India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లలో ఒకదానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శర్మ గైర్హాజరయ్యే<<>> అవకాశం ఉండడంతో ఆ మ్యాచ్కి సారథ్యం వహించేది ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్లలో ఒకరికి కెప్టెన్గా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
TG: పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను శనివారం నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్/ కార్పొరేటర్ ఛైర్మన్గా కమిటీలను ఏర్పాటు చేయాలంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారని GOలో పేర్కొంది. SHG గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో ఉంటారు.
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు మొత్తం 90 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14న లాటరీ తీసి విజేతలను నిర్ణయిస్తారు. 15నాటికి దుకాణాన్ని వారికి అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. కాగా రాష్ట్రంలో 3,396 వైన్ షాపులు ఉన్నాయి.
దేవర-2లో నటీనటులపై డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఉంటే బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అది జరుగుతుందో లేదో తెలియదన్నారు. బాలీవుడ్ స్టార్లను అతిథి పాత్రలకు తీసుకోవడం తనకు ఇష్టముండదని, ముఖ్యమైన క్యారెక్టర్లే ఇస్తానని పేర్కొన్నారు. నటించబోయే వారి వివరాలను త్వరలోనే పాత్రలవారీగా వెల్లడిస్తామని తెలిపారు.
Infosys హైరింగ్ ప్రాసెస్ మొత్తం మార్చేస్తోందని సమాచారం. జాబ్ ఆఫర్లు, అటాచ్మెంట్లను ఈ-మెయిళ్లకు పంపించదు. ఇకపై ఉద్యోగార్థులే కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్లో లాగినై అప్లికేషన్ డీటెయిల్స్ను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మోసాలు, స్కామ్లు జరగకుండా, హైరింగ్ ప్రాసెస్ను మరింత సౌకర్యంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. https://career.infosys.com/offerValidationలోనే ఆఫర్ లెటర్లు ఇవ్వనుంది.
TG: సమగ్ర కులగణనపై రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. సర్వే బాధ్యతను ప్రణాళికశాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్పై CM చంద్రబాబు కన్ఫ్యూజ్ చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ‘NDAలో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణ ఆపలేరా? దేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్లు ఉన్నా, దీనినే ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? సెయిల్లో ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.
మెగాఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ టీజర్ను రేపు ఉదయం 10.49కి విడుదల చేయనున్నట్లు ఆ సినిమా డైరెక్టర్ వశిష్ఠ అనౌన్స్ చేశారు. సినీప్రియులు వేడుక చేసుకునేలా మూవీ ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటలపాటు ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు పుణే, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి.
ఇజ్రాయెల్ దురాక్రమణలకు దిగితే కఠిన చర్యలకు సిద్ధమని ఇరాన్ హెచ్చరించింది. ఇక లెబనాన్ నుంచి ప్రయోగించిన 25 రాకెట్లలో కొన్నింటిని ఇంటర్సెప్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు పౌరులు, జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని లెబనాన్ కోరింది. గురువారం జరిగిన దాడుల్లో 139 పౌరులు మృతి చెందినట్టు తెలిపింది. UN తీర్మానం మేరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని కోరింది.
Sorry, no posts matched your criteria.