News April 5, 2024

GET READY: ‘శ్రీవల్లి’ వచ్చేస్తోంది

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా శ్రీవల్లి ఫస్ట్ లుక్‌‌ను మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఉదయం 11.07 గంటలకు శ్రీవల్లి రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 5, 2024

ఉమేశ్ ఖాతాలో ఆ రికార్డు

image

గుజరాత్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డును సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. పంజాబ్‌పై ఉమేశ్ 34 వికెట్లు తీయడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో మోహిత్ శర్మ(MIపై 33 వికెట్లు), సునీల్ నరైన్(పంజాబ్‌పై 33 వికెట్లు), బ్రావో(MIపై 33 వికెట్లు), భువనేశ్వర్(KKRపై 32 వికెట్లు) ఉన్నారు.

News April 5, 2024

వడ్డీ రేట్లలో నో ఛేంజ్: RBI

image

రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో RBI కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 6.5శాతంగానే కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా గత ఆరు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో RBI వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకుండా 6.5శాతాన్నే కొనసాగిస్తూ వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) RBIకి ఇదే తొలి ప్రకటన.

News April 5, 2024

వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్ ఈయనే!

image

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన జాన్ టిన్నిస్‌వుడ్ నిలిచారు. వెనిజులకు చెందిన జువాన్‌ పెరెజ్‌ మోరా(114) మరణించడంతో ఆయన స్థానాన్ని జాన్ భర్తీ చేశారు. 1912లో జన్మించిన ఈయన.. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ‘రాయల్‌ మెయిల్‌’లో అధికారిగా సేవలందించారు. తన సుదీర్ఘ జీవిత ప్రయాణానికి కారణాలేంటని అడిగిన వారికి.. ‘మంచి ఆహారంతోపాటు ప్రతి శుక్రవారం చేపల భోజనం, వ్యాయామం చేయడం’ అని చెప్పుకొచ్చారు.

News April 5, 2024

ప్రముఖ తెలుగు యాంకర్ మృతి

image

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ HYD యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. DDలో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి JOBలో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు. 2011లో పదవీ విరమణ చేశారు.

News April 5, 2024

గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: SC, ST గురుకులాల పరిధిలోని 54 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లలో 8వ తరగతి నుంచే IIT, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు అందించనున్నారు. రోజువారీ పాఠాలతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై వీటిని బోధించనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. విద్యార్థులకు రెండేళ్ల పాటు ఆన్‌లైన్ కంటెంట్ ఫ్రీగా అందించనున్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించేలా శిక్షణనివ్వనున్నారు.

News April 5, 2024

LS ఎలక్షన్స్: సింగిల్ డిజిట్ తేడాతో గెలిచింది వీరే

image

లోక్‌సభ ఎన్నికల్లో 1962 నుంచి ఇప్పటివరకూ ఇద్దరు అభ్యర్థులు సింగిల్ డిజిట్ తేడాతో గెలిచారు. 1989లో ఉమ్మడి APలోని అనకాపల్లి స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్‌లో BJP అభ్యర్థి సోం మరాండీ కూడా 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా రామకృష్ణ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి JSP అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 5, 2024

ఐపీఎల్ మ్యాచ్‌ల వీక్షణలో సరికొత్త రికార్డ్

image

IPL-2024 సీజన్ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తొలి పది మ్యాచ్‌లను టీవీల్లో 35 కోట్ల మంది వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ డిస్నీస్టార్ వెల్లడించింది. ఇది ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్ల కంటే అత్యధికం కాగా ఓవరాల్ వాచ్‌టైమ్ 8,028 కోట్ల నిమిషాలుగా ఉంది. ఇది గతేడాదికన్నా 20 శాతం ఎక్కువ. ఈ సీజన్‌లో RCB, చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించిన సంగతి తెలిసిందే.

News April 5, 2024

రేపటి నుంచి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు నెల్లిమర్ల, ఏప్రిల్ 7న అనకాపల్లి, ఏప్రిల్ 8న ఎలమంచిలి నియోజకవర్గాల్లో జరిగే వారాహి విజయ భేరి యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తీవ్ర జ్వరం నుంచి కోలుకోవడంతో ఆయన ప్రచార షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది.

News April 5, 2024

చంద్రబాబు.. మీ దిమ్మ తిరుగుతుంది: VSR

image

AP:ప్రజలు జగన్‌ను మరోసారి CMగా చూడాలని నిర్ణయించుకున్నారని YCP MP విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ‘మీ న’మ్మక’స్తుడు నిమ్మగడ్డ రమేశ్‌తో వాలంటీర్లపై విషం చిమ్మించావు. వదిన పురందీశ్వరితో 22 మంది IPSలపై ఫిర్యాదు చేయించావు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నా అనుకుంటున్నావేమో. ప్రజలు కొట్టే దెబ్బకు మీ దిమ్మ తిరుగుతుంది. ఇవే మీకు ఆఖరి ఎలక్షన్లు’ అని ట్వీట్ చేశారు.