India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటర్లో ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు రెగ్యులర్గా అందించే సర్టిఫికెట్తో పాటు జాతీయ స్థాయిలో ఇచ్చే NCVTE సర్టిఫికెట్ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం NCVTEతో ఇంటర్ బోర్డు అఫిలియేట్ కానుంది. రాష్ట్రం వెలుపల వృత్తి విద్యలో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. APలోని 722 కాలేజీల్లో ఉన్న 23 ఒకేషనల్ కోర్సుల్లో ఏటా 80-90 వేల మంది చదువుతున్నారు.
AP: దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై జగన్మాత నేడు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దుర్గముడనే రాక్షసుడ్ని సంహారం చేసిన శక్తి స్వరూపిణే దుర్గాదేవి. ఈరోజు అమ్మను దర్శించుకుంటే గ్రహ బాధలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు సిబ్బంది అన్నపానీయాలు అందిస్తున్నారు.
టెలికం కంపెనీల ఆదాయం జూన్తో ముగిసిన త్రైమాసికానికి 8% పెరిగినట్లు ట్రాయ్ వెల్లడించింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే నెలవారి సగటు ఆదాయం రూ.157.45గా ఉంది. గత మార్చికి ఇది రూ.153.54గా ఉంది. టెలికం రంగం స్థూల ఆదాయం 0.13% పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. పల్లెల్లో టెలికం వినియోగం 59.19% నుంచి 59.65%కి పెరగ్గా, పట్టణాల్లో 133.72% నుంచి 133.46%కి తగ్గింది. టెలిఫోన్ చందాదారుల సంఖ్య 1205.64 మిలియన్లుగా ఉంది.
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినప్పటికీ హెవీవెయిట్స్ అండతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. BSE సెన్సెక్స్ 81,780 (+310), NSE నిఫ్టీ 25,072 (+90) వద్ద కొనసాగుతున్నాయి. పవర్గ్రిడ్, NTPC, కొటక్ బ్యాంక్, M&M, ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్. అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్స్.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో బాలీవుడ్ కూడా మూగబోయింది. ఆయన నిర్మించిన సినిమాను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. 2004లో ‘ఏత్ బార్’ అనే చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. విక్రమ్ భట్ రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ఫియర్’ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత టాటా మళ్లీ సినిమాల వైపు తొంగి చూడలేదు.
జమ్మూ కశ్మీర్లో కమ్యూనిస్టుల కోటగా నిలుస్తూ వస్తోంది కుల్గాం నియోజకవర్గం. ఇందుకు కారణం యూసఫ్ తరిగామి. 1996 నుంచి ఇక్కడ CPM జెండాను రెపరెపలాడిస్తున్నారు. 18 ఏళ్ల వయస్సులో ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి కశ్మీర్ ప్రయోజనాల కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో నిషేధిత జమాతే ఇస్లామి బలపర్చిన అభ్యర్థితో తలపడ్డారు. అభివృద్ధి అజెండాతో మరోసారి విజయ దుందుభి మోగించారు.
టాటా గ్రూప్ అనేది అనేక కంపెనీల సముదాయం. ఇందులో ఆటో మొబైల్స్ మొదలుకొని ఫైనాన్స్, టెలికాం, మీడియా, ఆహార ఉత్పత్తులు, టెక్నాలజీ, ఇన్ఫ్రా, ఎయిరోస్పేస్ వంటివి ఉన్నాయి. టాటా అనేది భారత్కు చెందిన కంపెనీ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దాదాపు 100 దేశాల్లో వ్యాపారాలను కొనసాగిస్తోంది. రతన్ టాటా హయాంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. టాటా గ్రూప్ కంపెనీస్ పూర్తి లిస్ట్ను పైన ఫొటోలో చూడొచ్చు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు. ‘ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అని ఆమె ట్వీట్ చేశారు. రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు. ఓ ఇంగ్లిష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత బాలీవుడ్, బెంగాలీలో పలు చిత్రాల్లో నటించారు.
AP: రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి అని, ఆయన పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని Dy.CM పవన్ కళ్యాణ్ కొనియాడారు. టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు. ఉప్పు నుంచి విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా పేరు ప్రతిధ్వనించేలా చేశారని తెలిపారు. టాటా అంటే పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజసేవ చేశారని పవన్ ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.