News November 13, 2024

విరాట్, రోహిత్ బ్రేక్ తీసుకోవాలి: బ్రెట్‌ లీ

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాల కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వారి ఫామ్ బాలేదు. జట్టు నుంచి ఇద్దరూ గ్యాప్ తీసుకోవాలి. క్రికెట్ నుంచి దూరంగా గడపాలి. సమస్యను గుర్తించి సరి చేసుకుని మళ్లీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలి. నేటికీ ఆ ఇద్దరూ అగ్రశ్రేణి బ్యాటర్లే’ అని పేర్కొన్నారు.

News November 13, 2024

బుల్డోజర్ యాక్షన్: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్

image

బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజంగానే నేరనిరూపణ జరిగినా ఇళ్లను కూల్చకూడదని, అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతారని గుర్తుచేసింది.

News November 13, 2024

పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్

image

TG: పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News November 13, 2024

శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు

image

AP: నటి శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌, హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు.

News November 13, 2024

‘ప్రభాస్‌లా జుట్టు పెంచుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి’

image

TG: ఆహారం బాలేదనో, వార్డెన్ల గురించో రెసిడెన్షియల్ విద్యార్థులు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ, వరంగల్ జిల్లాలో తమకు ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ కావాలని అబ్బాయిలు, చీర కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమ్మాయిలు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు వేశారు. భావాలను వ్యక్తపరచడం సరైందే అని, కానీ ఈ విద్యార్థుల అభ్యర్థనలు ఆసక్తికరంగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని నిపుణులు అంటున్నారు.

News November 13, 2024

కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదు: డీకే అరుణ

image

TG: లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ‘కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదు? ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎంకు ఎందుకంత ప్రేమ? శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది’ అని విమర్శించారు.

News November 13, 2024

డిప్యూటీ స్పీకర్‌గా RRR.. జగన్ అసెంబ్లీకి వస్తారా?

image

AP: రఘురామకృష్ణరాజు(RRR)ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తే ఎలాగుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. RRR వైసీపీలోనే ఉంటూ ఆ ప్రభుత్వంపై గతంలో నిత్యం విమర్శలు చేయడంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. RRR సభ కార్యకలాపాలు నడిపిస్తే, జగన్ సభకు వస్తారా? ఒకవేళ వస్తే ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై మీరేమంటారు?

News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

News November 13, 2024

డిగ్రీ సిలబస్ మారబోతోంది!

image

TG: రాష్ట్రంలో డిగ్రీ సిలబస్ మారబోతోంది. 2019 నుంచి అవసరాలకు తగ్గట్లు కొత్త అంశాలు చేర్చలేదనే విమర్శలున్నాయి. దీంతో డిగ్రీ పాఠ్యాంశాలు మార్చేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా సుమారు 2లక్షల మంది డిగ్రీలోని వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. అటానమస్ కాలేజీలు సిలబస్‌లో మార్పులు చేసుకుంటుండగా, మిగతా వాటిల్లో అది జరగట్లేదు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయం తీసుకుంది.

News November 13, 2024

5000 ఉద్యోగులకు రూ.9000 కోట్లు పంచిన స్విగ్గీ!

image

స్విగ్గీ ఉద్యోగులు జాక్‌పాట్ కొట్టేశారు. ESOP విధానంలో కంపెనీ వారికి షేర్లు కేటాయించినట్టు తెలిసింది. 5000 మంది ఉద్యోగులు రూ.9000 కోట్లమేర పొందబోతున్నారు. అందులో 500 మంది కోటీశ్వరులు అవుతున్నారు. కంపెనీ కో ఫౌండర్స్ శ్రీహర్ష, నందన్ రెడ్డి, ఫణికిషన్, ఫుడ్ మార్కెట్ ప్లేస్ CEO రోహిత్, INSTAMART హెడ్ అమితేశ్, CFO రాహుల్, HR హెడ్ గిరీశ్, CTO మధుసూదన్ సహా మరికొందరికే రూ.1600 కోట్లు దక్కినట్టు సమాచారం.