India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
TG: రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నిన్న మెదక్లో అత్యల్పంగా 14.2°C ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.
భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.
AP: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సమావేశాలు నవంబర్ 22 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.
ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.
4 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ T20 నేడు జరగనుంది. జొహనెస్బర్గ్లో రాత్రి 8.30గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా తొలి మ్యాచ్లో భారత్ గెలిస్తే, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టుబిగించాలని ఇటు మెన్ ఇన్ బ్లూ, అటు ప్రొటీస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ పిచ్ కాస్త పేస్కు అనుకూలించే ఛాన్సుంది.
TG: అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘‘అదానీ ఫ్రాడ్’ అని రాహుల్ గాంధీ అంటుంటే, ‘అదానీ నాకు ఫ్రెండ్’ అని రేవంత్ అంటున్నారు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ బెహతరీన్(అద్భుతం) అని రేవంత్ అంటున్నారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే అలాంటి ఫ్రాడ్ దగ్గరికి కాంగ్రెస్ CM రేవంత్ వెళుతున్నారు’’ అని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో KTR అన్నారు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’పై భారీ అంచనాలే ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను కొన్ని విజువల్స్ చూశానని, అవి హ్యారీపోటర్ను తలపించాయని అన్నారు. ఇంట్రెస్టింగ్గా అనిపించాయని ప్రశంసించారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నేడు క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజు విష్ణువు 4 నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కొంటారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఇవాళ ఇంట్లో తులసి మొక్కకు విష్ణుతో వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉంటే సమసిపోతాయని, పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.
Sorry, no posts matched your criteria.