India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వందేభారత్ రైళ్లలో ఫుడ్ దారుణంగా ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. రూ.220 తీసుకుని నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పనీర్ కర్రీ నీళ్లలాగా ఉందని, దీన్ని ఎలా తినాలని ప్రశ్నించారు. మెనూ ఛాయిస్ కూడా ఉండట్లేదని వాపోయారు. రైళ్లలో కంటే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్లడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1,470 తగ్గి రూ.77,290కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,350 తగ్గి రూ.70,850 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.2,000 తగ్గి రూ.లక్షకు చేరింది.
స్టార్ హీరో షారుఖ్ ఖాన్ను చంపేస్తామంటూ <<14551902>>బెదిరింపు<<>> కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందిన ఫైజల్ ఖాన్ ఇటీవల రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బాంద్రా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. దబ్బులివ్వకుంటే షారుఖ్ను చంపేస్తానన్నాడు. దీంతో అతనిపై FIR నమోదైంది. అయితే తన మొబైల్ పోయిందని, అందులో నుంచి ఎవరో కాల్ చేశారని ఫైజల్ చెబుతున్నాడు.
ఆస్ట్రేలియాలో పాక్ ఇటీవల వన్డే సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అక్కడి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దీనిపై ఆ జట్టు కోచ్ జాసన్ గిలెస్పీ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇండియాతో ఆడే BGTపై పెట్టిన దృష్టిని మా వన్డే సిరీస్పై ఆస్ట్రేలియా మీడియా పెట్టలేదు. పాక్తో వన్డేలకు కనీస ప్రమోషన్స్ చేయాలి కదా? క్రికెట్ ఆస్ట్రేలియాకు భారతే ముఖ్యం అన్నది తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలను పెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై <<14581839>>కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే.
దేశీయ బెంచ్మార్క్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. క్షణాల్లోనే పెరుగుతూ తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, CPI డేటా రావాల్సి ఉండటమే ఇందుకు కారణాలు. సూచీల గమనం తెలియకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,582 (+86), నిఫ్టీ 24,166 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, ఐటీ, మీడియా, హెల్త్కేర్ షేర్లు పెరిగాయి. ఆటో, FMCG సూచీలు తగ్గాయి.
J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు డ్రిల్లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘ఫ్యామిలీ మ్యాన్’ రైటర్ సుపర్న్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫొటోను రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మతో వర్మ అండ్ వర్మ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే, తమకు క్యాస్ట్ ఫీలింగ్ లేదనే విషయంపై తాను ప్రమాణం చేయలేనని చమత్కరించారు. ఈ ముగ్గురూ నిన్న రాత్రి ఓ పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది.
AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని, BCలకు 66%, SCలకు 20%, STలకు 14% చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు EWS అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. 2 నెలల పాటు ఇవ్వనున్న ఈ కోచింగ్ టైంలో నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1000 ఇస్తామని తెలిపారు.
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు <<14588376>>అరెస్టు చేయడాన్ని<<>> కేటీఆర్ ఖండించారు. ‘అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? వాళ్లేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?’ అని Xలో ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.