India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL)లో 95 ఖాళీలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరు. ఇందులో డిప్లొమా ట్రైనీ 62, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ 20, మేనేజ్మెంట్ ట్రైనీ 13 పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి బీటెక్, డిగ్రీ/డిప్లొమా పూర్తయిన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్: <

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కంటోన్మెంట్(ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు)లో జరిగిందే జూబ్లీహిల్స్లోనూ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. BRS ఇంకా అపోహల్లోనే బతుకుతోందని, ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పొన్నం వెల్లడించారు.

ప్రస్తుతకాలంలో చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం చాలామంది మహిళలు ఉన్న ఊరు వదిలి, అందరికీ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకతాయిల వేధింపులకు గురవుతుంటారు. వీరి కోసం ప్రభుత్వం కొన్ని టోల్ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. గృహ హింస, వరకట్నం బాధితులైతే 181, మహిళల అక్రమరవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 1098 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

HYDలో ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న యువతి(32)ని లంగర్హౌస్కు చెందిన ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి రేప్ చేసి ఆరాంఘర్లో వదిలేసి వెళ్లాడు. తర్వాత ఆటో డ్రైవర్లు దస్తగిరి ఖాన్, ఇమ్రాన్ ఆమెను కిస్మత్పూర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేసి దారుణంగా హింసించి చంపారు. నగ్నంగా పడిఉన్న యువతి మృతదేహాన్ని ఈనెల 15న పోలీసులు గుర్తించారు.

ఆ ఊరిలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా భుజాన బ్యాగు ధరించి స్కూళ్లకు వెళ్తుంటారు. మహారాష్ట్ర, థానేలోని ఫంగానే గ్రామంలో ‘ఆజిబాయిచి శాల’ అనే పాఠశాల ఉంది. ఇక్కడ వృద్ధ మహిళలకు చదువు బోధిస్తారు. ఇలా ఒకప్పుడు అక్షరాలకు దూరమైన అవ్వల చేతులు ఇప్పుడు అక్షరాల లోకాన్ని తాకుతున్నాయి. ఓ వృద్ధురాలు పవిత్ర గ్రంథాలను చదవాలన్న కోరిక నుంచి పుట్టిన ఈ బడిలో ఇప్పుడు ఎంతోమంది రోజుకు రెండు గంటలు చదువు నేర్చుకుంటున్నారు.

కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు (జ్వరం, తలనొప్పి, బలహీనత, అయోమయం, నీటిని చూసి భయపడటం) కనిపిస్తే రక్షించడం అసాధ్యమని పేర్కొంటున్నారు. కుక్క కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ఆఖరుకు కుక్క <<17811521>>గోరు<<>> గుచ్చుకున్నా నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయాలని సూచిస్తున్నారు.

AP: రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఐదు రోజుల పాటు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.

AP: అసెంబ్లీలో 3 బిల్లుల(SC వర్గీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ)కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 12 కులాలకు 1%, గ్రూప్-2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్-3లోని 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలవనుంది. అలాగే నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లూ ఆమోదం పొందింది.

దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు రెడ్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయాయి. కొన్ని కంపెనీలు మినహా అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగటివ్ సైన్, అమెరికా H1B వీసా నిబంధనలు ఈ నష్టాలకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

TG: కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 3 నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు. 1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 6 నెలల కమీషన్ రూ.120 కోట్లతో పాటు గన్నీ బ్యాగుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించి రూ.15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని ఆయన వివరించారు.
Sorry, no posts matched your criteria.