India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎంను కలిసిన ఆయన తిరుమలలో చేపట్టనున్న పలు కార్యక్రమాలను వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్లను ఆయన కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. నవంబర్ 6న TTD ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
మారుతీ సుజుకీ నుంచి సరికొత్త డిజైర్ కారు లాంచ్ అయింది. మూడవ తరం సెడాన్ సెగ్మెంట్లో ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో మెరుగైన శైలి, సామర్థ్యం, సేఫ్టీతో Dzire కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 9 రకాల వేరియంట్స్ ఉండగా కొన్నింటికి సన్ రూఫ్ కూడా ఉండనుంది. కాగా, కారులో ఆరు ఎయిర్బ్యాగ్స్తో సేఫ్టీకి, 24.79kmplతో మైలేజ్కి అధిక ప్రాధాన్యత నిచ్చింది. LXI వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 6,79,000లుగా నిర్ణయించారు.
AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రాబోయే 2 రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపు ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అయోధ్య రామ మందిరం సహా పలు ఆలయాలపై దాడి చేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరించాడు. Nov 16-17 తేదీల్లో ఈ దాడులు చేస్తామంటూ వీడియో విడుదల చేశాడు. దీన్ని కెనడాలోని బ్రాంప్టన్లో రికార్డు చేశాడు. హింసాత్మక హిందుత్వ భావజాలం పుట్టిన అయోధ్య పునాదులు కదుపుతామని హెచ్చరించాడు. పన్నూపై గతంలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. US, కెనడా నుంచి భారత్పై అతను విషం చిమ్ముతున్నాడు.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్టిస్ట్ హర్ష గీసిన ఆర్ట్ వైరలవుతోంది. కొరియన్ నటుడు డాన్లీ విలన్ పాత్రలో నటిస్తారని వార్తలొస్తుండటంతో ఆయనతో పాటు పోలీస్ యూనిఫామ్లో ప్రభాస్ చిత్రాన్ని గీశారు. మూవీలో ప్రభాస్ లుక్ ఇలా ఉంటే అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బలగం సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వేణు తన తదుపరి చిత్రాన్ని హీరో నితిన్తో తీయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘దసరా’ సినిమాలోని మాస్ సీన్స్కు డబుల్ ఉంటాయని నిర్మాత చెప్పడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరో హిట్ కొట్టాలని వేణుకు ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.
హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
టాటా గ్రూప్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ ఇండియాలో తన చివరి విమాన సర్వీసును పూర్తి చేసింది. ఈ కంపెనీ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో ఆ బ్రాండ్ ఇవాళ్టితో మన దేశంలో కనుమరుగు అవ్వనుంది. రేపటి నుంచి విస్తారా విమానాలు కూడా ఎయిర్ ఇండియా పేరుతో నడుస్తాయి. ఇక నుంచి తమ వెబ్సైట్ అందుబాటులో ఉండదని, రేపటి నుంచి http://airindia.comలో తాము అందుబాటులో ఉంటామని విస్తారా ట్వీట్ చేసింది.
సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గైనకాలజిస్ట్ డా.ప్రీతి చల్లాకు మూడుముళ్లు వేశారు. వీరిద్దరి ఫొటోను సినీవర్గాలు షేర్ చేస్తూ విషెస్ తెలియజేస్తున్నాయి. కాగా, ఈనెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని, దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ 2018లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
AP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)తో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలోని ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో 21రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నేడు ఆ ఉత్తర్వులు జారీ అయినట్లు లోకేశ్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.