News September 24, 2025

98 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

image

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ 98 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు OCT 10వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 24, 2025

‘OG’ కోసం ఒక్కరోజు థియేటర్లు ఇచ్చిన ‘మిరాయ్’ మేకర్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా రేపు విడుదల కానుంది. కొన్ని చోట్ల ఇవాళ రాత్రి స్పెషల్ షోలున్నాయి. ఈక్రమంలో ‘మిరాయ్’ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ‘మిరాయ్’ ప్రదర్శించే చాలా థియేటర్లను ‘OG’కి ఇస్తున్నట్లు తెలియజేశారు. పవన్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. ఇక 26వ తేదీన మళ్లీ ఆ థియేటర్లలో ‘మిరాయ్’ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.140+కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

News September 24, 2025

సాహసయాత్రకు బయల్దేరిన CRPF మహిళా సిబ్బంది

image

CRPF ‘యశస్వినీ’ మహిళా బైకర్ల బృందం సాహసోపేతమైన యాత్రకు బయల్దేరింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు వరకూ సాగే బైక్‌ ర్యాలీ మంగళవారం మొదలైంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, 1,400 కిలోమీటర్ల కఠిన రహదారిపై సాగే ఈ ర్యాలీలో 32 మంది మహిళా బైకర్లు పాల్గొంటున్నారు. దేశభక్తి, జాతి సమైక్యత, మహిళా సాధికారతకు ప్రతీకగా ‘దేశ్ కే హమ్ హై రక్షక్’ నినాదంతో వారు దూసుకెళ్తున్నారు.

News September 24, 2025

GOLD: పదేళ్లలో దాదాపు రూ.లక్ష పెరిగింది

image

గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹72వేలుగా ఉండేది. ఇప్పుడు ₹1.16లక్షలకు చేరింది. అంటే 9 నెలల్లోనే ₹44వేలు పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం. 10గ్రా. బంగారం ధర 1970లో ₹184, 1975లో ₹540 మాత్రమే. 2005లో ₹7000 ఉండగా, 2015లో ₹26,343, 2020లో ₹50వేలు టచ్ చేసింది. కరోనా వల్ల ₹36వేలకు దిగొచ్చి తిరిగి పుంజుకుంది. పదేళ్లలో దాదాపు ₹లక్ష పెరిగింది.

News September 24, 2025

171 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏతోపాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు 23-36 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 13. మరిన్ని వివరాలకు <>https://indianbank.bank.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News September 24, 2025

మండలానికి ఒక జూనియర్ కాలేజీ: లోకేశ్

image

AP: మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ‘గత సర్కారు ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేసింది. హైస్కూల్ ప్లస్ విధానంతో కాలేజీల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా పోయారు. మేము ఆ విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రభుత్వ కాలేజీల్లో 40% అడ్మిషన్లు మెరుగుపర్చాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశాం’ అని చెప్పారు.

News September 24, 2025

UCILలో 95 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL)లో 95 ఖాళీలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరు. ఇందులో డిప్లొమా ట్రైనీ 62, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ 20, మేనేజ్‌మెంట్ ట్రైనీ 13 పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి బీటెక్, డిగ్రీ/డిప్లొమా పూర్తయిన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.ucil.gov.in/<<>>

News September 24, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: పొన్నం

image

TG: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కంటోన్మెంట్‌(ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు)లో జరిగిందే జూబ్లీహిల్స్‌లోనూ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. BRS ఇంకా అపోహల్లోనే బతుకుతోందని, ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పొన్నం వెల్లడించారు.

News September 24, 2025

వేధింపులకు చెక్ పెట్టాలంటే..

image

ప్రస్తుతకాలంలో చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం చాలామంది మహిళలు ఉన్న ఊరు వదిలి, అందరికీ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకతాయిల వేధింపులకు గురవుతుంటారు. వీరి కోసం ప్రభుత్వం కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. గృహ హింస, వరకట్నం బాధితులైతే 181, మహిళల అక్రమరవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 1098 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

News September 24, 2025

యువతిపై గ్యాంగ్ రేప్, మర్డర్.. సంచలన విషయాలు

image

HYDలో ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న యువతి(32)ని లంగర్‌హౌస్‌కు చెందిన ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి రేప్ చేసి ఆరాంఘర్‌లో వదిలేసి వెళ్లాడు. తర్వాత ఆటో డ్రైవర్లు దస్తగిరి ఖాన్, ఇమ్రాన్ ఆమెను కిస్మత్‌పూర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసి దారుణంగా హింసించి చంపారు. నగ్నంగా పడిఉన్న యువతి మృతదేహాన్ని ఈనెల 15న పోలీసులు గుర్తించారు.