News April 6, 2024

జైపూర్‌లో కోహ్లీ పప్పులు ఉడకవ్!

image

ఐపీఎల్‌లో దేశంలోని ఏ గ్రౌండ్‌లోనైనా ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడతారు. కానీ జైపూర్‌లో మాత్రం రన్స్ రాబట్టడంలో విఫలమవుతుంటారు. ఇక్కడ ఆయన గణాంకాలు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటివరకు కోహ్లీ ఇక్కడ 8 మ్యాచ్‌లు ఆడి 149 రన్స్ మాత్రమే కొట్టారు. స్ట్రైక్ రేట్ 94గా ఉంది. అతడి అత్యుత్తమ స్కోరు 39. ఇక సెంచరీలు, అర్థసెంచరీలు లేనే లేవు. ముఖ్యంగా సందీప్ శర్మ బౌలింగ్‌లో కోహ్లీ తడబడుతూ ఉంటారు.

News April 6, 2024

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: హరీశ్

image

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరుగుతుందని BRS నేత హరీశ్ రావు అన్నారు. ‘మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని, అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయట్లేదని విమర్శించారు. కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడొద్దని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటామని తెలిపారు.

News April 6, 2024

ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్!

image

ముంబైతో జరిగే మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ఆ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. కానీ అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో వెల్లడించలేదు. కాగా ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 71 రన్స్ మాత్రమే చేశారు. అటు బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు.

News April 6, 2024

విపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారు: సోనియా

image

ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ మండిపడ్డారు. విపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. జైపూర్‌లో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని ఆదరించాలని ఓటర్లను కోరారు.

News April 6, 2024

అయోధ్య రాముడిని దర్శించుకున్న మల్లారెడ్డి

image

TG: మాజీ మంత్రి మల్లారెడ్డి అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు కూడా బాలరాముడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ‘శ్రీరాముడు అందరి దేవుడు. బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత మల్లారెడ్డి విహార యాత్రలు, ఆథ్యాత్మిక యాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు.

News April 6, 2024

MPC, BiPC విద్యార్థులకు అలర్ట్

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుసుముతో కలిసి మే 1 వరకూ అప్లై చేసుకోవచ్చు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ఎంసెట్ పేరుతో ఈ ఎగ్జామ్ నిర్వహించేవారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు <>సైట్<<>>: https://eapcet.tsche.ac.in

News April 6, 2024

పోషకాల తాటి ముంజలు

image

ఎండాకాలం వచ్చిందంటే వేడి నుంచి ఉపశమనం కలిగించే తాటి ముంజలు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వీటి అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రజలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజల్లో ఐరన్, క్యాల్షియం, మిటమిన్-ఏ, బీ, సీలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్‌లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

News April 6, 2024

ముస్లిం మహిళల హిజాబ్ తొలగింపు.. రూ.145కోట్ల పరిహారం!

image

న్యూయార్క్‌లో (US) ఇద్దరు ముస్లిం మహిళలకు బలవంతంగా హిజాబ్ తొలిగించి ఫొటో తీసినందుకు అక్కడి యంత్రాంగం రూ.145కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అధికారుల చర్యతో అసౌకర్యానికి గురయ్యామని జమీలా క్లార్క్, అర్వా అజీజ్ 2018లో కేసు వేశారు. తాజాగా న్యూయార్క్ యంత్రాంగం పరిహారం చెల్లించేందుకు ఓకే చెప్పింది. ఈ డబ్బును రూ.6.5లక్షల చొప్పున ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న దాదాపు 4000 మంది మహిళలకు ఇవ్వనున్నారు.

News April 6, 2024

కోడ్ ముగిసిన తర్వాతే ఫలితాలు!

image

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు TSPSC కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయనుంది. అప్పటివరకు ఫైనల్ ‘కీ’లు వెల్లడించడం, జనరల్ ర్యాంకుల జాబితా ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనుంది. 2022 నుంచి ఇప్పటివరకు TSPSC 27 నోటిఫికేషన్లతో మొత్తం 18వేలకు పైగా ఉద్యోగాలను ప్రకటించింది.

News April 6, 2024

పుష్పరాజ్-శ్రీవల్లి ఎడిట్ అదిరింది: పుష్ప టీమ్

image

పుష్ప-2 నుంచి వరుస అప్డేట్‌లు ఇస్తూ మూవీ టీమ్ జోరు పెంచింది. తాజాగా రష్మిక బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్‌ను విడుదల చేసింది. దీంతో అమ్మవారి గెటప్‌లోని అల్లు అర్జున్, శ్రీవల్లి లేటెస్ట్ ఫొటోను ఎడిట్ చేసి ‘అర్ధనారీశ్వర’ అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఎడిట్ అదిరిపోయిందంటూ పుష్ప టీమ్ రిప్లై ఇచ్చింది. ఇలాంటివి ఇంకా రాబోతున్నాయని పేర్కొంది.