India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఉద్యోగ సంఘాల జేఏసీ DGPకి ఫిర్యాదు చేసింది. అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు DGPకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేయగా, ఉద్రిక్తతల నేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో అగ్రరాజ్యంలో అబార్షన్ పిల్స్కి డిమాండ్ పెరిగింది. ట్రంప్ గెలిచిన 24 గంటల్లోనే పిల్స్ కోసం 10K అభ్యర్థనలు వచ్చినట్టు ఎయిడ్ యాక్సెస్ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇది రోజువారి డిమాండ్లో 17 రెట్లు అధికమని పేర్కొంది. గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తానని ట్రంప్ ప్రకటించడంతో అక్కడి ప్రజలు అబార్షన్ పిల్స్ కోసం తెగ ఆర్డర్ చేస్తున్నారు.
AP: సూపర్సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.
Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగళవారం నష్టపోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services సహా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 5వ తేదీన 23,900 పరిధిలో Nifty సపోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వడంతో తదుపరి ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ఉత్కంఠ నెలకొంది.
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. <<14057734>>సింగిల్ బెంచ్ తీర్పును<<>> సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ వేయగా, ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం చేసుకోవడం తగదంటూ అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ చేశారు.
తమిళనాడులోని తెప్పకులం PS పరిధిలో 30 ఏళ్ల క్రితం ₹60 చోరీ చేసిన నిందితుడిని మధురై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పెండింగ్ కేసులు విచారిస్తుండగా ఈ కేసు వెలుగుచూసింది. పోలీసులు జక్కతోప్పు ప్రాంతానికి వెళ్లి నిందితుడు పన్నీర్ సెల్వం కోసం విచారించారు. అతను శివకాశిలో ఉంటున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. సగటు ద్రవ్యోల్బణం 6.5% వేసుకున్నా అప్పటి ₹60 విలువ 2024లో ₹396.86 అవుతుంది.
విరాట్ కోహ్లీ ఫేర్వెల్కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్వెల్కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.
AP: కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ప్రతి కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్గా అవకాశం కల్పించింది. కార్పొరేషన్కు 15 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 90 మందిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.
బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. $1.752 ట్రిలియన్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో అసెట్గా అవతరించింది. $1.726 ట్రిలియన్లతో ఉన్న సిల్వర్ను అధిగమించింది. గత 24 గంటల్లో BTC ఏకంగా 9% పెరిగి $88,570 డాలర్లకు చేరడం గమనార్హం. మెటా $1.472, టెస్లా $1.124, బెర్కషైర్ హాత్వే $1.007 ట్రిలియన్ల కన్నా BTC విలువే ఎక్కువ. ఇక బంగారం $17.6 ట్రిలియన్లతో అతిపెద్ద అసెట్గా ఉంది.
Silicon Valley of Indiaగా పేరొందిన బెంగళూరు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నవారికి చుక్కలు చూపిస్తోంది. ఓ అపార్ట్మెంట్లో నెలకు ₹40 వేలు అద్దె ఉన్న ఇంటికి ₹5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాలని యజమాని చెప్పడంతో హర్నిద్ కౌర్ అనే యువతి నిర్ఘాంతపోయింది. దీనిపై ఆమె చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో నెట్టింట చర్చ జరుగుతోంది. అద్దెకు బదులు ఆమె ఇంటినే కొనేయడం ఉత్తమమని కొందరు సలహా ఇస్తున్నారు.
Sorry, no posts matched your criteria.