News April 4, 2024

వాటర్ స్కూటర్‌పై హిట్‌మ్యాన్

image

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌ తర్వాత వారం రోజుల గ్యాప్ రావడంతో ఆ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా అతడు వాటర్ స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News April 4, 2024

ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్

image

TG: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేశారు. చాలా రోజులుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్స్ కట్టకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వినియోగించారని అధికారులు తెలిపారు. దీనిపై 2015లోనే కేసు నమోదు చేశామని, 15 రోజుల క్రితం నోటీసులు పంపామని చెప్పారు. కాగా రేపు ఇదే స్టేడియంలో SRH-CSK మ్యాచ్ నేపథ్యంలో పవర్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

News April 4, 2024

టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: టెన్త్ వార్షిక పరీక్షల్లో బయాలజీ పేపర్‌లో రెండు ప్రశ్నలు తప్పులున్నట్లు నిపుణుల కమిటీ తేల్చింది. సెక్షన్-2లో 6వ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి 2 మార్కులు కలపాలని SSC బోర్డు నిర్ణయించింది. అలాగే ఐదో ప్రశ్నను ఇంగ్లిష్‌లో ఒకలా, తెలుగులో ఒకలా ఇవ్వడంతో అందులో దేనికి సమాధానం రాసినా మార్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టెన్త్ ఫలితాలు మే 2 లేదా 3న రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

News April 4, 2024

శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ.. మయాంక్ యాదవ్ నాన్‌వెజ్ మానేశాడు: తల్లి మమత

image

IPLలో అదరగొడుతోన్న మయాంక్ యాదవ్(LSG) ప్రదర్శన చూసి పేరెంట్స్ మురిసిపోతున్నారు. అతను త్వరలోనే IND జట్టుకు ఆడతాడని, మెరుగ్గా రాణిస్తాడని తల్లి మమతా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మయాంక్ డైట్ గురించి చెబుతూ.. ‘గతంలో మాంసం తినేవాడు. శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టాక మానేశాడు. నాన్‌వెజ్ తన బాడీకి సెట్ కావట్లేదన్నాడు. ఇప్పుడు వెజిటేరియన్‌గా మారాడు. రోటి, పప్పు, రైస్, కూరగాయలు తింటున్నాడు’ అని తెలిపారు.

News April 4, 2024

పార్టీ మార్పుపై స్పందించిన BRS MLA

image

TG: పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి, BRS MLA గంగుల కమలాకర్ స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారాన్ని గంగుల కొట్టిపారేశారు. ప్రజల తీర్పు BRSకు అనుకూలంగా ఉంటుందని, కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News April 4, 2024

10లక్షల మందితో సభ.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎం

image

TG: తుక్కుగూడలో ఎల్లుండి జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను CM రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులతో కలిసి వెళ్లిన ఆయన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించే వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. 10 లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరుకానున్న ఈ సభలోనే జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

News April 4, 2024

విద్యార్థినికి ముద్దు.. టీచర్‌కు 5ఏళ్ల జైలు

image

గుజరాత్‌లోని సూరత్‌లో ఓం ప్రకాశ్ యాదవ్ అనే టీచర్ 13ఏళ్ల విద్యార్థినికి ముద్దు పెట్టినందుకు జైలు పాలయ్యాడు. 2018లో బాలికను స్టాఫ్ రూమ్‌లోకి పిలిచి.. తలుపులు మూసి ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాలిక ఫిర్యాదుతో ఆ టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. బడిలో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులతో సమానమని చెప్పిన కోర్టు.. ఆ టీచర్‌కు రూ.9వేల జరిమానాతో పాటు 5ఏళ్ల జైలు శిక్ష విధించింది.

News April 4, 2024

అమేథీ రేసులోకి ‘అల్లుడి’ ఎంట్రీ?

image

రాహుల్ వయనాడ్‌లో పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే అమేథీ సీటుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను పోటీ చేయాలనుకుంటే అమేథీ నుంచే బరిలోకి దిగుతానని.. గాంధీ ఫ్యామిలీని అమేథీ కోరుకుంటోందన్నారు. దీంతో ఆయన బరిలోకి దిగొచ్చనే వార్తలు జోరందుకున్నాయి. కాగా అమేథీని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.
<<-se>>#Elections2024<<>>

News April 4, 2024

కేన్ మామ వచ్చాడు

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు GT ప్లేయర్ మిల్లర్ దూరమవగా విలియమ్సన్‌కు తుది జట్టులో చోటు దక్కింది.
తుది జట్లు
GT: సాహా, గిల్, సుదర్శన్, విలియమ్సన్, విజయ్ శంకర్, ఒమర్జాయ్, తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్, నల్కండే
PBKS: ధవన్, బెయిర్‌స్టో, జితేశ్, ప్రభ్‌సిమ్రాన్, సామ్ కర్రన్, శశాంక్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్ష్‌దీప్

News April 4, 2024

ఐపీఎల్‌లో బ్యాటింగ్ చాలా ఈజీ: జునైద్ ఖాన్

image

ఐపీఎల్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ నోరుపారేసుకున్నారు. ఈ టోర్నీలో బ్యాటింగ్ చేయడం చాలా సులభం అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘ఐపీఎల్‌లో అన్నీ ఫ్లాట్ పిచ్‌లు. వాటిపై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు కేవలం 155 రన్స్ చేసిన సునీల్ నరైన్ ఒక ఐపీఎల్ మ్యాచ్‌లోనే 85 పరుగులు చేశారు’ అంటూ జునైద్ ట్వీట్ చేశారు. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.