News January 8, 2025

నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు మే 1 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1, 2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. యూపీఎస్సీ, SSC ఫార్మాట్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

News January 8, 2025

11వేల రుద్రాక్షలను ధరించి మహాకుంభమేళాకు వచ్చిన బాబా

image

మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, రుషులు, సాధువులు, బాబాలు, అఘోరాలు నదీ స్నానం చేసేందుకు ప్రయాగరాజ్‌కు వెళ్తున్నారు. అయితే, అక్కడికి వచ్చిన
ఓ రుద్రాక్ష బాబా ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏకంగా 30 కేజీల బరువున్న 11వేల రుద్రాక్షలను ధరించారు. తనను ప్రజలు రుద్రాక్ష బాబా అని పిలుస్తారని, చాలాకాలంగా వీటిని ధరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News January 8, 2025

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్

image

జమిలి ఎన్నికలపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జమిలి ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆర్థిక సాధ్యాసాధ్యాలు, అవసరమైన ఈవీఎంలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల్ని జమిలి ఎన్నికలు ఉల్లంఘిస్తాయని ప్రియాంక పేర్కొన్నట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.

News January 8, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా సిద్ధం కాని స్టేడియాలు?

image

వచ్చే నెలలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టోర్నీ ప్రారంభానికి మరో 40 రోజులే ఉన్నా స్టేడియాల మరమ్మతుల్లో PCB తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. టోర్నీ జరిగే స్టేడియాల్లో సీట్లు, ఫ్లడ్ లైట్లు, ఎన్‌క్లోజర్ సౌకర్యాలు కల్పించలేదని సమాచారం. ఔట్‌ఫీల్డ్, పిచ్‌లు కూడా సిద్ధం చేయలేదని తెలుస్తోంది. మ్యాచ్‌లు నిర్వహించే లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో ఇదే పరిస్థితి నెలకొందని టాక్.

News January 8, 2025

ఆయన ఆడిషన్ అడిగితే షాకయ్యా: హీరోయిన్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కాల్ చేసి ఆడిషన్ అడిగితే షాకైనట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలిపారు. మొదట అనిల్ కాల్ చేయగానే ఎవరో తెలియదని చెప్పినట్లు వెల్లడించారు. ఆయన గురించి గూగుల్ చేసి తెలుసుకున్నట్లు చెప్పారు. సినిమాలో రోల్ కోసం లుక్ టెస్టు చేయాలని దర్శకుడు కోరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య కనిపించనున్నారు.

News January 8, 2025

చంద్రబాబు వస్తున్నారు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ట్వీట్

image

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2025 వార్షిక సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ X వేదికగా ప్రకటించింది. 2024లో 125 దేశాల ప్రతినిధులు ఫోరమ్‌కు హాజరవగా ఈ ఏడాది కూడా G7 &G20 దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ప్రపంచ ప్రజాప్రతినిధులు రానున్నారు.

News January 8, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ 38 ఏళ్ల ప్లేయర్ కెరీర్‌లో 198 వన్డేలు, 122 T20లు, 47 టెస్టులు ఆడారు. 3 ఫార్మాట్లలో కలిపి 13,463 రన్స్ చేశారు. అందులో 23 సెంచరీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్‌లో చివరి వన్డే ఆడారు. వన్డేల్లో కివీస్ తరఫున డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు.

News January 8, 2025

మే 1న సూర్య ‘రెట్రో’ విడుదల

image

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘రెట్రో’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మే 1వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా సంతోశ్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. సూర్య నటించిన ‘కంగువా’ ఇటీవలే విడుదలవగా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.

News January 8, 2025

గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏపీ: లోకేశ్

image

AP: రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్‌గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ‘విద్యార్థుల్లో ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాలు పెంపొందిస్తాం. ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్ వంటి వాటిని ప్రోత్సహిస్తాం. ఉన్నత విద్యను సంస్కరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News January 8, 2025

OLA ఎలక్ట్రిక్ CEOకు సెబీ స్ట్రాంగ్ వార్నింగ్

image

OLA ఎలక్ట్రిక్ CEO భవీశ్ అగర్వాల్‌కు SEBI స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లిస్టింగ్ రూల్స్‌ను పాటించకపోతే చర్యలు తప్పవంది. కంపెనీ సమాచారమేదైనా ముందుగా స్టాక్ ఎక్స్‌ఛేంజీలకే ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాతే బహిరంగంగా ప్రకటించొచ్చని సూచించింది. OLA స్టోర్లను ఈ నెల్లోనే 800 నుంచి 4000కు పెంచుతామంటూ భవీశ్ 2024, డిసెంబర్ 2న 9.58AMకి ట్వీట్ చేశారు. BSE, NSEకి మాత్రం 1.36PM తర్వాత సమాచారం ఇచ్చారు.