News September 20, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 20, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News September 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 20, 2025

శుభ సమయం (20-09-2025) శనివారం

image

✒ తిథి: బహుళ చతుర్దశి రా.11.47 వరకు
✒ నక్షత్రం: మఖ ఉ.9.06 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: సా.5.22-రా.7.01
✒ అమృత ఘడియలు: ఉ.6.40-ఉ.8.16, మ.3.35-మ.5.15

News September 20, 2025

భారత్‌పై పోరాడి ఓడిన ఒమన్

image

ఆసియా కప్: ఒమన్‌పై టీమ్ ఇండియా 21 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది. శాంసన్(56) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫైసల్, జితెన్, కలీమ్‌ తలో 2 వికెట్లు తీశారు. ఒమన్ 20 ఓవర్లలో 167/4 రన్స్ చేసింది. కలీమ్(64), మీర్జా(51), జితేందర్(32) మెప్పించారు. హర్షిత్ రాణా, కుల్దీప్‌, హార్దిక్, అర్షదీప్‌లు తలో వికెట్ తీశారు. అద్భుత ప్రదర్శనతో ఒమన్ హృదయాలు గెలిచింది.

News September 20, 2025

TODAY HEADLINES

image

* ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా: CM CBN
* ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్
* ఈనెల 22 నుంచి OCT 2 వరకు దసరా సెలవులు: మంత్రి లోకేశ్
* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేవరకు పోరాటం ఆగదు: జగన్
* ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది: KTR
* టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
* ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూత

News September 20, 2025

రాష్ట్రంలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

image

TG: రాష్ట్ర ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఆస్పత్రులు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాజనర్సింహ తెలిపారు.

News September 20, 2025

RRB: NTPC CBT1 ఫలితాలు విడుదల

image

NTPC-2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT1) ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. ఎంపికైన వారికి అక్టోబర్ మూడో వారంలో సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT2) నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించనుంది.

News September 20, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్‌‌.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.

News September 19, 2025

వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

image

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.

News September 19, 2025

లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.