India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి హాల్టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అభ్యర్థులు <
తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
బంగ్లాదేశ్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక సిరీస్లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్లు ఆడి 10 సిరీస్ల్లో ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. టీమ్ ఇండియా తర్వాత పాకిస్థాన్ (8), అఫ్గానిస్థాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.
మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ALL THE BEST INDIA
సాధారణంగా దసరా రోజు తెలంగాణలో నాన్వెజ్ వంటకాలే చేస్తారు. అయితే నిన్న శనివారం కావడంతో ఎక్కువశాతం మంది వెజ్కే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు. దీంతో HYDతో పాటు APలోని విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్లెస్ కేజీ రూ.240-260 మధ్య పలుకుతోంది.
చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. కానీ దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్ను సంప్రదించాలి.
ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.
AP: డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రూ.50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. రాయితీ పోనూ మిగతా రుణంపై వడ్డీ ఉండదు. వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్నవారికి ఈ రాయితీ రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న మొత్తాన్ని 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతుల్లో తీర్చాల్సి ఉంటుంది. రాయితీని చివర్లో మినహాయిస్తారు.
లద్దాక్ సరిహద్దుల్లో పహారా, సరకు రవాణా కోసం భారత సైన్యం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. బ్యాక్ట్రియన్ ఒంటెలకు DIHAR శిక్షణ ఇస్తోంది. పురాతన కాలంలో దేశాల మధ్య వర్తక వ్యాపారానికి వీటిని ఉపయోగించేవారని, అయితే వాటిని మచ్చిక చేసుకొనే నైపుణ్యాన్ని భారత్ కోల్పోయినట్టు కల్నల్ రవికాంత్ శర్మ తెలిపారు. ఇవి అరుదైన వాతావరణంలో సైతం బరువులు మోస్తూ 2 వారాలపాటు ఆహారం లేకుండా జీవించగలవు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK109’ అనే మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘సర్కార్ సీతారామ్’, డాకూ మహారాజా’ అనే టైటిల్స్లో ఏదో ఒకటి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.