News April 6, 2024

25 మంది BRS MLAలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు: మంత్రి

image

TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS.. 39కి వచ్చింది. ఇందులో 25 మంది కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ దుస్థితికి కారణం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరవు వచ్చిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాలు ఏపీకి అధికంగా తరలించారని ఉత్తమ్ ఆరోపించారు.

News April 6, 2024

మహిళా క్రికెటర్లకు గాయాలు

image

పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు బిస్మా మరూఫ్, గులాం ఫాతిమాకు గాయాలయ్యాయి. కరాచీలో వారు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ప్రస్తుతం వారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మరూఫ్, ఫాతిమా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

News April 6, 2024

మాధవీలతకు Y+ సెక్యూరిటీ

image

హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలకూ కేంద్రం Y+ భద్రత కల్పించవచ్చు.

News April 6, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది: హరీశ్

image

TG: మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ‘రైతు దీక్ష’లు చేపట్టారు. సంగారెడ్డిలో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది. రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. మోటార్లు కాలిపోతున్నాయి. రైతులకు పుట్టెడు కష్టాలు వచ్చాయి. రైతులకు ఇచ్చిన ఏ హామీలనూ నెరవేర్చలేదు’ అని మండిపడ్డారు.

News April 6, 2024

సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కవిత పిటిషన్

image

లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారణకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు లాయర్ నితీశ్ రాణా కోరారు. విచారణ ఎప్పుడు చేపట్టే విషయాన్ని మధ్యాహ్నం తెలుపుతామని కోర్టు స్పష్టం చేసింది.

News April 6, 2024

BRS పేరు మార్చే ఆలోచన చేస్తున్నాం: ఎర్రబెల్లి

image

BRS పేరును TRSగా మార్చే ఆలోచన చేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ఇక.. TRSను BRSగా మార్చిన తర్వాత ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదనేది అందరికీ తెలిసిందే. కొత్త పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని పార్టీ నేతలు గతంలో బాహాటంగానే చెప్పారు. ‘TRS’తో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ‘BRS’ అయ్యాక అధికారం కోల్పోయింది.

News April 6, 2024

కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

image

TG: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

News April 6, 2024

కేసీఆర్‌కు సిగ్గుండాలి: ఉత్తమ్

image

TG: మేడిగడ్డకు వెళ్లి ధర్నా చేస్తానన్న కేసీఆర్‌కు సిగ్గుండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘జనం నిన్ను, నీ పార్టీని తొక్కి బొంద పెట్టడానికి సిద్ధమయ్యారు. రూ.94వేల కోట్లు ఖర్చు చేసి ఒక పిల్లర్ పోతే ఏమైందనడానికి సిగ్గు, శరం, లజ్జ ఉండాలి. మేడిగడ్డ కుంగినప్పుడు కేసీఆరే CMగా ఉన్నారు. అప్పుడు ఒక్క మాట మాట్లాడని ఆయన.. ఇప్పుడు బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.

News April 6, 2024

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది

image

మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడు జీవితం’గా విడుదలైంది. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ ‘ఆడు జీవితం’ నవల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

News April 6, 2024

‘పనస పండు’ ప్రచారం

image

తమిళనాడు రామనాథపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మాజీ సీఎం ఒ.పన్నీర్ సెల్వం సహా ఐదుగురు పన్నీర్ సెల్వంలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం ఓపీఎస్‌కు ‘పనస పండు’ గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో ఆయన మద్దతుదారులు పనస పండ్లను టన్నుల్లో కొనుగోలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు రోజుకు 30-40 టన్నుల పండ్లను విక్రయిస్తున్నారు.