News September 26, 2025

మామిడిలో కోతల తర్వాత కత్తిరింపులు చేశారా?

image

మామిడి తోటల్లో కాయ కోతలు పూర్తైన తర్వాత చీడలు సోకిన, ఎండిన కొమ్మలను కత్తిరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. చెట్ల మధ్య భాగానికి గాలి, వెలుతురును అడ్డగించే కొమ్మలు ఏవైనా ఉంటే వాటిని తొలగించడం మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల తోటలోకి గాలి, వెలుతురు బాగా సోకుతుంది. అంతేకాకుండా మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఉద్ధృతి బాగా తగ్గి.. ముందుముందు మామిడి పూత అధికంగా వస్తుంది.

News September 26, 2025

మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వం: కోమటిరెడ్డి

image

TG: ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంలో జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు ఇచ్చామని తెలిపారు. అయితే ధరల పెంపుతో సామాన్యులు నష్టపోతున్నాడని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్‌ను హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇచ్చేందుకైనా సిద్ధమన్నారు.

News September 26, 2025

మామిడి కొమ్మల కత్తిరింపుల తర్వాత ఇలా చేయడం మంచిది

image

కత్తిరించిన మామిడి కొమ్మలను తోట నుంచి పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కత్తిరించిన భాగాలు బాగా తడిసేటట్లు బ్లైటాక్స్(లీటరు నీటికి 3గ్రా) లేదా బోర్డో మిశ్రమాన్ని చెట్టుపై స్ప్రే చేయాలి. మార్కెట్‌లో రెడిమేడ్ బోర్డో మిశ్రమం లభిస్తోంది. దీన్ని లీటరు నీటికి 4-5ml కలిపి కత్తిరించిన చెట్టు భాగాలపై పిచికారీ చేయాలి. దీని వల్ల కత్తిరించిన భాగాల వద్ద తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నాశనమవుతాయి.

News September 26, 2025

సోమరితనం నశింపజేసే శ్రీవారి దర్శనం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి నేటి ఉదయం యోగ నరసింహుడి అలంకారంలో, సింహ వాహనంపై దర్శనమిస్తారు. దశావతారాల్లో నరసింహ అవతారం సింహం గొప్పదనంతో పాటు బలం, వేగం, ధైర్యాన్ని తెలియజేస్తుంది. భక్తులు సింహం అంతటి భక్తి బలంతో ఉంటే దేవుడి అనుగ్రహం లభిస్తుందని ఈ వాహన సేవ అంతరార్థం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం స్వామి ఈ వాహనంపై విహరిస్తూ భక్తుల సోమరితనాన్ని నశింపజేసి, విజయాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి.

News September 26, 2025

దంచికొడుతున్న వర్షం

image

TG: అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌‌లోని సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, కృష్ణా నగర్, యూసఫ్‌గూడ, మాదాపూర్, మణికొండలో వర్షం దంచికొడుతోంది. ఉ.7 గంటలలోపు జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రిలోనూ వానలు పడే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?

News September 26, 2025

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు

image

AP: సంచలనం రేపిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి <<17594985>>కేసును<<>> రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ ఈ కేసును పట్టించుకోవట్లేదని ప్రీతి తల్లి పార్వతి అంతకుముందు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

News September 26, 2025

ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ అవుతుందా?

image

ఆసియాకప్‌లో ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా ఇవాళ సూపర్-4లో శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్న భారత జట్టు PAKతో తుది పోరుకు ముందు ఫీల్డింగ్‌లో వైఫల్యాలను అధిగమించాల్సి ఉంది. మరోవైపు 2 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక నుంచి ఎలాంటి పోటీ ఎదురవుతుందో చూడాలి. దుబాయ్ వేదికగా రా.8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

News September 26, 2025

సైబర్ నేరాలకు పాల్పడితే రౌడీ షీట్లు: డీజీపీ

image

TG: సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టొద్దని సూచించారు. తాజా నిర్ణయంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

News September 26, 2025

34 లక్షల మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు: సత్యకుమార్

image

AP: ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ‘స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో 34 లక్షల మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. వచ్చే నెల 2 వరకు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. మహిళలకు బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టులు, ఇతర పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News September 26, 2025

ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి

image

ఆసియా కప్ 2025లో ఫైనలిస్టులు ఖరారయ్యాయి. ఈ నెల 28న జరిగే ఫైనల్లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఎడిషన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచుల్లోనూ పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా మట్టికరిపించింది. మరోవైపు ఓవరాల్‌గా భారత్, పాక్ రెండు సార్లు(T20I WC-2007, CT 2017) ఫైనల్లో తలపడగా చెరో విజయం సాధించాయి.