India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమలలో పుష్పాలను స్వామి వారికి సమర్పించకుండా అలంకరించుకుంటే అది పరిమళ ద్రోహమే అవుతుందట. పూర్వం శ్రీశైల పూర్ణుని శిష్యుడొకరు తిరుమలలో శ్రీనివాసునికి సమర్పించని పుష్పమాలను తన తలపై ధరించి ఆనందించారు. ఆ రోజు రాత్రి శ్రీశైల పూర్ణుని కలలో స్వామివారు నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పారట. అప్పటి నుంచి తిరుమలలో ఎవరూ పుష్పాలు ధరించరాదనే కట్టడి చేశారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
<<-se>>#VINAROBHAGYAMU<<>>

ఆస్ట్రేలియా-Aతో 2వ అనధికార టెస్టులో భారత్-A గెలిచింది. రాహుల్(176*), సాయి సుదర్శన్(100), జురెల్(56) మెరవడంతో అనూహ్యంగా గెలిచింది. AUS తొలి ఇన్నింగ్స్లో 420 రన్స్ చేసి ఆలౌట్ కాగా IND 194కే కుప్పకూలింది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 185పరుగులే చేసినా లీడ్తో కలుపుకొని 411 పరుగుల లక్ష్యాన్ని IND ఛేదించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ డ్రా కాగా ఈ మ్యాచ్లో భారత్ గెలిచి 1-0తో పైచేయి సాధించింది.

శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 5న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

AP: పత్తి రైతుల కుటుంబ సభ్యుల గుర్తింపునకు రేషన్కార్డు డేటాను CMయాప్నకు అనుసంధానించాలని పౌర సరఫరాలశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ లింక్ చేసిన రైతుల బ్యాంక్ అకౌంట్కు CCI నగదు చెల్లింపులు జరపాలి. పత్తి విక్రయ వివరాలు నమోదు సమయంలో ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం ఫొటో కాపీలను రైతులు తీసుకురావాలి. పత్తి రవాణా వివరాలను యాప్లో నమోదు చేసి, రవాణాదారులకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వం పేర్కొంది.

AP: వైరల్ ఫీవర్తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం <<17834963>>పవన్<<>> కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చి ప్రజాసేవ కొనసాగించాలన్నారు. అలాగే ‘OG’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేయాలని Xలో పేర్కొన్నారు. అటు మంత్రి నారా లోకేశ్ సైతం పవన్ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

CBSE పాఠశాలల్లో టెన్త్ పూర్తిచేసిన బాలికలకు గుడ్న్యూస్. ఆ స్కూళ్లలో 11 లేదా 12వ తరగతి చదువుతూ తల్లిదండ్రులకు సింగిల్ గర్ల్ చైల్డ్గా ఉన్న వారికి స్కాలర్షిప్ కింద నెలకు రూ.1000 చొప్పున ఆ సంస్థ అందించనుంది. అయితే వారు టెన్త్లో 70 శాతం మార్కులు పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలకు మించరాదు. దీనికి అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయాల్సిన సైట్ <

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల కాగా, ఇప్పుడు ఒక రోజు ముందు నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు.

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే ఫుడ్స్ను వైద్యులు సూచించారు. అవకాడో, చియా సీడ్స్, అవిసె గింజలు, జనపనార గింజలు, వాల్ నట్స్, ఓట్స్, తాజా ఆకుకూరలు, బ్రోకలీ, బెర్రీస్, తృణ ధాన్యాలు, ఆలివ్ ఆయిల్, చిలగడదుంపలు, అత్తిపండ్లు (అంజీర), క్వినోవా, సిరి ధాన్యాలతో చేసిన బ్రెడ్, యోగర్ట్ వంటివి తినాలని చెబుతున్నారు.

AP: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో AI ఆధారిత హాజరు విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కొద్దిరోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. DECలో జరిగే శీతాకాల సమావేశాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్తుండటంతో కచ్చితత్వం లోపిస్తోందని, దుర్వినియోగం జరుగుతోందన్న విమర్శలకు దీంతో చెక్ పెట్టనుంది. AI సాఫ్ట్వేర్తో పనిచేసే కెమెరాలు సభ్యుల వివరాలను నమోదు చేస్తాయి.

భారత తొలి సూపర్సోనిక్ ఫైటర్ జెట్ MiG-21కు IAF <<17834345>>వీడ్కోలు<<>> పలికింది. వీటి స్థానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్స్ క్రమంగా భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి పలు స్క్వాడ్రన్లలో సేవలందిస్తున్నాయి. వచ్చే నెల అడ్వాన్స్డ్ వెర్షన్ ‘తేజస్ Mk1A’ను HAL లాంచ్ చేయనుంది. ఎయిర్-ఎయిర్, ఎయిర్-సర్ఫేస్ వంటి మల్టీ మిషన్ క్యాపబిలిటీస్ వీటి సొంతం. స్వయం సమృద్ధే లక్ష్యంగా ఆర్మీ ముందుకు సాగుతోంది.
Sorry, no posts matched your criteria.