News September 21, 2025

ఓటర్ల జాబితా.. మీ పేరు చెక్ చేసుకోండి!

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. ఆ జాబితా చూసేందుకు ఇలా చేయండి.
<>tsec.gov.in<<>> సైట్ ఓపెన్ చేయాలి. Final Rolls Ward Wise Voter Listపై క్లిక్ చేయాలి. అందులో జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ పేర్లు సెలక్ట్ చేసుకోగానే వార్డుల వారీగా లిస్టు కనిపిస్తుంది.
Share It

News September 21, 2025

24 గంటలు గడవక ముందే మాట మార్చేశారు.. ఎందుకిలా?

image

H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే సమయంలో కామర్స్ సెక్రటరీ <<17768634>>హోవర్డ్<<>> ప్రతి ఏడాది లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పారు. కానీ 24 గంటలు తిరగకముందే వైట్‌హౌస్ మరో ప్రకటన చేసింది. కేవలం కొత్త వీసాల కోసం అప్లై చేసే వారికే ఆ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. దీంతో ఏం జరిగింది? ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? అనే సందేహాలు వస్తున్నాయి.

News September 21, 2025

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

image

AP: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉ.9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1న ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్ 2 దసరా రోజున తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

News September 21, 2025

BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

image

జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్‌గా నిలిచారు.

News September 21, 2025

మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

image

ఢిల్లీలో జరిగే ‘రామ్‌లీల’ ఈవెంట్‌లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్‌కుశ్ రామ్‌లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.

News September 21, 2025

APSRTCలో 281 ఉద్యోగాలు

image

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం రీజియన్లలో డీజిల్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఉద్యోగాలున్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ITI ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ OCT 4. పూర్తి వివరాల కోసం <>https://apsrtc.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
#ShareIt

News September 21, 2025

తెలుగులో జీవోలు.. ఇలా చూసేయండి!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న GST సవరణలకు సంబంధించిన 11 జీవోలను ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అప్‌లోడ్ చేసింది. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ కార్యకలాపాలను చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. <>https://goir.ap.gov.in/<<>> సైట్‌లోకి వెళ్లి ఆ జీవోలను మీరూ చూడవచ్చు.

News September 21, 2025

90 శాతం సబ్సిడీతో పసుపు విత్తనాలు, పరికరాలు

image

AP: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో పసుపు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు విత్తనాలు, సాగు పరికరాలను 90 శాతం సబ్సిడీపై అందించనుంది. కేవలం 10 శాతం రైతులు చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.93 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

News September 21, 2025

7,267 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS)లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి <>నోటిఫికేషన్<<>> వెలువడింది. ప్రిన్సిపల్, PGT, TGT, వార్డెన్(మేల్, ఫీమేల్), స్టాఫ్ నర్స్(ఫీమేల్), తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమాలో పాసైన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 23. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

News September 21, 2025

గందరగోళంతో టెన్షన్ టెన్షన్

image

H1B వీసా ఫీజు పెంపుపై వైట్‌హౌస్ ముందే క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా మంది భారతీయులు ఆందోళనకు గురయ్యారు. శుభకార్యాలు, ఇతర పనుల కోసం ఇండియాకు వచ్చిన వారు హడావిడిగా అమెరికా వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ టికెట్ ధర రూ.34-37వేల నుంచి రూ.70-80 వేల వరకు పెరిగింది. అయితే ఇప్పటికే ఆ వీసా ఉన్నవారికి ఫీజు వర్తించదని కాసేపటి క్రితం అమెరికా ప్రభుత్వం <<17779352>>క్లారిటీ<<>> ఇవ్వడంతో లక్షల మంది ఊపిరి పీల్చుకున్నారు.