India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: NDA MLAలంతా ప్రజలతో మమేకం కావాలని CM చంద్రబాబు కోరారు. NDA శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2029లో మీ అందరినీ MLAలుగా మళ్లీ గెలిపించుకోవాలనుకుంటున్నా. MLA ఛైర్మన్గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. స్థానిక టూరిజం అభివృద్ధికి MLAలు డాక్యుమెంట్ సిద్ధం చేయాలి. ఉచిత ఇసుక విధానం మీరే సక్రమంగా అమలు చేయాలి. సమస్యలు నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా’ అని వెల్లడించారు.
తెలంగాణలోని గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని UTF డిమాండ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుగుణంగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకే ఉండేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి విజ్ఞప్తి చేసింది. గతంలో ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాగా రాత్రి వరకు స్కూళ్లు ఉండటంతో తాము ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యం అవుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దేశంలో మరోసారి ఓట్ల పండుగకు సమయమొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20 ST, 6 SC) 685 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా రేపే ఉపఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఈసీ బైపోల్స్ నిర్వహించనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
కూరగాయలు, పండ్లు, నూనెలు ఇతరత్రా నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టాన్ని తాకి 6.21%గా నమోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% లక్ష్యం కంటే అధికం. అయితే, Sepలో 5.49%గా నమోదవ్వడం గమనార్హం. అర్బన్ ప్రాంత ద్రవ్యోల్బణం 4.62% నుంచి 5.62 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా నమోదైంది. ధరల మోత సామాన్యులపై పెను భారం మోపుతోంది.
ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను తెలుసుకుందాం.
లక్షణాలు: దగ్గినప్పుడు ఛాతిలో నొప్పి. చలిగా అనిపించడం. జ్వరం రావటం. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం. ఊపిరి ఆడకపోవడం.
నివారణ చర్యలు: తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్మోకింగ్ చేయొద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు <
జీతం: నెలకు రూ.48,480-రూ.85,290
వెబ్సైట్: unionbankofindia.co.in
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న YCP MLAలకు APCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. ‘ప్రచారం నుంచి ప్రమాణం వరకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని MLAలుగా మీరు చెప్పిన మాటలను మళ్లీ గుర్తు చేస్తున్నా. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు మీరు దూరంగా ఉండటం బాధాకరం, అధర్మం. ఒక వ్యక్తి అహంకారాన్ని మీలోనూ నింపుకుని మీరు చూపుతున్న ఈ నిర్లక్ష్య వైఖరికి నష్టపోయేది ప్రజలు. వారి కోసం సభకు వెళ్లండి’ అని ఆమె లేఖలో కోరారు.
TG: నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారితో పాటు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని DCA అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించాలన్నారు. మెడిసిన్ ధరలు, నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు.
యాపిల్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. అప్పులు చేసైనా సరే iPhone కొనేయాల్సిందేనని భావిస్తుంటారు. అయితే, దేశాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇండియాలో iPhone 16 Pro(256GB) ఫోన్ ధర ₹1,29,999గా ఉండగా సింగపూర్లో ₹1,10,686, దుబాయ్లో ₹1,07,834, మలేషియాలో ₹1,05,259కు లభిస్తుంది. ఇండియాలో తయారవుతున్నప్పటికీ ఎందుకీ వ్యత్యాసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్స్, మాక్స్, వాచ్లు వంటి డివైజ్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని CERT-In వెల్లడించింది. 18.1 లేదా 17.7.1 IOSకు ముందు వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశముందని హెచ్చరించింది. IOS 18.1 లేదా 17.7.1 వెర్షన్లో వాడుతున్న మాక్లు, IOS 11 కంటే ముందు సాఫ్ట్వేర్ కలిగిన వాచ్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్స్కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.