News April 4, 2024

‘రామాయణం’ మూవీ కోసం రూ.11 కోట్లతో సెట్‌

image

‘రామాయణం’ మూవీ అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రాముడిగా న‌టిస్తున్న ర‌ణ్‌బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే షూటింగ్‌లో పాల్గొంటార‌ని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.

News April 4, 2024

BREAKING: వైసీపీకి బిగ్ షాక్

image

ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. మాజీ MLA, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇటీవల కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చీరాల టికెట్ ఆశించారు. కానీ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమంచి 2014లో చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు.

News April 4, 2024

టెస్లాతో చర్చలు జరుపుతున్నాం: శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రంలో టెస్లా తమ ప్లాంటును ఏర్పాటు చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘2023 డిసెంబర్ నుంచి పెట్టుబడులపై దృష్టి సారించాం. పరిశ్రమలకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. దేశంలో టెస్లా పెట్టుబడులు పెట్టనుందనే అంశంపైనా అధ్యయనం చేస్తున్నాం. మా టీమ్ నిరంతరం ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది’ అంటూ టెస్లా ఫౌండర్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు.

News April 4, 2024

వృద్ధులు, పిల్లలు ఆ సమయంలో బయటికి రావొద్దు

image

సూర్యుడి ప్రతాపానికి తెలంగాణలో నిప్పులు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉ.11 గంటల నుంచి మ.3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని.. వృద్ధులు, పిల్లలు బయటికి రావొద్దని నిపుణులు హెచ్చరించారు.

News April 4, 2024

‘రాజాం’ రాజు ఎవరో?

image

AP: విజయనగరం(D) రాజాం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 3 జనరల్ సెగ్మెంట్లు కనుమరుగై 2009లో రాజాం(SC) మనుగడలోకి వచ్చింది 1952లో హోంజరమ్, 1962లో బొద్దమ్, 1955-2004 వరకు వణుకూరు ఉండేవి. ఈ నియోజకవర్గాల్లో 5సార్లు TDP, 4సార్లు INC, 2సార్లు కృషికార్ పార్టీ గెలిచింది. 2009లో INC, 2014, 19లో YCP గెలిచింది. ఈసారి TDP నుంచి కొండ్రు మురళి, YCP నుంచి తాలె రాజేష్ బరిలో దిగుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

RCB అభిమానులు నాకు మద్దతిచ్చారు: మయాంక్

image

తన అద్భుతమైన బౌలింగ్‌తో RCB కీలక బ్యాటర్ల వికెట్లు తీసిన లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘RCBకి భారీగా అభిమానులున్నారు. వారంతా జట్టుకు ఎంతో లాయల్‌గా ఉంటారు. నేను వికెట్లు తీసిన తర్వాత బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వారు నన్ను సపోర్ట్ చేయడం ఎంతో నచ్చింది. అభిమానులందరూ నాకు మద్దతిచ్చారు’ అని చెప్పారు.

News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ ప్రమేయం ఉంది: కిషన్ రెడ్డి

image

TG: BRS హయాంలో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో BJP నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబీకుల ప్రమేయం ఉంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

News April 4, 2024

‘గాలి’ మళ్లీ బీజేపీవైపు వీచింది!

image

ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీ క్యాంప్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల తిరిగి బీజేపీలో చేరి.. తాను స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని విలీనం చేశారు. బళ్లారిలో BJP బలపడటంలో ‘గాలి’ది కీలక పాత్ర. 2022లో BJP నుంచి వైదొలగి KRPP స్థాపించి MLAగా గెలిచారు. గాలి ఎఫెక్ట్ 2023 ఎన్నికల్లో కనిపించడంతో ఈ రీఎంట్రీతో BJPకి బలం చేకూరనుందని టాక్.
<<-se>>#Elections2024<<>>

News April 4, 2024

జూనియర్ ఉద్యోగులకు 35-45% జీతాలు పెరగొచ్చు: పేజ్ గ్రూప్

image

ఈ ఏడాది ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ‘మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్’ నివేదిక వెల్లడించింది. మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్లకు 20-30 శాతం వరకు పెంపు ఉంటుందని చెప్పింది. నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టిసారించాయని తెలిపింది. వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం ఉన్నవారి అవసరం పెరిగిందని పేర్కొంది.

News April 4, 2024

ఫేక్ రేప్ కేసులు పెట్టిన మహిళకు HC షాక్

image

మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ మహిళకు షాక్ ఇచ్చింది. ఆమె తన భర్తతో పాటు మరి కొందరిపై వేర్వేరుగా రేప్ కేసులు పెట్టింది. అయితే ఓ వ్యక్తిని ఆర్థికంగా మోసం చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణలో భాగంగా ఆమె గతంలో పెట్టిన తప్పుడు రేప్ కేసుల విషయాలు బయటికొచ్చాయి. ఇది తెలుసుకున్న కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.