India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కోనసీమ, కడప జిల్లాల్లో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లిలో డీజే సౌండ్కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. మరోవైపు కడపలోని బెల్లంబండి వీధిలో దసరా ఊరేగింపులో పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. షాక్తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
లెబనాన్లోని UN శాంతిపరిరక్షణ బలగాల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను భారత్తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశపూర్వక చర్యలుగా UNIFIL ఆరోపించింది. బలగాల రక్షణ అత్యంత ప్రాధాన్యాంశంగా భారత్ పేర్కొంది.
AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.
TG: BRS నేత మన్నె క్రిశాంక్కు సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.
AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సిద్దిఖీని శనివారం ముంబైలో ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కర్నైల్ సింగ్, ధరమ్రాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వీరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హైప్రొఫైల్ సిద్దిఖీ హత్యతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తిరుమల బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘తిరుమలలో ఏటా 450 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటికంటే బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. గతంలో 16 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా ఈసారి 26 లక్షల మందికి అందించారు. పండుగ విశిష్టత, వైభవం తెలిసేలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్న టీటీడీకి అభినందనలు’ అని సీఎం తెలిపారు.
TG: రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సోలార్ పంపు సెట్లతో రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. పంట, పవర్తో రైతులు అదనపు లాభం పొందేలా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు చేడతాం’ అని ఆయన ప్రకటించారు.
TG: రాష్ట్రంలో ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి హాల్టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అభ్యర్థులు <
తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.