India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రం చేస్తోంది. శనివారం నుంచి జరిపిన 30 వేర్వేరు దాడుల్లో 70 మంది మృతి చెందారు. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించడానికి ఆ దేశ బంధీల వీడియోలను హమాస్ విడుదల చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కు 8 బిలియన్ డాలర్ల ఆయుధాల సరఫరాకు బైడెన్ అంగీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా యుద్ధంలో 45,658 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

AP: ప్రధాని మోదీ విశాఖ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. 8న నగరంలో కి.మీ మేర PM రోడ్ షో ఉంటుందని పర్యటనపై సమీక్ష తర్వాత మాట్లాడారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మరోసారి తేల్చి చెప్పారు. రుషికొండ ప్యాలెస్ తప్ప, ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. లులు, IT కంపెనీలను తరిమేసిందని విమర్శించారు. దేశంలో భారీగా పెన్షన్ ఇస్తోంది ఏపీనే అని లోకేశ్ చెప్పారు.

TG: ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. HICCలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వేష, భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కోపంలోనూ ఎదుటివారి మంచిని కోరుకోవడం మన సంప్రదాయం. మీ పిల్లలు చల్లగుండ.. మీ ఇల్లు బంగారంగాను అని తిట్టుకునేవారు. మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే’ అని పేర్కొన్నారు.

TGలో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచి జారీ చేయనుంది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్సుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, గత విధానాలనే యథాతథంగా కొనసాగించే ఛాన్సుంది. గ్రామసభలు, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇప్పటికే వచ్చిన 12 లక్షల దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంది.

ఏపీలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఓ నాయకుడు HYDలో జోరుగా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యవహారాలు హద్దుమీరుతున్నాయని AP ప్రభుత్వాన్ని TG సర్కార్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. TG భూవ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్న ఆయన్ను అదుపు చేయాలని సీఎం CBNకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన వారంలో 3 రోజులు HYDలోనే ఉంటూ పంచాయతీలు, పార్టీలతో బిజీగా ఉంటున్నారని సమాచారం.

SEBI వద్ద రిజిస్టర్కాని యాప్లలో పెట్టుబడులు పెట్టి బకరా అవ్వద్దని ఇన్వెస్టర్లను Cyber Crime విభాగం హెచ్చరించింది. క్విక్ మనీ, అధిక ప్రాఫిట్స్ పేరుతో మోసాలు పెరుగుతుండడంతో జాగ్రత్త వహించాలంది. సోషల్ మీడియాలో బుల్స్ స్ట్రాటజీస్ పేరుతో ఇచ్చే టిప్స్ను నమ్ముకొని ట్రేడింగ్ చేయవద్దని హెచ్చరించింది. ఇన్వెస్ట్మెంట్ మోసాలపై 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. Share It.

BGT సిరీస్ ఓటమి అనంతరం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్లేయర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ఒకవేళ వారు డొమెస్టిక్ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వకపోతే జట్టు కోరుకునే ఆటగాళ్లను ఎప్పటికీ పొందలేము’ అని పేర్కొన్నారు. జాతీయ జట్టులో చోటుదక్కించుకున్న తర్వాత చాలా మంది దేశవాళీ క్రికెట్ను చిన్నచూపు చూస్తోన్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికలో పలు హామీలను గ్యారంటీల పేరుతో ప్రకటిస్తున్న కాంగ్రెస్ తాజాగా ఢిల్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. Febలో జరగనున్న ఎన్నికల కోసం సోమవారం నుంచి పలు దశల్లో గ్యారంటీలను ప్రకటించనుంది. ఢిల్లీలో మహిళలకు ఆప్ ప్రకటించిన ₹2,100 సాయం కంటే అధికంగా కాంగ్రెస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య బీమా, ఉచిత రేషన్, విద్యుత్ హామీలపై కసరత్తు తుదిదశకు చేరుకుంది.

AP: రేపటి నుంచి NTR వైద్యసేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది. ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ.1500cr బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.

మెగా ప్రిన్సెస్ క్లీంకార పూర్తి ఫొటోను రామ్చరణ్-ఉపాసన దంపతులు ఇంతవరకు బయటపెట్టలేదు. దీనిపై అన్స్టాపబుల్ షోలో ‘ఎప్పుడు బయటపెడతారు’ చరణ్ను బాలకృష్ణ ప్రశ్నించారు. ‘ఏ రోజైతే నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు రివీల్ చేస్తా. చాలా సన్నగా ఉంటుంది. తినాలంటే ఇల్లంతా తిరుగుతుంది’ అని చెర్రీ బదులిచ్చారు. అలాగే ఉపాసన, పవన్ కళ్యాణ్, ప్రభాస్ల గురించి పలు ప్రశ్నలను చరణ్కు బాలయ్య సంధించారు.
Sorry, no posts matched your criteria.