News January 6, 2025

No Hikes: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్!

image

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాకిచ్చింది. వేతనాల పెంపును FY25 నాలుగో త్రైమాసికానికి వాయిదా వేసినట్టు తెలిసింది. అంటే ఏప్రిల్ వరకు పెంపు ఉండనట్టే. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో హైక్ ఇవ్వడం గమనార్హం. సాధారణంగా ఇన్ఫీ 2025 ఆరంభంలోనే హైక్‌ను ప్రకటించాల్సింది. ప్రాఫిటబిలిటీ కోసం HCL TECH, LTI MINDTREE, L&T వేతనాల పెంపును వాయిదా వేయడంతో ఆ బాటలోనే నడిచింది. పర్ఫామెన్స్ బోనస్ మాత్రం సగటున 90% వరకు ఇచ్చింది.

News January 6, 2025

గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు: దేశంలో ఎన్నంటే?

image

గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు నమోదైనట్టు సమాచారం. అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పేషంట్ చేరినట్టు ABP అస్మిత న్యూస్ తెలిపింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లని పేర్కొంది. దీంతో దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నట్టైంది. బెంగళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు HMPV సోకినట్టు ICMR ఉదయం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.

News January 6, 2025

ఆఫీసుల్లో మాస్కులు షురూ!

image

HMPV భారత్‌లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. కార్పొరేట్ కార్యాలయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. బెంగళూరులో ఇవాళ ఒక్క రోజే 2 HMPV పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News January 6, 2025

ఘోరం.. చంపి, గుండెను బయటకు తీశారు!

image

ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడిని చంపి గుండెను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. రూ.120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ముకేశ్ కథనాలు ప్రసారం చేశారు. ఆ కొన్నిరోజులకే కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ డెడ్ బాడీ లభ్యమైంది.

News January 6, 2025

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

image

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్‌లోని ఆ ఆఫీసుకు చేరుకున్నారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, సెజ్ వాటాలను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సెజ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.

News January 6, 2025

చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం

image

TG: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ₹413cr వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్మినల్ నిర్మించారు. 50 రైళ్లు నడిచేలా 19 ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి.

News January 6, 2025

అనంత శ్రీరామ్ వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు డైరెక్టర్

image

‘కల్కి 2898 AD’లో కర్ణుడి పాత్రను గొప్పగా చూపించి చరిత్రను వక్రీకరించారన్న అనంత శ్రీరామ్ <<15072339>>వ్యాఖ్యలపై<<>> డైరెక్టర్ వేణు ఉడుగుల స్పందించారు. ఆయన వ్యాఖ్యలు కేవలం కర్ణుడి క్యారెక్టర్ గురించా? లేదా తొలిసారి ‘దాన వీర శూర కర్ణ’తో కర్ణుడి వ్యక్తిత్వాన్ని జనానికి చూపించిన NTRనూ తప్పుబట్టడమా? అని ప్రశ్నించారు. ‘ప్రతి పాత్రలో మంచి, చెడు ఉంటాయి. శ్రీరామ్ ఒకే కోణంలో మాట్లాడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News January 6, 2025

ప్రైవేట్ బస్సులు దోచుకుంటున్నాయి: విజయసాయి

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయని YCP MP విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రెగ్యులర్ ఛార్జీలపై డబుల్, ట్రిపుల్ వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని కోరారు. మామూలు రోజుల్లో రూ.1500 వరకు ఉండే HYD- వైజాగ్ ప్రైవేట్ బస్సుల AC స్లీపర్ టికెట్‌కి ప్రస్తుతం రూ.5K, రూ.1200 వరకు ఉండే HYD-TPT టికెట్ రూ.3Kకి పైగా వసూలు చేస్తున్నాయి.

News January 6, 2025

ఎన్నికల బాండ్లు వస్తే అవినీతి ఎలా అవుతుంది?: కేటీఆర్

image

TG: గ్రీన్‌కో సంస్థ ఎన్నికల బాండ్ల రూపంలో <<15078396>>BRSకు రూ.41 కోట్లు<<>> చెల్లించిందని ప్రభుత్వం వెల్లడించడంపై కేటీఆర్ స్పందించారు. ‘2023లో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ జరిగింది. గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు 2022లో ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ బాండ్లను కూడా ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ-కార్ రేసు కారణంగా గ్రీన్‌కో నష్టపోయింది. పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.

News January 6, 2025

అలాగైతే.. మళ్లీ టెలికం ఛార్జీలు పెంచక తప్పదు!

image

డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ రూల్స్‌పై టెలికం కంపెనీలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటాను భారత్ బయటకు బదిలీ చేయడంపై రూపొందించిన రూల్స్ ఇంటర్నేషనల్ కాల్స్‌, మెసేజెస్, విదేశీ నంబర్లకు వాట్సాప్ మెసేజులు పంపడంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. వీటిని అమలు చేయడం కష్టమని, చాలా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. టెలికం ఛార్జీల రూపంలో ఈ భారమంతా కస్టమర్లపై వేయాల్సి వస్తుందని చెప్తున్నారు.