India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు చవిచూస్తున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 820 పాయింట్లు నష్టపోయి 78,675 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883 వద్ద స్థిరపడ్డాయి. రెండు బెంచ్ మార్క్ సూచీల్లో Lower Lows మినహా ఏకమైనా అప్ ట్రెండ్ ప్యాటర్న్ దర్శనమివ్వలేదు. 23,900 పరిధిలో నిఫ్టీకి, 78,800 పరిధిలోని సెన్సెక్స్కి కొంత సపోర్ట్ లభించినా చివరికి ఆ స్థాయులు కూడా Break Down అయ్యాయి.
పాకిస్థాన్లో జరగాల్సిన <<14588299>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> దక్షిణాఫ్రికాకు తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేకపోవడం, హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించేందుకు PCB ఒప్పుకోకపోవడంతో SAలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
AP: బడ్జెట్ సమావేశాలపై MLAలు అవగాహన పెంచుకోవాలని CM చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన MLAలు, MLCలతో వర్క్షాపులో CM మాట్లాడారు. ‘ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. MLAలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. సభలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. విజన్2047పై సలహాలు ఇవ్వాలి’ అని CM కోరారు.
అత్యవసర కేసుల విచారణ విజ్ఞప్తులపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల లిస్టింగ్ను నోటిమాట ద్వారా విజ్ఞప్తి చేయడాన్ని నిషేధించారు. ‘ఇకపై నోటిమాట, రాతపూర్వకంగా ప్రస్తావించడం ఉండదు. ఈమెయిల్ లేదా ప్రత్యేకమైన స్లిప్పై రాసి ఇవ్వాలి. అలాగే అర్జంట్గా విచారణ చేపట్టేందుకు కారణాలు వివరించాలి’ అని ఆదేశించారు. మాజీ CJI చంద్రచూడ్ హయాంలో కొన్ని కేసులు ఓరల్ రిక్వెస్ట్తో స్వీకరించారు.
టాలీవుడ్ యువ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మనోజ్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ‘గజపతి వర్మ’ పాత్రలో నటిస్తున్నారు. రోహిత్ ‘వరద’, శ్రీనివాస్ ‘సీను’ అనే పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ‘భైరవం’ టైటిల్తో రాబోయే ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అయితే, సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ తరచూ కలుస్తుంటారని సినీవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా అనుష్క నటిస్తోన్న ‘ఘాటీ’ మూవీ సెట్స్కి కూడా ప్రభాస్ వెళ్లినట్లు తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో ‘భాగమతి’ మూవీ సెట్లోనూ వీరిద్దరూ కలుసుకున్నట్లు వెల్లడించాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని మరాఠీ Vs గుజరాతీల మధ్య ప్రాంతీయ పోరుగా విపక్ష MVA న్యారేటివ్ బిల్డ్ చేస్తోంది. MH అవకాశాలను ఇతర రాష్ట్రాలు దోచుకుంటున్నాయని ఇటీవల రాహుల్ గాంధీ విమర్శించారు. ఫాక్స్కాన్, వేదాంత కంపెనీలు MH నుంచి గుజరాత్కు తరలిపోవడాన్ని నేతలు ఉదాహరిస్తున్నారు. మరాఠీ పార్టీలైన శివసేన, NCPలను చీల్చి BJP అధికారాన్ని లాక్కుందని మరాఠీ న్యారేటివ్ సెట్ చేస్తున్నారు.
పేసర్ మహ్మద్ షమీ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రేపు మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఫిట్గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. అహ్మదాబాద్లో జరిగిన ODI వరల్డ్ కప్ ఫైనల్లో షమీ చివరిగా ఆడారు. రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్కు ఏదో విధంగా ఆయన్ను టీమ్ ఇండియా ఆడించే అవకాశం ఉంది.
ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. US బలగాలు 2021లో అఫ్గాన్ను వీడుతూ $7bn విలువైన ఆయుధాలను వదిలేశాయి. వాటిలో వేలాదిగా M4 రైఫిల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్తో ఉండే వీటి ద్వారా నిమిషానికి 700-900 రౌండ్స్ కాల్చవచ్చు. రేంజ్ 500M-3,600M వరకు ఉంటుంది.
TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.
Sorry, no posts matched your criteria.