India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించలేదని సీఎం రేవంత్తో సహా పలువురు అల్లుఅర్జున్ను విమర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ బన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను కలిసేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో వెళ్లొద్దని పోలీసులు నోటీసులిచ్చారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. తమ హీరో పట్ల అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదంటున్నారు. దీనిపై మీ COMMENT.

ఐదో టెస్టు చివరి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయకపోవడంతో బుమ్రా ఆరోగ్యంపై ఫ్యాన్స్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని, వాళ్లే త్వరలో హెల్త్ అప్డేట్ ఇస్తారని చెప్పారు. చివరి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, బౌలింగ్ చేయలేదు. జస్ప్రీత్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ నిన్న మీడియాతో అన్నారు. కాగా ఈ సిరీస్లో బుమ్రా 32 వికెట్లు తీశాడు.

TG: రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రూ.12వేలకే పరిమితం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఆయనొక రైతు ద్రోహి అని, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అని మండిపడ్డారు. ‘రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడ్డెక్కి తెడ్డు చూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం.. వరంగల్ డిక్లరేషన్ అబద్ధం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఓ బూటకం’ అని Xలో దుయ్యబట్టారు.

రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ఈమె వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పనిచేసిన విషయం తెలిసిందే.

Jan 13 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు 13 వేల రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కర కాలానికోసారి జరిగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చేవారి సౌలభ్యం కోసం 10K జనరల్ రైళ్లతో పాటు 3K ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కుంభమేళా ప్రారంభానికి ముందు NDRF బృందాలు మాక్డ్రిల్ నిర్వహించాయి.

ఆశించిన మేర రాణించకపోవడంతోనే BGT కోల్పోయామని కోచ్ గంభీర్ అన్నారు. మెరుగైన ప్రదర్శనకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వర్కౌట్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సిరీస్లో చాలా పాజిటివ్ అంశాలున్నాయన్నారు. AUSపై తొలి పర్యటనలోనే నితీశ్, ఆకాశ్, జైస్వాల్, ప్రసిద్ధ్ రాణించారని చెప్పారు. సిరాజ్ మంచి ప్రదర్శన చేశారని కొనియాడారు. భారత్ 5నెలల తర్వాత తిరిగి టెస్టులు ఆడనుందని, అప్పటికి అన్నీ సెట్ అవుతాయని చెప్పారు.

TG: జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి రాంగోపాల్పేట పోలీసులు వెళ్లారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్లొద్దని బన్నీ మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులను పాటించాలని స్పష్టం చేశారు. శ్రీతేజ్ పరామర్శకు ఆయన వస్తాడన్న సమాచారంతో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ కిమ్స్కు వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బన్నీనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

AP:పాస్పోర్టుల జారీని మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష తెలిపారు. 2024-25లో 3.23 లక్షల పాస్పోర్టులు అందించామని, 2025-26లో 4 లక్షల పాస్పోర్టులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. VJY, TPTY పాస్పోర్టు సేవా కేంద్రాలు, 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో రోజుకు 1800 అపాయింట్మెంట్స్ ఇస్తున్నామన్నారు.

BGT సిరీస్ కోల్పోవడంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి టెస్టులో ఘోర ఓటమితో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్ ఇంటిముఖం పట్టింది. మొదటి టెస్ట్ గెలుపుతో మరోసారి ఫైనల్ చేరి టెస్ట్ గద సొంతం చేసుకుంటుదని భావించారంతా. ఆ తర్వాత టాప్ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, బుమ్రా మినహా బౌలర్లు రాణించకపోవడంతో భారత్ సిరీస్ కోల్పోయింది. అటు, WTC ఫైనల్ చేరిన ఆసీస్ లార్డ్స్లో సౌతాఫ్రికాతో జూన్ 11న తలపడనుంది.

ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ హతం కాగా, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. శనివారం సాయంత్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో కాల్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో నాలుగు నక్సల్స్ మృతదేహాలను గుర్తించిన పోలీసులు AK-47తో సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Sorry, no posts matched your criteria.