News November 11, 2024

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ

image

* GHMC కమిషనర్ -ఇలంబరితి
* టూరిజం, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి -స్మిత
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ -సృజన
* ఇంటర్ బోర్డు కార్యదర్శి -కృష్ణ ఆదిత్య
* BC సంక్షేమ శాఖ కార్యదర్శి -ఇ.శ్రీధర్
* మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి -అనితా రామచంద్రన్
* రవాణా శాఖ కమిషనర్ -సురేంద్ర మోహన్
* ఎక్సైజ్ శాఖ డైరెక్టర్- హరికిరణ్
* ట్రాన్స్ కో CMD-కృష్ణ భాస్కర్

News November 11, 2024

అక్షయ్ ఫ్యాన్స్‌ పేరిట ట్రోలింగ్.. ప్రియాంకా చతుర్వేది కౌంటర్

image

BJPపై శివ‌సేన UBT MP ప్రియాంకా చ‌తుర్వేది ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు సంధించారు. కాంగ్రెస్ ప్ర‌చారంలో BJPపై న‌టుడు రితేశ్ దేశ్‌ముఖ్ చేసిన విమ‌ర్శ‌ల్ని ప్రియాంక స‌మ‌ర్థించారు. దీంతో న‌టుడు అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ పేజీ తనను విమర్శిస్తూ పోస్టులు పెట్టిందని ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులు, హ్యాష్‌ట్యాగులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్న‌ది సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చంటూ BJPని ఆమె ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

News November 11, 2024

వయనాడ్‌‌లో మైకులు బంద్.. 13న ఉపఎన్నిక

image

వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానానికి జ‌రుగుతున్న ఉపఎన్నిక‌లో పార్టీల ప్ర‌చార ప‌ర్వానికి నేటి సాయంత్రంతో తెర‌ప‌డింది. బుధ‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. చివ‌రి రోజు UDF అభ్యర్థి, సోద‌రి ప్రియాంక‌తో క‌లిసి రాహుల్ గాంధీ సుల్తాన్ బ‌తెరిలో ప్రచారం చేశారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రియాంకకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అటు LDF నుంచి స‌త్యం మోకెరి, NDA నుంచి న‌వ్య హ‌రిదాస్ బ‌రిలో ఉన్నారు.

News November 11, 2024

చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ

image

AP: CM చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ.40వేల కోట్లతో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టులు, విశాఖలో TCS ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. భేటీలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.

News November 11, 2024

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

AP: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని పొడిగించారు. మార్చిలో ఫస్ట్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 21వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రూ.1,000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు కట్టొచ్చన్నారు. తొలుత అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గడువు పెంచే ఆస్కారం లేదని అధికారులు స్పష్టం చేశారు.

News November 11, 2024

నాలుగు రోజుల్లో 70% పెరిగిన షేరు ధర

image

JSW Holdings షేరు ధర 4 రోజుల్లో 70% పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది Jan-Aug వరకు ₹5K-₹8K మధ్య కరెక్షన్ అవుతూ కన్సాలిడేటైన షేరు తాజాగా ₹16,978కి చేరుకుంది. దీంతో అధిక Volatilityకి అవకాశం ఉండడంతో BSE, NSE ఈ స్టాక్‌పై నిఘా పెట్టాయి. ట్రేడింగ్ యాక్టివిటీపై ఎక్స్‌ఛేంజ్‌లు వివరణ కోరాయి. మార్కెట్ ఆధారిత ట్రేడింగ్ వాల్యూమ్ కాబట్టి సంస్థ స్పందించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

News November 11, 2024

అమృత్ పథకంలో అక్రమాలపై కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు

image

ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ పథకంలో అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ ఆయన బావమరిది సృజన్‌కు లాభం చేకూరేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేటీఆర్ గతంలోనే ఖట్టర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు.

News November 11, 2024

అత్యంత కాలుష్య నగరాలివే!

image

ఇండియాలో గత నెలలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను CREA విడుదల చేసింది. అందులో ఢిల్లీ రీజియన్‌కు చెందిన నగరాలే టాప్-10లో ఉండటం గమనార్హం. తొలిస్థానంలో ఢిల్లీ ఉండగా తర్వాతి స్థానాల్లో ఘజియాబాద్, ముజఫర్‌నగర్, హాపూర్, నోయిడా, మీరట్, చర్ఖీ దాదరీ, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, బహదుర్గఢ్ ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

News November 11, 2024

స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేశాం.. దేనికీ భ‌య‌ప‌డం: ఖ‌ర్గే

image

స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశామ‌ని, అలాంటిది ED, CBI దాడుల‌కు భ‌య‌ప‌డ‌బోమ‌ని కాంగ్రెస్‌ అధ్య‌క్షుడు ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. మోదీ ఆదేశానుసారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ‘విడిపోతే తుడిచిపెట్టుకుపోతాం’ అని యోగీ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ నిజ‌మైన యోగీ ఎవ‌రూ ఇలా మాట్లాడ‌ర‌న్నారు. రాజీవ్ హ‌ంత‌కులను సోనియా, ప్రియాంక క్షమించారని, కరుణ అంటే ఇదే అన్నారు.

News November 11, 2024

ఆ భయంతోనే YCPకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: జగన్

image

AP: ప్రశ్నిస్తామన్న భయంతోనే YCPకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని YS జగన్ అన్నారు. YCP ఎమ్మెల్సీలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయాలని వారికి సూచించారు. ‘అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. 40% ఓటు షేర్ సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. అందుకే ప్రతిరోజూ మీడియా ద్వారా పూర్తి వివరాలు, ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని తెలిపారు.