India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును BRSకు ఆపాదించే కుట్ర జరుగుతోంది. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
బీటెక్ సీట్లలో AP, TG ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14.90 లక్షల సీట్లు ఉండగా ఇరు రాష్ట్రాల్లో కలిపి 3.10 లక్షల సీట్లు ఉండటం విశేషం. ఏపీలో 1.83 లక్షల సీట్లు, తెలంగాణలో 1.45 లక్షల సీట్లు ఉన్నాయి. 3.08 లక్షల సీట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం సీట్లలో ఈ 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 42.80 శాతం సీట్లు ఉన్నాయి. AICTE పరిమితి ఎత్తివేయడంతో దక్షిణాదిలో వచ్చే ఏడాది సీట్లు మరింత పెరగొచ్చు.
2016 IPL ఫైనల్లో SRHతో సునాయాసంగా గెలిచే స్థితి నుంచి RCB ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ విషయంలో తాను, విరాట్ నేటికీ చింతిస్తుంటామని క్రికెటర్ KL రాహుల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా ఇద్దరిలో ఒకరు ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే ఫలితం వేరేలా ఉండేది. టేబుల్ అట్టడుగు నుంచి వరుసగా 7మ్యాచులు గెలిచి ఫైనల్స్కు వచ్చాం. బెంగళూరులో ఫైనల్. గెలిచి ఉంటే అదో కల నిజమైన సందర్భం అయ్యుండేది’ అని పేర్కొన్నారు.
TG: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 పరీక్షల్లో ఆలిండియా 131వ ర్యాంకు సాధించిన సాయి చైతన్య జాదవ్ను రాష్ట్ర అదనపు డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ‘సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది. 2022లో సివిల్స్ పరీక్షలకి, ఈ ఏడాది IFS ఇంటర్వ్యూకి అతడిని గైడ్ చేశాను. నేను ఆదిలాబాద్ SPగా ఉన్న సమయంలో సాయి తండ్రి గోవిందరావు నాతో కలిసి పనిచేశారు. ఆయన కుమారుడు ఇలా IFSకి సెలక్ట్ అవడం చాలా సంతోషం’ అని పేర్కొన్నారు.
TG: కొడంగల్ BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు <<14590479>>ఆరోపణలు<<>> ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న BRS నేత సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. మట్కా సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న వరుణ్ అండ్ కో అనంతరం తిరుమలకు వెళ్లారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్, మట్కాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు.
AP: జలవిద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి జరుపుతున్న నీటి తరలింపును తక్షణమే ఆపాలని KRMB (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్) పేర్కొంది. ఈ మేరకు AP, TG జలవనరుల శాఖ కార్యదర్శులకు లేఖ రాసింది. ఎగువ నుంచి వరద ఆగిపోయినా నీటి తరలింపు, విద్యుదుత్పత్తి చేయడం వల్ల నీటి నిల్వలు అడుగంటుతున్నాయని తెలిపింది. అటు APలో పోతిరెడ్డిపాడు, ఇటు TGలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ మ.3 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన మాట్లాడనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. రూ.2.94లక్షల కోట్ల బడ్జెట్ ప్రజలను నిరాశకు గురిచేసిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అసెంబ్లీకి హాజరుకాకుండా మీడియా ద్వారా ప్రశ్నిస్తామని జగన్ 3 రోజుల క్రితం ప్రకటించారు.
చలికాలంలో చాలా మందికి అనారోగ్యం చేస్తుంది. దీనికి కారణం రోగ నిరోధకశక్తి లేకపోవడమే. కానీ కొన్ని పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, ఫైబర్, ఐరన్ ఉండే బాదం, జీడిపప్పు తింటే శరీరంలోని కండరాలు, నరాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వాల్ నట్స్, అంజీర్, పిస్తా పప్పు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాన్ వెజ్, డీప్ ఫ్రైలకు దూరంగా ఉండటం బెటర్.
డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సమర్థత శాఖ(Department of Government Efficiency)కి వీరు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘అధిక నిబంధనల తొలగింపు, వృథా ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. సర్కారు వనరుల్ని వృథా చేస్తున్నవారికి నా నిర్ణయం కచ్చితంగా షాకిస్తుంది’ అని ట్రంప్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.