India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘OG’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని అర్థం. మూవీలో విపరీతమైన వైలెన్స్ కారణంగానే A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్ను 2.34 గంటలకు(154ని. 15 సెకన్లు) లాక్ చేశారు. అటు ఏపీలో 25న 1AM షోను క్యాన్సిల్ చేసి 24న రాత్రి 10 గం.ల ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

AP: తిరుమల <<17772428>>పరకామణి<<>> వివాదంపై CBI విచారణ, SC నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని YCP డిమాండ్ చేసింది. CJI గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వైసీపీ MP గురుమూర్తి లేఖలు రాశారు. హుండీ సొమ్ము చోరీ జరిగిందన్న ఆరోపణల వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయన్నారు. సరైన ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే తిరుమలను పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అసహనం వ్యక్తం చేశారు.

నక్సలైట్లపై భద్రతా బలగాలు మరో మేజర్ విక్టరీ సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్(D) అబూఝ్మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను మట్టుబెట్టాయని ట్వీట్ చేశారు. బలగాలు ప్లాన్ ప్రకారం నక్సల్స్ టాప్ లీడర్స్ను అంతమొందిస్తున్నాయని అన్నారు. కాగా చనిపోయిన ఇద్దరిపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉంది.

TG: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. భూసేకరణ, నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

AP: పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకెళ్లాలని Dy.CM పవన్ పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆయన భేటీ అయ్యారు. ‘కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి. మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను భావి తరాలకు అందించే లక్ష్యంతో పని చేయాలి’ అని దిశానిర్దేశం చేశారు.

పాక్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంగా ఉన్నానని ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య ముజ్నా మసూద్ తెలిపింది. నిన్న మ్యాచ్ సందర్భంగా రవూఫ్ ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో <<17788891>>సంజ్ఞలు<<>> చేశాడు. దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ముజ్నా.. ‘గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం’ అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

1. దశరథుణ్ని వరాలు కోరమని కైకేయిని ప్రేరేపించింది ఆమె దాసి అయిన ‘మంధర’.
2. మహాభారతంలో కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక.
3. కృష్ణుడిని చంపడానికి అఘాసురుడు భారీ కొండచిలువ రూపం ధరించాడు.
4. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి కృష్ణా నది తీరాన కొలువై ఉంది.
5. శ్రీరాముడు రావణుడిని సంహరించిన సందర్భంగా దసరా పండుగను జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>

AP: కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఇచ్చిన మాట నిలుపుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘Dy.CM పవన్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాను. ఈనెల 25న MEGA DSC విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించాను. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా DSCని అడ్డుకోవాలని 87 కేసులు వేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం చేశామని వివరించా’ అని ట్వీట్ చేశారు.

నటి అవికా గోర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రియుడు మిలింద్ చంద్వానీని ఈనెల 30న పెళ్లి చేసుకోనున్నట్లు ఓ షోలో ఆమె ప్రకటించారు. 2020 నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం అయింది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు అవిక దగ్గరయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్లో ‘రాజు గారి గది-3’, ‘ఉయ్యాల జంపాల’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తదితర చిత్రాల్లో నటించారు.

చాలామంది కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే వాటిని రీచ్ అవుతారు. మీరు పెట్టుకున్న గోల్స్, చేయాలనుకున్న పనిని పూర్తిచేసేందుకు ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది. ఎందుకంటే ఇంకా వంద రోజుల్లో 2025 ముగియనుంది. ఈ కొంత సమయాన్నైనా సద్వినియోగం చేసుకొని, మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. ఇన్నిరోజులూ వాయిదా వేసిన పనులను పూర్తి చేయండి. ALL THE BEST
Sorry, no posts matched your criteria.