News April 5, 2024

రైతును రాజు చేస్తాం: చంద్రబాబు

image

AP: టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని చంద్రబాబు చెప్పారు. నరసాపురం సభలో మాట్లాడుతూ.. ‘మేం ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశాం. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది. కూటమి అధికారంలోకి రాగానే అన్నదాతను ఆదుకుంటాం. రైతును రాజు చేస్తాం. వారికి ఏటా రూ.20వేల చొప్పున సాయం చేస్తాం’ అని పేర్కొన్నారు.

News April 5, 2024

చంద్రబాబు మూర్ఖుడు: కేసీఆర్

image

TG: చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘భూదాన్ పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. రూ.50వేలు పరిహారం ఇవ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబును కోరా. ఆ దుర్మార్గుడు, మూర్ఖుడు పట్టించుకోలేదు. నేను భిక్షాటన చేసి రూ.7.50 లక్షలు ఆ కుటుంబాలకు అందజేశా. BRS ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు ఎన్నో స్కీంలు తెచ్చా’ అని చెప్పారు.

News April 5, 2024

YCP ఓటమి తర్వాత తాడేపల్లిలో టపాసులు కాల్చుతా: పృథ్వీ

image

AP: జగన్ వదిలిన బాణం పోటు 12 శాతం వైసీపీ ఓట్లపై ప్రభావం చూపుతుందని జనసేన నేత పృథ్వీ చెప్పారు. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమైన ఆయన ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ నెల 18 నుంచి ప్రచారం చేస్తాం. 2019లో వైసీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చా. 2024లో ఆపార్టీ ఓటమి తర్వాత మళ్లీ అక్కడే కాల్చుతా’ అని పేర్కొన్నారు.

News April 5, 2024

ముఖ్యమంత్రి నువ్వా? నేనా?: కేసీఆర్

image

TG: తాను వస్తున్నానని తెలిసి కాళేశ్వరం నీళ్లు వదిలారని కేసీఆర్ అన్నారు. ‘నేను మొన్న నల్గొండ వెళ్లి రాగానే సాగర్ ఎడమ కాల్వకు నీరు వదిలారు. ఇప్పుడు కరీంనగర్ వస్తున్నానని తెలిసి పడిపోయాయన్న కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాల్వకు నీళ్లు విడుదల చేశారు. నీళ్లు వదలాలని కేసీఆర్ ముందే చెప్పాలని సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నువ్వా? నేనా?’ అని కేసీఆర్ ఫైరయ్యారు.

News April 5, 2024

GST కొత్త విధానాన్ని తీసుకొస్తాం: కాంగ్రెస్

image

అధికారంలోకి వస్తే ప్రస్తుత జీఎస్‌టీ విధానాన్ని రద్దు చేసి GST 2.0ను తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పేదలపై భారం లేకుండా కొత్త జీఎస్‌టీని రూపొందిస్తామని పేర్కొంది. NDA అమలులోకి తీసుకొచ్చిన ఈ జీఎస్‌టీ రూపకల్పనలో అనేక లోపాలు ఉన్నాయని, అవి ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయని కాంగ్రెస్ గతంలో విమర్శించింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సైతం తగ్గిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

News April 5, 2024

‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’

image

ఉప్పల్ స్టేడియంలో ధోనీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ ఇద్దరి ఫొటోలతో పోస్టర్ క్రియేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఒకరు ఐసీసీ ట్రోఫీల కింగ్.. మరొకరు బాక్సాఫీస్ కింగ్’ అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ధోనీ-తారక్ ఫొటోలతో మరో పోస్టర్‌ను యంగ్ టైగర్ ఫ్యాన్స్ ప్రదర్శించారు.

News April 5, 2024

దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు: KCR

image

తెలంగాణలో 2014కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ‘మేం కరీంనగర్ జిల్లాకు నాలుగైదు జలధారలు సృష్టించాం. అవి ఇప్పుడు ఎండిపోయాయి. గోదావరి ఎడారిగా మారింది. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం, అసమర్థత వల్లే కరవు వచ్చింది. 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయింది. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు. వర్షాలు లేకపోవడం వల్లే కరవు వచ్చిందని చెబుతున్నారు. అది అబద్ధం’ అని మండిపడ్డారు.

News April 5, 2024

నా పెళ్లిపై ట్రోల్స్ పట్టించుకోను: దిల్ రాజు

image

తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ పట్టించుకోనని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘నా పెళ్లి తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నా భార్య చూసి నాకు చెప్పింది. నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటే.. విమర్శించేవారు పది వేల మంది కూడా ఉండరు. నేను ఆకాశం లాంటి వాడిని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి.. ఆ తర్వాత ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 5, 2024

BREAKING: వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా

image

AP: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇక్బాల్ TDPలో చేరనున్నట్లు సమాచారం. ఈయన 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అక్కడ దీపికను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

News April 5, 2024

ప్రచారాస్త్రంగా సోషల్ మీడియా

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నాయి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్ వంటి సోషల్ మీడియా వేదికలను ప్రచారానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా క్రియేటివ్ కంటెంట్‌తో ప్రచారం చేస్తున్నాయి. ఈ వేదికలు ఓటర్ సైకాలజీని ప్రభావితం చేసే మాధ్యమాలుగా ఉద్భవించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.