India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాహల్తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.

TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా కఠోర సాధన చేస్తున్నారు. ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు ఆయన మైదానం, జిమ్లోనూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ట్రాక్పై పరిగెత్తుతూ, జిమ్లో వర్కౌట్ చేస్తూ, టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పృథ్వీ SMలో పంచుకున్నారు. కాగా జాతీయ జట్టుతోపాటు దేశవాళీ జట్టులో కూడా షా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్లో కూడా ఆయనను ఏ ఫ్రాంచైజీ కొనలేదు.

చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా ప్రభావం తమపై పడకుండా నాన్న చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆ తర్వాత తన మార్కులు చూసి ఏమవుతావని తన తండ్రి అడిగితే సినిమాల్లోకి వస్తానని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ సినిమాల్లో సక్సెస్ అవ్వకుంటే ప్లాన్-బి ఏమీ లేదన్నారు. డూ ఆర్ డై ఏదైనా ఇక్కడే అనుకున్నానని తెలిపారు. కాగా ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఎల్లుండి రిలీజ్ కానుంది.

తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్తో భేటీలో సూచించారు. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు అందిస్తామని, రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని పీసీసీ చీఫ్కు సీఎం వివరించారు. కాగా బీసీ రిజర్వేషన్లపై నివేదిక వచ్చాక ఎన్నికలు జరిగే అవకాశముంది.

TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనను ‘సార్’ అని పిలవొద్దని చెప్పేవారని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. ‘బాలా’ అని పిలవాలని సూచించేవారని చెప్పారు. ‘బాలయ్య సెట్స్లో చాలా కూల్గా ఉంటారు. ఆయన దర్శకుల హీరో. డైరెక్టర్ ఏది చెబితే అది మొహమాటం లేకుండా చేస్తారు. దర్శకుడికి పూర్తిగా లొంగిపోతారు. డాకు మహారాజ్లో నటించడం నా అదృష్టం’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.

SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్సైట్: <

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్గా ఫిట్గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.

తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <
Sorry, no posts matched your criteria.