India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్హౌస్లో జరిగిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.
2024 ఏడాదికిగానూ సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ను నోబెల్ వరించింది. మానవ జీవితంలోని చరిత్రాత్మక సంఘర్షణలు, దుర్భలత్వాన్ని కళ్లకు కడుతూ ఆమె రాసిన ప్రభావవంతమైన కవితలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. సియోల్లో స్థిరపడ్డ హాన్ సాహిత్యంతోపాటు, కళలు, సంగీతానికి జీవితాన్ని అంకితం చేశారని ది స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
1998లో టాటా తయారుచేసిన తొలి హాచ్బ్యాక్ కారు ఇండికా సక్సెస్ కాలేదు. దీంతో ఫోర్డ్ కంపెనీకి విక్రయించాలనుకున్నారు. చర్చల సమయంలో ఫోర్డ్ యజమాని బిల్ ఫోర్డ్ రతన్ టాటాను అవమానించేలా మాట్లాడారు. దీంతో రతన్కు పౌరుషం వచ్చి ఆ డీల్ను ఆపేశారు. తన ప్రతిభతో మార్కెట్లో అదే కారును అగ్రస్థానంలోకి తీసుకొచ్చారు. చివరికి ఫోర్డ్కే చెందిన జాగ్వార్, లాండ్ రోవర్లను కూడా టాటా కొనుగోలు చేసింది. దటీజ్ రతన్ టాటా.
భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మామూలుగా అయితే ఫోన్లో క్షేమ సమాచారాల్ని కనుక్కొని ఉండొచ్చు. కానీ స్వయంగా ముషీర్ ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. సర్ఫరాజ్ ఖాన్ ఆ ఫొటోను ఇన్స్టాలో పెట్టడంతో విషయం వైరల్ అయింది. ఇది కదా నాయకత్వమంటే అంటూ రోహిత్ ఫ్యాన్స్ ఆయన్ను కొనియాడుతున్నారు.
రతన్ టాటా అంత్యక్రియలు పార్సీ సంప్రదాయం ప్రకారం జరిగే అవకాశం ఉంది. జొరాస్ట్రియన్లు దేహాన్ని ప్రకృతివరంగా భావిస్తారు. గాలి, నీరు, నిప్పు కలుషితం కాకుండా తిరిగి ప్రకృతికే సమర్పిస్తారు. గద్దలు, రాబందులకు ఆహారంగా ఉంచుతారు. అయితే ప్రస్తుతం పార్సీలు ఎక్కువగా పర్యావరణహితం కోసం ఎలక్ట్రిక్ క్రిమెటోరియంలను ఆశ్రయిస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలూ అలాగే జరిగే అవకాశం ఉంది.
2008లో బెంగాల్ నుంచి పరిశ్రమలు తరలించాల్సి వచ్చినప్పుడు PM మోదీ 3 రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించారని రతన్ టాటా గతంలో గుర్తు చేసుకున్నారు. అప్పటి గుజరాత్ CMగా ఉన్న మోదీ తమను ఆహ్వానించారని, స్థలం కేటాయిస్తే తప్పక వస్తామని చెప్పామన్నారు. అప్పుడు 3 రోజుల్లో స్థలం కేటాయిస్తామని చెప్పి మోదీ మాట నిలుపుకున్నారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం కోసం ఆయన నిజాయితీగా పనిచేశారన్నారు.
పాక్తో తొలి టెస్టులో అదరగొట్టిన బ్రూక్(317), రూట్(262) వరల్డ్ రికార్డ్ సాధించారు. విదేశీ గడ్డపై ఏ వికెట్కైనా అత్యధిక పార్ట్నర్షిప్(454) నమోదు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. 1934లో బ్రాడ్మన్&పోన్స్ఫోర్డ్(AUS) ఇంగ్లండ్పై 451 స్కోర్ చేయగా, 90 ఏళ్లకు ఆ రికార్డును బ్రూక్&రూట్ బద్దలుకొట్టారు. 3,4,5 స్థానాల్లో అటపట్టు&సంగక్కర 438(vsZIM), జయవర్దనే&సమరవీర 437(vsPAK), డిప్పెనార్&రుడాల్ఫ్(vsBAN) ఉన్నారు.
AP: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలంటూ NTR(D) YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో VJAలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు వచ్చాయని అవినాశ్ ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద పరిహారం కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారికే కూటమి నేతలు పరిహారం ఇచ్చారని, అర్హులను గాలికొదిలేశారని మండిపడ్డారు.
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 81,611 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,998 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్లో 82,000 వద్ద ఉన్న రెసిస్టెన్స్ అడ్డుగోడలా పనిచేయడంతో సూచీ ముందుకు కదల్లేదు. అటు నిఫ్టీలోనూ 25,135 వద్ద Day Highని సూచీ దాటలేదు. Kotak Bank, JSW Steel, HDFC, BEL టాప్ గెయినర్స్. Cipla, Techm, Trent, Sun Pharma టాప్ లూజర్స్.
Sorry, no posts matched your criteria.