India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రభుత్వ ఉత్తర్వులను <<15057376>>తెలుగులోనూ<<>> ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రులు అచ్చెన్న, సత్యప్రసాద్, రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషకు CM సముచిత గౌరవం ఇస్తున్నారని కొనియాడారు. మాతృభాషను గత ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు.

భారత క్రికెటర్ చాహల్, ఆయన భార్య ధనశ్రీ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, తన భార్యతో ఉన్న ఫొటోలను చాహల్ డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. విడాకుల విషయాన్ని వారి సన్నిహితులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. దీనిపై చాహల్, ధనశ్రీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వీరికి 2020లో వివాహమైంది.

ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిలపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూ.2,250 కోట్ల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఆరోగ్యమంత్రి, అధికారులను కలవగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.

తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ సినిమాల్లో ‘ప్రేమలు’ ఒకటి. తన స్నేహితులతో కలిసి ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన మూవీగా నిలిచింది. కేవలం రూ.3కోట్లతో యువ నటీనటులతో నిర్మించిన ఈ సినిమాకు ఏకంగా రూ.136 కోట్లు వచ్చాయి. అంటే ఏకంగా 45 రెట్లు లాభం వచ్చిందన్నమాట. ‘పుష్ప-2’కు రూ.1800 కోట్లు కలెక్షన్లు వచ్చినా దానిని రూ.350 కోట్లతో నిర్మించారు.

AP: వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు విజ్ఞాన్ వర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అగ్రికల్చర్లో డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెడతామని, యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో రైతులకు అందిస్తామన్నారు.

నగరాలు అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతుంటాయి. వాహనాలు పెరగడంతో ఒక్కోసారి ఒక్క కిలోమీటర్ వెళ్లేందుకు పది నిమిషాలు పడుతుంటుంది. అయితే, ఆసియాలోని నగరాల్లో అత్యధికంగా బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తేలింది. 10kms వెళ్లేందుకు ఇక్కడ 28.10 నిమిషాలు పడుతుంది. అదే దూరం వెళ్లేందుకు పుణేలో 27.50ని, మనీలాలో 27.20ని, తైచుంగ్లో 26.50ని, సపోరోలో 26.30నిమిషాలు పడుతుంది.

సిడ్నీ టెస్టులో 2వ ఇన్నింగ్స్ ఆడుతున్న IND 145 రన్స్ లీడ్లో ఉంది. AUSకు 200+ టార్గెట్ నిర్దేశిస్తే భారత్కు గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. 40 ఏళ్లలో సిడ్నీలో 200+ పరుగుల లక్ష్యాన్ని 2 సార్లే ఛేదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 6 వికెట్లు కోల్పోయినా క్రీజులో జడేజా, సుందర్ ఉండటంతో లీడ్ 200 దాటే అవకాశాలున్నాయి. తొలి సెషన్లో వికెట్ పడకుండా కాపాడుకుంటే ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచవచ్చు.

TG: సీఎం రేసులో తాను, కవిత ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఎప్పటికీ కేసీఆరే తమ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వాలా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

TG: రాష్ట్రంలో రూ.2లక్షల రుణమాఫీ సరిగా అమలు చేయట్లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. CM రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లెలోనూ రుణమాఫీ అందరికీ అందలేదన్నారు. రైతులు ప్రమాణపత్రాలు రాయడం ఏంటి? అని ప్రశ్నించారు. KCR ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.లక్ష 7వేల కోట్లు జమ చేసిందన్నారు. రైతుబంధులో రూ.22వేల కోట్లు దారి మళ్లాయని, రైతులను దొంగలుగా చిత్రీకరించేలా అసెంబ్లీలో CM మాట్లాడారని మండిపడ్డారు.

AP: విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటం ఆడుతూనే ఉందని, ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. 8న విశాఖ వస్తున్న PM మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమకు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్లాంట్ భవిష్యత్పై నిర్ణయం ప్రకటించాకే మోదీ విశాఖలో అడుగుపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.