News April 6, 2024

కేబుల్ బ్రిడ్జి‌పై కారు బీభత్సం.. ఇద్దరు మృతి

image

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఫొటోలు దిగుతున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

News April 6, 2024

నేను రాజకీయాల్లోకి రాను: సునీత

image

AP: తాను రాజకీయాల్లోకి రావట్లేదని దివంగత YS.వివేకానందరెడ్డి కుమార్తె సునీత స్పష్టం చేశారు. ‘ఈ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డిని ఓడించాలన్నదే నా ధ్యేయం. నా తండ్రి విషయంలో ఏం జరిగిందనేది నాకు మాత్రమే తెలుసు. ప్రజలకు నిజం తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. చదువు, తెలివి, స్తోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా’ అని ఆమె చెప్పారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని సునీత ప్రశ్నించారు.

News April 6, 2024

‘అమెరికా జోక్యం చేసుకోవద్దు’.. ఇరాన్ వార్నింగ్

image

సిరియాలోని తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో హైటెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడులు మొదలుపెట్టొచ్చని, తమ స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో జోక్యం చేసుకోవద్దని ఇరాన్ అమెరికాను హెచ్చరించగా.. తమ స్థావరాలు, అధికారులపై దాడులు చేయొద్దని US కోరింది. కాగా ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్ ప్రాణాలు కోల్పోయారు.

News April 6, 2024

ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కీ రిలీజ్ వాయిదా?

image

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదలను మే 30కి వాయిదా వేసినట్లు టీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె సందడి చేయనున్నారు. కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు నటించారు. అయితే.. పోస్ట్‌పోన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 6, 2024

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

image

‘టిల్లు స్క్వేర్’ సినిమా వసూళ్లు రూ.100 కోట్లకు చేరువయ్యాయి. 8 రోజుల్లో రూ.96.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మీట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు తెలిపింది. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధూ, విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను చూసిన సంగతి తెలిసిందే.

News April 6, 2024

బంగారం ధరలో ఆల్ టైమ్ రికార్డు

image

బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.73,081ను తాకింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. కాగా కొంతకాలంగా బంగారం ధర వరుసగా పెరుగుతూ వస్తోంది. వెండి ధర సైతం రూ.82,975(కిలో) భారీగా పలుకుతోంది.

News April 6, 2024

‘జై భీమ్’ డైరెక్టర్‌తో నాని మూవీ!

image

‘హాయ్ నాన్న’తో డీసెంట్ హిట్ అందుకున్న నాని వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న నానీ.. ‘జై భీమ్’ డైరెక్టర్‌ జ్ఞాన్‌వేల్‌తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. కథ కూడా విన్నారని టాక్. వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. కాగా.. నాని ఇప్పటికే సుజీత్‌, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు ప్రకటించారు. ‘బలగం’ వేణుతోనూ ఓ చిత్రం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

News April 6, 2024

లోకల్ vs నాన్ లోకల్ పోస్టర్ల కలకలం

image

TG: మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో మూడు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ పార్లమెంట్‌లో తాజాగా లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ‘బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కి.మీ, కాంగ్రెస్ అభ్యర్థి సునీతను కలవాలంటే 59 కి.మీ దూరం వెళ్లాలి. అదే బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని కలవాలంటే 0 కి.మీ. పక్కా లోకల్’ అంటూ అందులో రాసుంది.

News April 6, 2024

రేవంత్‌కు గ్యారంటీల అమలుపై శ్రద్ధ లేదు: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో BJP డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కాషాయపార్టీ దూకుడును ఎవ్వరూ ఆపలేరన్నారు. గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారని.. రాహుల్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌కు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ గ్యారంటీల అమలుపై లేదని దుయ్యబట్టారు.

News April 6, 2024

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి!

image

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఓహియోలోని క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే తెలుగు విద్యార్థి చనిపోయాడు. అతని మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అతని స్వస్థలం మొదలైన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా USలో ఈ ఏడాది.. ఇప్పటివరకు 10 మంది భారత్/భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.