News April 6, 2024

మట్టిలో కలిసేవరకు KCR వెంటే ఉంటా: మాజీ మంత్రి

image

TG: KCR కష్టకాలంలో ఉంటే కొందరు స్వార్థం కోసం పార్టీలు మారడం సరికాదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ‘నేను ఎన్నికల్లో ఓడినా.. కేసీఆర్ నన్ను ఎమ్మెల్సీని చేశారు. మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు లేకుండా యాత్ర చేశా. కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నా. అలాంటి నేను.. మట్టిలో కలిసేవరకు ఆయన వెన్నంటే ఉంటా’ అంటూ కార్యకర్తల సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

News April 6, 2024

‘అగ్నికుల్’ రాకెట్ ప్రయోగం వాయిదా

image

AP: అగ్నికుల్ రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఇవాళ ఉదయం 6.04 గంటలకు దీన్ని ప్రయోగించాల్సి ఉంది. అయితే గాలి తీవ్రత దృష్ట్యా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేశారు. 300 కేజీల పేలోడ్‌ను 700 కి.మీ దూరంలోని కక్ష్యలో చేర్చేందుకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

News April 6, 2024

ఆరు వేసవి రైళ్ల పొడిగింపు

image

వేసవి సెలవుల వేళ ద.మ.రైల్వే శుభవార్త చెప్పింది. 6 వేసవి రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాచిగూడ-తిరుపతి ట్రైన్(07653)ను మే 1 వరకు, తిరుపతి-కాచిగూడ(07654) మే 2 వరకు, సికింద్రాబాద్‌-రామగుండం(07695) ఏప్రిల్‌ 24 వరకు పొడిగించింది. రామగుండం-SECBAD(07696) ఏప్రిల్‌ 26 వరకు SECBAD-నర్సాపూర్‌ (07170) ఏప్రిల్‌ 27 వరకు, నర్సాపూర్‌-SECBAD (07169) ఏప్రిల్‌ 28 వరకు పొడిగించింది.

News April 6, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.

News April 6, 2024

నేడు బీఆర్ఎస్ ‘రైతు దీక్ష’లు

image

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ‘రైతు దీక్ష’లు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమీలు నెరవేర్చడంతో పాటు నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీశ్ రావు, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డితో ఇతర నేతలు రైతు దీక్షలలో పాల్గొననున్నారు.

News April 6, 2024

కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు?

image

TG: ఇవాళ తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌లో 12మంది BRS MLAలు చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గంగుల కమలాకర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని BRS శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది సాయంత్రం తేలిపోనుంది.

News April 6, 2024

93.42శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 93.42 శాతం పూర్తయింది. 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1874.85 కోట్లను ప్రభుత్వం అందించింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్ల వద్దే పింఛన్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నేడు కూడా ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు అందిస్తామని అన్నారు.

News April 6, 2024

మీ ఎత్తుగడలు ఇక ముందు సాగవు: హరీశ్

image

TG: ఎన్నికల సమయంలో మేనిఫెస్టోల పేరిట ప్రజలను మోసం చేయొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మోసపూరిత హామీలతో మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనని రాహుల్‌కు రాసిన లేఖలో దుయ్యబట్టారు. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే ఎత్తుగడలు ఇక ముందు సాగవని రాహుల్‌ను హెచ్చరించారు.

News April 6, 2024

సెహ్వాగ్‌కి వారసుడయ్యేనా?

image

భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ది ఓ ప్రత్యేక స్థానం. అతడి రిటైర్మెంట్ తర్వాత.. వీరూ లాంటి డేరింగ్&డ్యాషింగ్ ఓపెనర్‌ను టీమ్ తయారు చేసుకోలేకపోయింది. అయితే SRH బ్యాటర్ అభిషేక్‌శర్మ ఆ లోటు తీర్చేలా కనిపిస్తున్నారు. ఈ యువ కెరటం బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఈ సీజన్‌లో ఆడిన 4మ్యాచుల్లో 32రన్స్(19బంతుల్లో), 63(23), 29(20), 37(12) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

News April 6, 2024

పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా.. పలు వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుం చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష యథావిధిగా ఏప్రిల్ 27వ తేదీన నిర్వహిస్తామని తెలిపింది.