India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదాద్రిని యాదగిరి గుట్ట అనే ప్రస్తావించాలని CM రేవంత్ ఇటీవల ఆదేశించారు. అయితే యాదగిరి గుట్టను గత CM KCR రూ.వందల కోట్లతో పునర్నిర్మించాక శ్రీవైష్ణవ మఠాధిపతి చిన్నజీయర్ స్వామి సూచనతో యాదాద్రి అని పిలవడం మొదలుపెట్టారు. భద్రాచలం కూడా భద్రాద్రి అని వాడుకలోకి వచ్చింది. అయితే అధికారికంగా యాదాద్రి అనే పేరు మార్పు జరగలేదు. కానీ, రికార్డుల్లో మాత్రం యాదాద్రి అని రాయడం కొనసాగుతూ వచ్చింది.
AP: ఇవాళ ఉదయం 10.30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో శాసనసభకు వెళ్లొద్దని నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశం ఉంది. శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
TG: ఇప్పటికే సరైన ధర లభించడం లేదని దిగులు పడుతున్న పత్తి రైతులపై మరో పిడుగు పడింది. సీసీఐ ధరలతో పాటు తేమ, బరువు విషయంలో విధించిన కఠిన నిబంధనలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని రాష్ట్ర కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం నిర్ణయించింది. దీంతో అన్ని సీసీఐ కేంద్రాలతో పాటు మార్కెట్లలోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.
TG: అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న సినిమాలు తీసే వారికి థియేటర్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారన్నారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.
USలో లీగల్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ నాశనమైందని టాప్ ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి అన్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను వెనక్కి పంపడాన్ని తాను సమర్థిస్తానని తెలిపారు. ‘అక్రమంగా ప్రవేశించి నేరం చేసినవాళ్లు లక్షల్లో ఉన్నప్పటికీ దేశం నుంచి వెళ్లిపోవాల్సిందే. వాళ్లకు ప్రభుత్వ సాయం నిలిపేస్తాం. సొంతంగా వెళ్లిపోవడాన్నీ మీరు చూస్తారు’ అని అన్నారు. ట్రంప్ క్యాబినెట్లో చోటిస్తే పనిచేస్తానని వెల్లడించారు.
BJP ప్రకటనలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. JMM, INC, RJD నేతలను నెగటివ్గా చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారని పేర్కొంది. BJP4Jharkhand సోషల్ మీడియా అకౌంట్లలో వీటిని పోస్ట్ చేశారని తెలిపింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే అని వెల్లడించింది. ఝార్ఖండ్లో ఆదివాసీలకు తాము వ్యతిరేకమని, BJP వాళ్లు అనుకూలమన్నట్టుగా బ్రాండింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఫిర్యాదు వివరాలను జైరామ్ రమేశ్ Xలో షేర్ చేశారు.
TG: అగ్రికల్చర్, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 నుంచి మూడో దశ కౌన్సెలింగ్ జరగనుంది. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పెషల్ కోటా, రెగ్యులర్ కోటాలో 213 ఖాళీలు ఏర్పడినట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. పూర్తి వివరాల కోసం www.pjtau.edu.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్ల భర్తీ ఉంటుందని, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు.
మహారాష్ట్రలో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 16 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండు వారాల పాటు 16 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా గత ఎన్నికల్లో MHలో MIM 35 చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది.
సౌతాఫ్రికాతో రెండో T20లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు కెప్టెన్ సూర్య వెల్లడించారు. 125 స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతమన్నారు. అతను ఈ స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయని, చాలా ఎంటర్టైన్మెంట్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్లో భారత్పై SA 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడినట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంపై ఇరువురూ చర్చించారని తెలిపింది. వీలైనంత త్వరగా వివాదానికి ముగింపు పలకాలని ట్రంప్ సూచించినట్లు పేర్కొంది. అమెరికా-రష్యా సంబంధాల పునరుద్ధరణకు పిలుపునిచ్చినట్లు రాసుకొచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు <<14566201>>జెలెన్స్కీతోనూ<<>> ట్రంప్ చర్చించారు.
Sorry, no posts matched your criteria.