింది. GST సంస్కరణతో కార్ల అమ్మకాలు పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ జాబితాలో మారుతీ కంటే ముందు టెస్లా, టయోటా, బీవైడీ, ఫెరారీ, BMW, మెర్సిడెస్ బెంజ్ ఉన్నాయి.

News September 27, 2025

మహిళలూ.. మీరూ షిఫ్టుల్లో పని చేస్తున్నారా?

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు స్త్రీ పురుష భేదం లేదు. ఉన్నతస్థానాలకు చేరాలంటే అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉద్యోగంతోపాటు ఇంట్లో పనులు, పిల్లల బాధ్యతలూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం ముఖ్యం. రోజులో ఏదోక సమయంలో కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నించాలి. పోషకాహారం తీసుకోవాలి. షిఫ్టుని బట్టి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాయామానికి కాస్త సమయం కేటాయించాలి.

News September 27, 2025

వారికి రూ.1,03,000 బోనస్: కోల్ ఇండియా

image

TG: స్వర్ణోత్సవాలు, దసరా, దీపావళి పండగలు పురస్కరించుకుని కోల్ ఇండియా యాజమాన్యం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కోల్ ఇండియా, సబ్సిడరీస్‌కు చెందిన 2,09 లక్షల కార్మికులతో పాటు 38వేల సింగరేణి కార్మికులకు రూ.1,03,000 చొప్పున బోనస్ అనౌన్స్ చేసింది. అంతకుముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో 34శాతం <<17791980>>వాటా<<>> ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 27, 2025

నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

image

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News September 27, 2025

మాంగల్య భాగ్యానికి మార్గం చూపే మహాశక్తి రూపం

image

విజయవాడ కనక దుర్గమ్మ నేడు ‘శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల సౌందర్యానికి, విశ్వంలోని సృష్టి, స్థితి, లయలకు ఈ దేవి అధిష్ఠాన దేవత. స్వర్ణాభరణాలు, బంగారు కిరీటం, దివ్య కంఠాభరణాలు, అభయ హస్తాలతో అమ్మవారు వెలుగొందుతారు. ఈ రూపంలో అమ్మను సేవించిన వారికి మాంగల్య భాగ్యం స్థిరమవుతుందని ప్రగాఢ నమ్మకం. త్రిపుర సుందరిని హృదయంలో ఉంచుకొని సేవించిన వారికి సర్వశుభాలు కలుగుతాయి.

News September 27, 2025

అసెంబ్లీలో బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు రియాక్షన్!

image

AP: అసెంబ్లీలో <<17827034>>బాలకృష్ణ<<>>, కామినేని ఎపిసోడ్‌పై CM CBN అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు మంత్రులు టార్గెట్‌గా కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించడంపై సీరియస్ అయ్యారు. ఇదే విషయమై సుధీర్ రెడ్డి, బొండా, బూర్ల ఆంజనేయులుకు క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. ఇదంతా జరుగుతున్నా TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా, విప్‌లు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరించారు.

News September 27, 2025

ఆకలి దప్పికలు తీర్చే అవతార రూపం

image

తిరుమల గిరిపై కొలువైన శ్రీనివాసుడు నేటి ఉదయం ఆకలి దప్పికలు తీర్చే అవతార మూర్తిగా దర్శనమిస్తాడు. ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తాడు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోరిన కోర్కెలు తీర్చే వాహనంపై ఊరేగే మలయప్ప స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతంతో సమానమని పండితులు చెబుతున్నారు. కల్పవృక్షం క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో ఒకటి.

News September 27, 2025

పరుగుల ‘అభిషేకం’

image

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటివరకు 6మ్యాచుల్లో 309రన్స్ చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నారు. ఇందులో 3 అర్ధసెంచరీలున్నాయి. బౌలర్ ఎవరైనా సరే ఎలాంటి బెరుకు లేకుండా తొలి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు. యువీ స్టైల్, సెహ్వాగ్ లాంటి దూకుడుతో అభిమానులకు అసలైన T20 మజాను అందిస్తున్నారు. అభి దూకుడు చూస్తుంటే రేపు ఫైనల్లో PAKకు చుక్కలే అనిపిస్తోంది. ఏమంటారు?