India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల్లో రైల్వే బోర్డు మార్పులు చేసింది. టెన్త్/ITI/నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా పలు పోస్టులు భర్తీ చేస్తారు. ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశంలోని పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఇకపై పేరెంట్స్ అనుమతి తప్పనిసరి కానుంది. ‘డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం పేరెంట్స్ అనుమతిస్తేనే పిల్లల పర్సనల్ డేటాను సంస్థలు స్టోర్ చేయవచ్చు. ఒకవేళ రూల్స్ ఉల్లంఘిస్తే ఆ కంపెనీలకు ₹250కోట్ల వరకూ ఫైన్ ఉంటుంది. దీనిపై FEB18లోగా <

AP: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. మంత్రి నారా లోకేశ్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.48లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. దాదాపు 400కాలేజీలను సమీపంలోని స్కూళ్లకు, మిగతా వాటిని సెంట్రలైజ్డ్ కిచెన్లకు అటాచ్ చేయగా అక్కడ భోజనం తయారు చేసి కాలేజీలకు పంపనున్నారు.

జట్టు నుంచి తప్పుకుంటే రిటైర్మెంట్ తీసుకున్నట్లు కాదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఓ మ్యాచ్కు దూరమైతే తిరిగి కమ్బ్యాక్ ఇవ్వలేనని అర్థం కాదు కదా అన్నారు. ఎవరో ల్యాప్టాప్ ముందో, పెన్ పట్టుకొని కూర్చొని తన రిటైర్మెంట్, కెప్టెన్సీ గురించి నిర్ణయించలేరని తెలిపారు. తాను సెన్సిబుల్ వ్యక్తినని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తనకు జీవితంలో ఎప్పుడు ఏం కావాలో నిర్ణయించుకునే తెలివి ఉందని చెప్పారు.

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అటు బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టులో వాదించారు.

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టు రెండో రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా కీలక వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికి 101/5 స్కోర్ చేసింది. వెబ్స్టర్ (28), క్యారీ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం AUS తొలి ఇన్నింగ్స్లో 84 రన్స్ వెనుకబడి ఉంది. కొన్స్టాస్ 23, ఖవాజా 2, లబుషేన్ 2, స్మిత్ 33, హెడ్ 4 రన్స్ చేశారు.

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

చాలామందికి పావురాల్ని మేపడం ఓ హాబీగా ఉంటుంది. వారు వేసే మేత కోసం రోడ్డుపై, కరెంటు తీగలపై వందలాదిగా పావురాలు చేరుతుంటాయి. కానీ వాటి వల్ల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉండే క్రిప్టోకోకస్ అనే ఫంగస్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ వంటి వ్యాధులు వస్తాయని.. పలు రోగకారకాలకూ పావురాలు వాహకాలని పేర్కొంటున్నారు.

AP: కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న వారి ఖాతాల్లో రూ.20,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. నిన్న ONGC పైపులైన్ వల్ల నష్టపోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల మత్స్యకారులకు ఆ సంస్థ విడుదల చేసిన నష్టపరిహారాన్ని 23,450 మందికి రూ.63,200 చొప్పున పంపిణీ చేశారు.

TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే
Sorry, no posts matched your criteria.