India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. జాతీయ సగటు రూ.90,372గా ఉంది. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92శాతానికి పెరిగింది. ఇందులో జాతీయ సగటు 52%. ఇక దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తొలి 2 రాష్ట్రాలు TG(92%), AP(86%) కావడం గమనార్హం. మరోవైపు ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే 3.8 నుంచి 4.1కి పెరిగింది.
సాధారణంగా అన్ని చోట్ల విజయ దశమి రోజున రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. యూపీలోని కాన్పూర్లో మాత్రం రావణుడిని పూజిస్తారు. ఇక్కడ దశకంఠుడికి ఆలయం ఉంది. దసరా రోజునే తెల్లవారుజామునే దీనిని తెరుస్తారు. వేలాది మంది భక్తులు గుడికి వచ్చి రావణుడిని పండితుడిగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని సాయంత్రం కల్లా మూసివేస్తారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ ఇవాళ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా, క్లీన్ స్వీప్పై దృష్టి సారించింది. మరోవైపు ఒక్క మ్యాచులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ ఆరాటపడుతోంది. మరి పండగ రోజు యువ భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
షవర్ హెడ్స్, టూత్ బ్రష్లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్లు దోహదపడతాయి.
తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ <<14334728>>ఘటనపై<<>> DGCA విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. 141 మందితో ఉన్న విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలెట్తో పాటు విమాన సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు పర్వానికి చేరాయి. ఆఖరి రోజైన ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. దీంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.
TG: రాష్ట్ర సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున కుటుంబ సభ్యులు ఒకచోట చేరి సంబురాలు చేసుకోవడం ఐక్యతకు నిదర్శమన్నారు. చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవిత సత్యాన్ని విజయ దశమి తెలియజేస్తుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు దసరాను జరుపుకుంటారు. దీని వెనుక వేర్వేరు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సురులను, ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు. సీతను అపహరించిన రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు ఇదే రోజున విజయం సాధించారని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయంకరంగా ఉన్నా అంతిమ విజయం మంచిదేనని ఈ పండుగ చాటి చెబుతోంది.
బీజేపీ నేత నవనీత్ కౌర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని భావిస్తున్నట్లు ఆమె భర్త రవి రాణా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు వచ్చే నెల 26తో మహా అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.