India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈ ఏడాది జూన్ 15లోగా తల్లికి వందనం స్కీమ్ను అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఏటా రూ.15,000 చొప్పున అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

AP: నటి, బీజేపీ నేత మాధవీలతపై <<15051797>>అసభ్యకర వ్యాఖ్యలు<<>> చేసిన టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే సంప్రదాయం కూడా లేదా అని ఫైరయ్యారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారనడం తగదన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ కూర్చునే వాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

AP: ఈనెల 8తో రెవెన్యూ సదస్సులు ముగుస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఉత్తరాంధ్రలో మాత్రం సంక్రాంతి తర్వాత కూడా 5 రోజులపాటు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ‘సదస్సుల్లోనే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం 4 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్లో పెట్టింది. ఇందులో 25 వేల ఎకరాలే రిజిస్ట్రేషన్ చేసింది. దీనిలో 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై FIR నమోదుకు CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి CBI దర్యాప్తును AP హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా HC తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్కు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పేర్కొంది.

తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సింగర్ చిన్మయి తాజాగా ఓ నెటిజన్పై మండిపడ్డారు. 31st రోజు తమ యాప్ ద్వారా లక్షకు పైగా కండోమ్స్ సేల్ చేసినట్లు బ్లింకిట్ ట్వీట్ చేసింది. దీనిపై సదరు నెటిజన్ ‘వర్జిన్ అమ్మాయిలు భార్యలుగా దొరకడం కష్టమే’ అని కామెంట్ చేశాడు. దీంతో ‘మగాళ్లు పెళ్లికి ముందు అమ్మాయిలతో సెక్స్ చేయడం ఆపండి. మీ అన్నదమ్ములు, ఫ్రెండ్స్కి ఆ పని చేయొద్దని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చారు.

AP: ఇప్పటి వరకు ప్రభుత్వం-ట్రస్టు విధానంలో అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను బీమాలోకి మార్చుతున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 1.43 కోట్ల కుటుంబాలకు వర్తింపజేస్తామని తెలిపారు. ప్రతి ఫ్యామిలీకి రూ.2,500 వరకు ప్రీమియం ఉంటుందని, 3,257 రోగాలకు వర్తింపజేస్తామని పేర్కొన్నారు. రోగులకు ఇబ్బందిలేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు వేగంగా బిల్లులు చెల్లిస్తాయని చెప్పారు.

TG: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అలా చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప, పరిష్కారం కాదని హితవు పలికారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. వారి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

చైనాలో విజృంభిస్తున్న HMPV.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ మాదిరిగానే న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది సోకితే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్, న్యుమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి వాటికి దారితీసి రెస్పిరేటరీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. వైరస్ తీవ్రత 3 నుంచి 6 రోజులు ఉంటుంది. అయితే దీని వ్యాప్తి మనదేశంలో ప్రస్తుతానికి లేదు.

TG: ఇకపై ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విలేజ్ల నుంచి మండల కేంద్రానికి రోడ్లు వేయాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రహదారులు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలన్నారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డు(RRR), నాగ్పూర్-విజయవాడ కారిడార్కు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడల హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈమేరకు స్పోర్ట్స్ వర్సిటీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో యువత సత్తా చాటాలనేదే తమ లక్ష్యమని తెలిపారు.
Sorry, no posts matched your criteria.