India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి భారత్ రాదని దాదాపు తేలిపోవడంతో పాకిస్థాన్ ఆగ్రహంతో ఉంది. ఇకపై ఏ ఇంటర్నేషనల్ పోటీలోనైనా INDతో ఆడకుండా వైదొలగడానికి దాయాది దేశం సిద్ధమైనట్లు Geo న్యూస్ వెల్లడించింది. అలాగే 2036లో ఒలింపిక్స్ ఆతిథ్యానికి ఆసక్తిగా ఉన్న భారత్కు వ్యతిరేకంగా పాక్ లాబీయింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా ఎంతో ప్రభావం చూపే ఇండియాను పాక్ అడ్డుకోగలదా అనేది పెద్ద ప్రశ్న.
భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి మంత్లీ సిప్ ఇన్ఫ్లో OCTలో రూ.25,000Cr చేరుకుంది. SEPలోని రూ.24,509Cr మార్కును దాటేసింది. 2023 OCTలో ఈ విలువ రూ.16,928 కోట్లే. మొత్తంగా ఈక్విటీ స్కీముల్లోకి రూ.41,886 కోట్ల ఇన్ఫ్లో వచ్చింది. ఇక రిటైల్ AUM OCTలో రూ.39,18,611 కోట్లుగా ఉంది. ప్రస్తుతం MF ఫోలియోస్ 21,65,02,804 ఉండగా రిటైల్ MF ఫోలియోస్ 17,23,52,296గా ఉన్నాయి.
TG: రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా ఏడు రాష్ట్రాల సీఎంలు, ఐదుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంది. రాష్ట్రాల మధ్య వివాదాలను, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిశీలించి సలహా ఇవ్వడం దీని బాధ్యత.
AP: అసెంబ్లీలో అందించే భోజనం సరిగా లేదని పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా చెప్పారా? ఎమ్మెల్యేలంటే తమాషాగా ఉందా? మీ ఇష్టానుసారం చేస్తారా? అని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు 3 ఇన్ 1 ట్రేడింగ్ అకౌంట్లు జారీచేయాలని సెబీ ఆదేశించింది. ఆ అవకాశం లేకుంటే UPI ఆధారిత బ్లాక్ మెకానిజంతో ABSA తరహాలో ట్రేడింగ్ ఫెసిలిటీ కల్పించాలని సూచించింది. 3 ఇన్ 1 అకౌంట్లో సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు కలిపే ఉంటాయి. దీంతో షేర్లు కొనుగోలు చేయకుండా మిగిలున్న డబ్బుకు వడ్డీ వస్తుంది. ప్రస్తుతం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలే ఒక చోట దొరుకుతున్నాయి.
TG: జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆధారాలు లేని పిటిషన్ కొట్టేయాలని మాగంటి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేయగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణపై స్టే విధించింది. దీంతో పాటు ప్రతివాది అజహరుద్దీన్కు నోటీసులు జారీ చేసింది.
AP: భవిష్యత్తులో యువత తగ్గుతుందని అందుకే జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని CM చంద్రబాబు అన్నారు. నిన్న ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సూచించారు. ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతారని వ్యాఖ్యానించారు.
AP: తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి సమ్మె చేయనున్నట్లు 108 ఉద్యోగుల సంఘం వెల్లడించింది. 108 సర్వీసుల నిర్వహణ సంస్థ మారినప్పుడల్లా ఉద్యోగులు గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవ్ ఎమౌంట్, ఇయర్లీ ఇంక్రిమెంట్ల విషయంలో నష్టపోతున్నారని తెలిపింది. వీటిని చెల్లించకుండానే సంస్థలు తప్పుకుంటున్నాయని పేర్కొంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
PAKలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో పాక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్తో సమస్య పరిష్కారమయ్యే వరకు ICC లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్లు ఆడకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పాక్ క్రికెట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినట్లు పాక్ పత్రిక ది డాన్ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానమేనని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.