India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి నేడు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనమిస్తారు. సింహ వాహనంపై, అభయవర ముద్రలతో కనిపిస్తారు. యోగశాస్త్రం ప్రకారం ఈమె ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. అమ్మవారిని నేడు ‘కాత్యాయని మహామాయే| మహాయోగిన్యధీశ్వరి|| నంద గోప సుతం దేవిం| పతియే కురుతే నమ||’ మంత్రంతో ఉపాసిస్తే ఉత్తమ సంతానం, సౌభాగ్యం, కుటుంబ వృద్ధి, చతుర్విధ పురుషార్థ ఫలం సిద్ధిస్తుందని నమ్మకం.

హైదరాబాద్లోని DRDO 195 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో బీఈ/బీటెక్ అప్రెంటిస్లు 40, డిప్లొమా అప్రెంటిస్లు 20, ట్రేడ్ అప్రెంటిస్(ITI) 135 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్లో కనీసం 70% మార్కులతో పాసై ఉండాలి. దరఖాస్తుకు ముందు https://nats.education.gov.in పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వెబ్సైట్: https://www.drdo.gov.in/

మొక్కల్లో పొటాషియం లోపం వల్ల ఆకుల అంచులు గోధుమ రంగులోకి మారి ఎండి, ముడుచుకుపోతాయి. మొక్కల పెరుగుదల లోపించి చీడపీడలు త్వరగా ఆశిస్తాయి. మెగ్నీషియం ఆకులోని పత్రహరితం తయారీకి కీలకం. ఇది లోపిస్తే ఆకుల ఈనెల మధ్యభాగంలో ఎర్రని/గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఆకులు వికృతంగా పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. మొక్క బలహీనంగా మారి పువ్వులు, కాయల అభివృద్ధి ఆశించినమేర ఉండదు.

1. రామాయణంలో ఇంద్రజిత్ అని ఎవరిని అంటారు?
2. మహాభారతంలో మాద్రి భర్త ఎవరు?
3. గాయత్రీ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి?
4. దేవతల గురువు ఎవరు?
5. శకుంతల, దుష్యంతులు ఏ విధమైన వివాహం చేసుకున్నారు?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు.
<<-se>>#mythologyquiz<<>>

ఈమధ్య డ్రై షాంపూ వాడకం క్రమంగా పెరుగుతోంది. దీన్ని స్ప్రే చేస్తే జిడ్డు జుట్టు ఫ్రెష్గా మారిపోతుంది. ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారికి ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ ఎక్కువగా వాడితే జుట్టుపై షాంపూ అవశేషాలు పోగుపడతాయి. ఇవి జుట్టును నిర్జీవంగా మార్చి రాలిపోయేలా చేస్తాయి. చుండ్రు, ఇన్ఫెక్షన్లు తద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీని వినియోగాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో నవరాత్రి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఈ శుభదినాన అమ్మవారు భువనేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ జగన్మాతను సేవించడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 4AMకి నిత్యాహ్నికంతో నేటి వేడుకలు ప్రారంభమయ్యాయి. గంధోత్సవం, ధూమ్రహాదుర్గార్చన, సాలభంజిక సేవలు ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తాయి. భక్తులు అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం పూరీకి 60km, గోపాల్పూర్(ఒడిశా)కు 70km, కళింగపట్నం(ఏపీ)కు 180km దూరంలో కేంద్రీకృతమైందని APSDMA పేర్కొంది. కాసేపట్లో ఇది గోపాల్పూర్ వద్ద తీరం దాటనుందని ప్రకటించింది. దీంతో ఇవాళ NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శనివారం రోజు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం కాదని పండితులు సూచిస్తున్నారు. ఈరోజున నువ్వుల నూనె, తోటకూర, ఉప్పు, నల్ల మినప్పప్పు, బొగ్గుల వంటి పదార్థాలను కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. శని దేవుడికి సంబంధించిన ఇనుప వస్తువులు, చెప్పులు కొనడం కూడా అశుభమని అంటున్నారు. ఈ నియమాలు పాటించడం వల్ల శని దోషాలు తొలగి, కుటుంబంలో శాంతి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

TG: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం <<17839954>>జీవో<<>> విడుదల చేసిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రేపు ఈసీ ప్రకటించే అవకాశముంది. ఇవాళ సీఎస్, డీజీపీతో ఎన్నికల సంఘం సమావేశం తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆయా స్థానాలు, సిబ్బంది అవసరం, ఎన్ని విడతల్లో నిర్వహణ అనే అంశాలను సమావేశంలో చర్చించనున్నారు. ముందుగా ఎంపీటీసీ, ZPTC ఎన్నికలు జరిపి తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఆశ్వయుజ శుక్ల పక్షంలో ఏడో రోజున వేపకాయల బతుకమ్మను జరుపుతారు. ఈ రోజున తంగేడు, గునుగు, చామంతి, గులాబి పుష్పాలతో 7 అంతరాలుగా బతుకమ్మను పేర్చి, వాటిపై గౌరమ్మను కొలువుదీరుస్తారు. ఈ పూలను ప్రకృతిలోని దైవశక్తికి ప్రతీకలుగా భావిస్తారు. వేప పండ్ల ఆకారంలో తయారుచేసిన బియ్యం పిండి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఫలితంగా సుఖ సంతోషాలు, సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. సాయంత్రం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.
Sorry, no posts matched your criteria.