News April 4, 2024

అ-అప్పులు.. ఆ-ఆవారా ఖర్చులు: లోకేశ్

image

AP: ఎన్నికల ముంగిట సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘అ.. అంటే అప్పులు. ఆ.. అంటే ఆవారా ఖర్చులు. నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోసిన నియంత జగన్ మోహన్ రెడ్డి. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని తాకట్టు పెట్టారు’ అంటూ లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.

News April 4, 2024

‘బీజేపీలోకి ప్రకాశ్ రాజ్’.. స్పందించిన నటుడు

image

బీజేపీపై తరచూ తీవ్ర విమర్శలు గుప్పించే నటుడు ప్రకాశ్ రాజ్ అదే పార్టీలో చేరనున్నట్లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ‘వాళ్లు బాగా ట్రై చేసినట్టు ఉన్నారు. కానీ సిద్ధాంతాల పరంగా నన్ను కొనగలిగే స్తోమత వారికి లేదని గ్రహించి ఉంటారు. దీని గురించి మీరేమంటారు?’ అని పోస్ట్ చేశారు.

News April 4, 2024

AI సిటీకి 200 ఎకరాలు: మంత్రి శ్రీధర్‌బాబు

image

TG: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సైబర్ టవర్స్‌లో టెక్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. ‘త్వరలో AI సిటీ కోసం 200 ఎకరాలు కేటాయిస్తాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఐటీ ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తాం. హైదరాబాద్‌ వేదికగా జులైలో AIపై సదస్సు నిర్వహిస్తాం’ అని తెలిపారు.

News April 4, 2024

స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు ఫిర్యాదు

image

TG: సైబరాబాద్ మాజీ సీపీ, హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్‌కు కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర తనను సస్పెండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల ప్రమోషన్ పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.

News April 4, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై మొదలైన వాదనలు

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలైంది. ఆమె తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు.

News April 4, 2024

ఉద్యోగాల భర్తీపై గుడ్‌న్యూస్!

image

TG: జాబ్ నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు TSPSC చర్యలు తీసుకుంటోంది. జిల్లా స్థాయి ఉద్యోగాలను 1:3 నిష్పత్తిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-4 ఉద్యోగాలకూ ఇదే ఫార్ములాను అనుసరించనుందట. ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తోందట. జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టులను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారని సమాచారం.

News April 4, 2024

‘నేను విస్కీకి అభిమానిని’.. అడ్వకేట్, CJI మధ్య సరదా సంభాషణ

image

ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కేసు విచారణ సందర్భంగా CJI చంద్రచూడ్, సీనియర్ అడ్వకేట్ దినేశ్ ద్వివేది మధ్య సరదా సంభాషణ జరిగింది. తన జుట్టుకు రంగులు ఉన్నందుకు క్షమించమని దినేశ్ CJIని కోరారు. హోలీ పండగ, ఇంట్లో మనమళ్లు ఉండటంతో తప్పలేదన్నారు. ఆల్కహాల్‌తో సంబంధం లేదా? అని CJI అడగగా ‘ఉంది.. హోలీ అంటే సగం ఆల్కహాలే. నేను విస్కీకి అభిమానిని’ అని దినేశ్ బదులు ఇవ్వడంతో కోర్టు రూమ్‌లో నవ్వులుపూశాయి.

News April 4, 2024

మా జట్టు ఆట చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్

image

నిన్న KKRతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా జట్టు తొలి అర్ధభాగం ఆట చూసి సిగ్గుపడ్డాను. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి 2 గంటల టైమ్ పట్టింది. 2 ఓవర్లు వెనుకబడటంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మేం చాలా పొరపాట్లు చేశాం. ఇవి ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.

News April 4, 2024

ఎల్లుండి ఛలో తుక్కుగూడ: సీఎం రేవంత్

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈనెల 6న తుక్కుగూడలో ‘తెలంగాణ జన జాతర’ పేరుతో సభ నిర్వహించనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సీఎం రేవంత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘తెలంగాణ గడ్డపై ప్రకటించే మేనిఫెస్టో.. భారతావని దశ-దిశ మార్చుతుందని చాటే సభ ఇది. ఛలో తుక్కుగూడ’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

News April 4, 2024

వడగాలుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు అలర్ట్

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.