News April 4, 2024

బీర్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని బీర్ల తయారీ కంపెనీలు నీటి ఎద్దడితో ఇబ్బందిపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బీర్ల తయారీకి నీటి కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. నగరంలోని బీర్ల తయారీ కంపెనీలకు రోజుకు 44 లక్షల లీటర్ల నీరు అవసరం. 1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేక బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

News April 4, 2024

అనపర్తి టికెట్ టీడీపీకి దక్కనుందా?

image

AP: పొత్తులో భాగంగా BJPకి కేటాయించిన అనపర్తి టికెట్ TDPకే దక్కనున్నట్లు సమాచారం. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి TDP రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇరు పార్టీలు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీటును BJPకి కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు సభలో చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నల్లమిల్లి కూడా రెండు రోజుల్లో కార్యకర్తల ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పడం గమనార్హం.

News April 4, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం

image

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం చంబాలో ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2024

ఫుట్‌బాలర్ దారుణ హత్య

image

దక్షిణాఫ్రికా ఫుట్‌బాలర్ ల్యూకె ఫ్లెయర్స్ (24) దారుణ హత్యకు గురయ్యారు. జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద దుండగులు కాల్పులు జరపడంతో ల్యూకె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫ్లెయ‌ర్స్ హ‌త్య‌పై పోలీసులు మ‌ర్డ‌ర్, కారు హైజాకింగ్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఫ్లెయర్స్ టోక్యో ఒలింపిక్స్‌లో అండ‌ర్-23 జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించారు.

News April 4, 2024

అకౌంట్లో రూ.18,750 పడ్డాయా?

image

AP: వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 అందిస్తోంది. నెల రోజుల క్రితం అంటే మార్చి 7న సీఎం జగన్ బటన్ నొక్కి 4వ విడత నిధులను విడుదల చేశారు. కొందరికి డబ్బులు రాగా, ఇంకా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వల్లే జాప్యం జరుగుతోందని కొందరు, నోటిఫికేషన్‌కు ముందే బటన్ నొక్కారని మరికొందరు గుర్తుచేస్తున్నారు.

News April 4, 2024

1962లోనే 38వేల చ.కి.మీ భూమిని కోల్పోయాం: జైశంకర్

image

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందని ఇండియా కూటమి చేస్తోన్న విమర్శలను విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. 1962లోనే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయామని చెప్పారు. 2000 తర్వాత ఆక్రమణ జరిగిందని ఆరోపించడం సరి కాదన్నారు. పాక్, చైనాను మినహాయిస్తే మిగతా పొరుగుదేశాలతో భారత సంబంధాలు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయని తెలిపారు. POK ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.

News April 4, 2024

రేపు కేసీఆర్ కీలక ప్రకటన

image

TG: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు కీలక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ ‘పొలం బాట’లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మగ్దూంపూర్, బోయినపల్లి గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అలాగే మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడనున్నారు. అందులోనే కీలక ప్రకటన చేస్తారని BRS శ్రేణులు చెబుతున్నాయి.

News April 4, 2024

ఇండిపెండెంట్లు వద్దు.. పార్టీల అభ్యర్థులే ముద్దు!

image

లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించట్లేదు. హామీలు నెరవేర్చడం పార్టీలతోనే సాధ్యమని భావిస్తున్నారు. 1951లో 533 మంది పోటీ చేస్తే 37 మంది(6శాతం), 1957లో 1,519 మంది బరిలో నిలిస్తే 42 మంది(8శాతం) గెలిచారు. 2019లో ఏకంగా 8వేల మంది స్వతంత్రులు పోటీ చేస్తే.. నలుగురు(సుమలత-మండ్య, నవనీత్ రాణా-అమరావతి, నభకుమార్-కోక్రాఝార్‌, మోహన్ భాయ్-దాద్రానగర్‌ హవేలీ) మాత్రమే విజయం సాధించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

మరో 2 రోజులే ఛాన్స్

image

TG: EAPCETకు భారీగా <>దరఖాస్తులు<<>> వస్తున్నాయి. FEB 26న అప్లికేషన్ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటివరకు 3,21,604 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్ కోసం 2,33,517, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో 87,819, మూడు విభాగాలకు 268 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులకు ఇంకా 2 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది మూడు విభాగాలకు కలిపి 3,20,683 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2024

విజయ్ దేవరకొండ బూతుపై అనసూయ స్పందనిదే..

image

‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మాట్లాడిన <<12982348>>బూతు<<>> పదంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఇష్టం వచ్చినట్లు వాగడం, తర్వాత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారని PR మాఫియాతో సింపతీ డ్రామాలు చేయడం, ఇందులో అనసూయను లాగడం’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. ‘ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను చాలాసార్లు చెప్పి వదిలేశా. ఈ ట్వీట్‌నూ వారి స్వార్థానికి వాడుకుంటారు’ అని పేర్కొన్నారు.