India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను మరింత ప్రోత్సహించేలా UPI వాలెట్ పరిమితిని రూ. 2000 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రతి లావాదేవీకి UPI పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి, UPI 123పే లావాదేవీల లిమిట్ను రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు UPI వాలెట్, ఫీచర్ ఫోన్లు వాడే వారి కోసం యూపీఐ123పే ఉపయోగపడుతుంది.
TG: తాను ఇప్పుడు BRS ఛైర్మన్ను కాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్గా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా గుత్తా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగాల మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. MLAల ఫిరాయింపుల అంశంలో గత ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర సెంచరీ దాటింది. పలు ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలువురు మందుబాబులు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. కేజీ టమాటా కొనే కంటే రూ.99కి ఒక క్వార్టర్ మద్యాన్ని కొనుక్కోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. క్వార్టర్ మద్యాన్ని రూ.99కే విక్రయించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
TG: ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. గోడౌన్లు, మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీలు, మిల్లింగ్ ఛార్జీలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
వాట్సాప్లో ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్’ అనే ఫీచర్ రానుంది. దీనితో చాట్లో వచ్చిన ఇమేజెస్ను గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. ఆ ఫొటో నిజమైనదా? ఎడిట్ చేసిందా? ఎక్కడి నుంచి తీసుకున్నారు? వంటి సమాచారం ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని, ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్ అని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ దశలో ఉందని తెలిపింది.
హరియాణాలో BJP చావుదెబ్బ తింటుందని అనేక థియరీలు ప్రచారమయ్యాయి. 27% జనాభాతో ప్రబలశక్తిగా ఉన్న జాట్లు ఆ పార్టీపై కోపంతో ఉన్నారని యోగేంద్రయాదవ్ వంటి విశ్లేషకులు గట్టిగా చెప్పారు. తీరాచూస్తే ఓడిస్తారనుకున్న జాట్లే BJPకి ఓటేసి గెలిపించడం విశేషం. మొత్తం 90లో 36 నియోజకవర్గాల్లో వారిదే ఆధిపత్యం. అందులో కాంగ్రెస్ 18, BJP 16, ఇతరులు 2 గెలవడం గమనార్హం. 30 SC సెగ్మెంట్లలో కాంగ్రెస్ 16, BJP 13 గెలిచాయి.
విజయవాడలోని కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్య కొణిదెలతో ఆలయానికి చేరుకొని సరస్వతి దేవిగా దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి ఇద్దరికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ అటవీ ప్రాంతంలో కిడ్నాప్నకు గురైన జవాన్ మృతిచెందారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు నిన్న కిడ్నాప్ చేయగా, ఒక జవాన్ చాకచక్యంగా తప్పించుకున్నారు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలించగా, తాజాగా మృతదేహం లభ్యమైంది.
AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.
Sorry, no posts matched your criteria.