News October 13, 2024

కన్నడ బిగ్‌బాస్‌కు పోలీసుల షాక్!

image

కన్నడ బిగ్‌బాస్‌లో స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం నరకంలో ఉన్న కంటెస్టెంట్లకు ఆహారంగా గంజి మాత్రమే ఇచ్చేవారు. బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ‘స్వర్గం’ కంటెస్టెంట్ల అనుమతి తీసుకోవాలి. దీంతో షోలోని మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులకు లేఖ రాశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు.

News October 13, 2024

నితీశ్ కుమార్ విజయం వెనుక తండ్రి త్యాగం

image

తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ నేడు భారత క్రికెటరయ్యారు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగమే తన ఎదుగుదలకు పెట్టుబడైంది. ‘నేను జాబ్ చేసే సంస్థ రాజస్థాన్‌కు మారింది. దాంతో నితీశ్ క్రికెట్‌కి ఇబ్బంది అని ఆ జాబ్ మానేశాను. ఆర్థికంగా బాగా కష్టపడ్డాం. అందరూ ఎన్నో మాటలు అన్నారు. నితీశ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తే చాలనుకున్నాను. కానీ ఏకంగా భారత్‌కు ఆడుతున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో మురిసిపోయారు ఆ తండ్రి.

News October 13, 2024

కాంగ్రెస్ నేతల్ని రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR

image

తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరని KTR ప్రశ్నించారు. ‘ఇటీవల ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగాయి. రూ.100 కోట్లు దొరికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీ, ఈడీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వాల్మీకి స్కామ్‌లోని రూ.40 కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో వాడిందని కర్ణాటకలో ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టులు లేవు’ అని చురకలంటించారు.

News October 13, 2024

టన్ను ఇసుక రూ.475కే ఇచ్చావా?.. ఎవరికిచ్చావ్?: టీడీపీ

image

AP: ఇసుక గురించి, మద్యం గురించి <<14349346>>జగన్<<>> ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని TDP కౌంటర్ ఇచ్చింది. ‘నీ ప్రభుత్వం 20 టన్నుల లారీ రూ.30వేల నుంచి రూ.40వేలకు అమ్మితే మా ప్రభుత్వంలో రూ.16వేల నుంచి రూ.18వేలకు కేవలం రవాణా ఛార్జీలతో వస్తుంది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి వందల మంది ఆత్మహత్యకు కారణమయ్యావ్. టన్ను రూ.475కే ఇచ్చావా? ఎవరికిచ్చావ్?’ అని ఫైరయింది.

News October 13, 2024

అత్తాకోడళ్లపై అత్యాచారం.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు: మంత్రి

image

AP: శ్రీసత్యసాయి(D) చిలమత్తూరు మండలంలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక <<14338493>>అత్యాచారం<<>> సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను ఆమె పరామర్శించారు. ఈ ఘటనపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారని, పోలీసులు 4 బృందాలుగా గాలించి నిందితుల్ని 24 గంటల్లో పట్టుకున్నారని చెప్పారు.

News October 13, 2024

T20 వరల్డ్ కప్: టీమ్ ఇండియా లక్ష్యం 152 రన్స్

image

టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 151/8 స్కోరు చేసింది. టోర్నీలో నిలవాలంటే ఇది భారత్‌కు చావో రేవో లాంటి మ్యాచ్ కావడం గమనార్హం. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ 40 రన్స్, టాహ్లియా, పెర్రీ చెరో 32 పరుగులు చేశారు. భారత అమ్మాయిల్లో రేణుక, దీప్తి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.

News October 13, 2024

ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు: బండి

image

TG: రాష్ట్రంలో కులగణన అంతా ఫేక్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓడిపోతామని గ్రహించి స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ‘రూ.150 కోట్లతో కులగణన అంటూ డైవర్షన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది. మళ్లీ గణన ఎందుకు? ఆ నివేదికను గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ విడుదల చేయలేదు. ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి?’ అని నిలదీశారు.

News October 13, 2024

అందుకే సినిమాలు తగ్గించాను: దుల్కర్ సల్మాన్

image

సినిమాలకు విరామం ఇవ్వడానికి గల కారణాన్ని హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గత రెండేళ్ల నుంచి సినిమాలు తగ్గించాను. గతేడాది ఒక్క సినిమానే చేశా. అది నా తప్పే. అంతకుముందు చెప్పుకోదగ్గ సినిమాలు నా నుంచి రాకవపోడమే ఇందుకు ఓ కారణం. నా ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. దీంతో కాస్త విరామం తీసుకున్నా’ అని వెల్లడించారు. కాగా ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.

News October 13, 2024

హెజ్బొల్లాతో ఘర్షణ.. 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. సౌత్ లెబనాన్‌లో హెజ్బొల్లాతో జరిగిన భీకర ఘర్షణల్లో 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్-లెబనాన్ బోర్డర్‌లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.

News October 13, 2024

ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్

image

AP: భరించలేని ఇసుక రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?’ అని జగన్ ట్వీట్ చేశారు.