India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రేపటి నుంచి SAT20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. క్లాసెన్, బట్లర్, జాన్సెన్, విల్ జాక్స్, మార్క్రమ్, మిల్లర్, జాసన్ రాయ్, డుప్లెసిస్, డికాక్, పూరన్, స్టొయినిస్, రషీద్ ఖాన్, పొలార్డ్, సామ్ కరన్, సాల్ట్, లివింగ్స్టోన్ వంటి స్టార్లు ఆడతారు. భారత్ నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఈ టోర్నీలో ఆడనున్నారు. పర్ల్ రాయల్స్ తరఫున ఆయన బరిలోకి దిగుతారు.

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

విరాట్ కోహ్లీ మరోసారి ఇండియా టెస్టు జట్టు పగ్గాలు చేపట్టొచ్చని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్క్రిస్ట్ అన్నారు. ‘రోహిత్ ఇంటికి చేరాక టెస్టు భవిష్యత్తును సమీక్షించుకుంటారు. ఆయన ఇంగ్లండ్ టెస్టులకు వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడొచ్చేమో. ఆ తర్వాత రిటైరవ్వొచ్చు. బుమ్రా ఎంత ఫిట్గా ఉన్నారన్నది అనుమానమే. నాకు తెలిసి భారత్ మళ్లీ విరాట్నే కెప్టెన్గా నియమించొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

AP: విశాఖ సముద్ర తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్థానిక ఫిషింగ్ హార్బర్ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ(కృష్ణపట్నం) భాగం అవుతుందని వెల్లడించారు.

రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.

APలో ఇవాళ తాము శ్రీకారం చుట్టిన రూ.2.10లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. IT, టెక్నాలజీకి AP ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు. విశాఖకు కేటాయించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతో మందికి ఉపాధి ఇస్తుందని, 3 రాష్ట్రాల్లోనే వస్తున్న బల్క్ డ్రగ్ పార్కును విశాఖ(నక్కపల్లి)కి కేటాయించామన్నారు.

TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అరవింద్ను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక కారణం, ఎవరి అనుమతితో బదిలీ చేశారు? నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేసుకున్నారు.

TG: ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపు ఉదయం నార్త్ HYDలో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ HYDలో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

TGకి కింగ్ఫిషర్ సహా <<15097668>>బీర్ల<<>> సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. TG నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.

AP: మోదీని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో నిత్యం ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని సీఎం ఆహ్వానించారు. ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.