News September 26, 2025

ఓటుకు నోటు కేసు.. నేడు సుప్రీంకోర్టు తీర్పు

image

TG: ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య(ఏ4) పాత్రపై దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం SCలో సవాల్ చేసింది. అటు సూత్రధారి AP CM చంద్రబాబు అని, ఆయనపైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య SCకి లేఖ రాశారు. కాగా ఈ కేసులో అప్పటి TDP MLA రేవంత్‌రెడ్డి అరెస్టవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే.

News September 26, 2025

ఇంటర్ కాలేజీలకు 10 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

TG: ఇంటర్ కాలేజీలకు 10రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్(TPTLF) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ నేతలు ఇంటర్ బోర్డుకు వినతి పత్రం అందజేశారు. దసరా పెద్ద పండుగ అని, అలాగే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అందుకే స్కూళ్లకు 10 రోజులకు పైగా సెలవులిచ్చారని గుర్తుచేశారు. కాగా కాలేజీలకు ఎల్లుండి నుంచి సెలవులు మొదలు కానున్నాయి.

News September 26, 2025

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలు మాట వినట్లేదని బాధపడుతుంటారు. అయితే పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. తీసుకొనే ఫుడ్ నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. మీరు సానుకూలంగా ఆలోచిస్తే పిల్లలకూ అదే అలవాటవుతుంది. క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తే అదే ఫాలో అవుతారు. అలాగే పిల్లలు చెప్పే మాటలను శ్రద్ధగా వింటేనే వారు తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.

News September 26, 2025

పేరెంట్స్‌ను పట్టించుకోకపోతే ఆస్తిపై హక్కుండదు: SC

image

తల్లిదండ్రుల పోషణను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2007లో కేంద్రం తెచ్చిన ‘పేరెంట్స్, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ ప్రకారం పేరెంట్స్‌కు ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉందని పేర్కొంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్ధదంపతులు కోర్టుకెళ్లగా ఆస్తి తిరిగివ్వాలని కుమారుడిని ఆదేశిస్తూ తీర్పిచ్చింది.

News September 26, 2025

పదేళ్లు పైబడిన మామిడి చెట్టుకు వేయాల్సిన ఎరువులు

image

వచ్చే మామిడి సీజన్‌లో మంచి దిగుబడి కోసం.. పదేళ్లు పైబడిన ప్రతి మామిడి చెట్టుకు యూరియా-1కిలో, సున్నం, మెగ్నీషియం, సల్ఫర్ కలిగిన CMS ఎరువు-1 కిలో, సూపర్ ఫాస్ఫేట్-2 కిలోలు, జింకు సల్ఫేట్-250 గ్రా, పొటాష్-1 కిలో, బోరాన్ 50 నుంచి 100 గ్రాములు వేసుకోవాలి. ఈ ఎరువుల మిశ్రమాన్ని చెట్టుకు 4-5 అడుగుల దూరంలో గొయ్యితీసి వేసి, నీరు పెట్టాలి. దీని వల్ల చెట్లలో కొత్త చిగుర్లు బాగా వచ్చి పూత అధికంగా వస్తుంది.

News September 26, 2025

సింగర్ మృతి.. మ్యుజీషియన్ అరెస్ట్

image

స్టార్ సింగర్ <<17761932>>జుబీన్ గార్గ్ మృతి<<>> కేసులో మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని సిట్ అరెస్ట్ చేసింది. జుబీన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో అస్సాం ప్రభుత్వం 10మందితో సిట్ ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా సింగర్ మేనేజర్ సిద్ధార్థ్‌ ఇంట్లో సిట్ దాడులు చేసిన రోజే మ్యుజీషియన్‌ను అరెస్ట్ జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. జుబీన్‌‌తో పాటు గోస్వామి ఘటన జరిగిన రోజు బోటులో ప్రయాణించినట్లు తెలుస్తోంది.

News September 26, 2025

చియా ఫేస్‌ప్యాక్‌తో ముఖానికి మెరుపు

image

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్‌ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్‌‌ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.

News September 26, 2025

నేడు మహిళలు బతుకమ్మ ఆడొచ్చా?

image

బతుకమ్మ అంటేనే ఉత్సవాల పండుగ. కానీ 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆరో రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. అలాగే నైవేద్యం కూడా పెట్టరు. ఎందుకంటే నేటి రోజును అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చేటప్పుడు మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈరోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదని అంటారు. అందుకే పూలతో బతుకమ్మలను చెయ్యరు. నైవేద్యం సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తారు.

News September 26, 2025

రాష్ట్రంలో రిలయన్స్ కన్జూమర్ ప్లాంట్

image

AP: రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ₹40,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్‌లో ఈ మేరకు కేంద్రంతో ఒప్పందం జరిగింది. APలోని కర్నూల్, MHలోని కటోల్, నాగ్‌పూర్‌లో వీటిని నెలకొల్పనుంది. మరోవైపు SLMG, హిందుస్థాన్ కోకకోలా బెవరేజెస్, కంధారి గ్రూప్ సంయుక్తంగా AP, TG సహా 9 రాష్ట్రాల్లో ₹27,760 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి.

News September 26, 2025

నేటి నుంచి లిక్కర్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ

image

TG: రాష్ట్రంలో కొత్త లిక్కర్ షాపులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి OCT 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. OCT 23న డ్రా తీసి షాపులను కేటాయిస్తారు. టెండర్ ఫీజు రూ.3లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో, అప్లికేషన్ల ద్వారా రూ.400 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్స్ కాలపరిమితితో షాపుల కేటాయింపు ఉంటుంది.