India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘టీడీపీ హయాంలో నెలాఖరునే జీతాలు చెల్లించారు. కానీ ఈ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడతాయో చెప్పలేం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం. 2019లో ఆగిపోయిన అభివృద్ధిని.. అక్కడి నుంచే తిరిగి కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
AP: జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45 వేలకు పైగా ఓట్లను సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి ఇవ్వడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
AP: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘హత్యా రాజకీయాలు చేసేవారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. బాబాయి హత్యపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? కడప ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. వైఎస్లాగా ప్రజాసేవ చేస్తా. కడప ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి’ అని ఆమె కోరారు.
రాజస్థాన్తో మ్యాచ్లో బెంగళూరు టీమ్ పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన అనుజ్ స్థానంలో లోమ్రోర్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది. ఇదే జరిగితే దినేశ్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే బౌలర్ రీస్ టోప్లీ ప్లేస్లో న్యూజిలాండ్ స్పీడ్స్టర్ లాకీ ఫెర్గూసన్ను ఆడించనున్నట్లు సమాచారం. ఇక ఆల్ రౌండర్ మనోజ్ భాండగే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముంది.
TG: ఫోన్ ట్యాపింగ్లో కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తన ఫోన్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానికి ఇక జైలు జీవితమేనన్నారు.
TG: కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క ఎంపీ సీటు రాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ‘కేసీఆర్ చవట, దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేయలేదా? ప్రాంతంవాడే మనకు అన్యాయం చేస్తే పాతి పెట్టాలనే సామెత ప్రకారం KCRను పాతి పెట్టాలి. నాలుగు మాసాల కాంగ్రెస్ పాలన చూసి కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారు. మిషన్ భగీరథలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగింది’ అని ఆరోపించారు.
AP: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థా పారదర్శకంగా పనిచేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకమూ ఆపకుండా అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు అండ్ కో వాలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసి వృద్ధులకు ఇంటివద్దే పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుందని మండిపడ్డారు. పురందీశ్వరి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసమే పనిచేస్తారని ఆరోపించారు.
పవర్ ప్లేలో హైదరాబాద్ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. SRH బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. ఇది నల్లరేగడి పిచ్ కావడంతో నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయింది. మేము ఫీల్డింగ్లో తప్పిదాలు చేశాం. అయినా ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకొచ్చాం’ అని రుతురాజ్ చెప్పారు.
AP: కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షలు మాత్రమే నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందని, భూమిని చదును చేసే పేరుతో నిధులు దోచేశారని ఆరోపించారు. రాజమండ్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు పరిధిలోని జనసేన, టీడీపీ అభ్యర్థులతో కలిసి పనిచేస్తామన్నారు.
TG: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్కు కోర్టుని CBI గడువు కోరింది. ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని కవిత న్యాయవాదిని సీబీఐ కోరింది. మరోవైపు కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కౌంటర్ దాఖలుకు ఈ నెల 10 వరకు గడువిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
Sorry, no posts matched your criteria.