News September 13, 2025

ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి

image

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు చేయడంపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ముందు దీన్ని ఎవరు ప్రారంభించారో చూడండి. అసలు డబ్బు ఎక్కడికెళ్తుందో ఈడీ విచారించింది. టెర్రరిస్టులకు యాప్స్ ఫండింగ్ చేయడంపై మాకేమీ తెలియదు. 100పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే’ ’ అని ఆమె తెలిపారు.

News September 13, 2025

అహంకారం వినాశనానికి కారణం

image

రావణుడు విద్యావంతుడు, గొప్ప పండితుడు, శివ భక్తుడు. ఆయనకు పాలనలోనూ మంచి పరిజ్ఞానం ఉంది. అయితే, అహంకారం, దుర్గుణాలు ఆయన పతనానికి కారణమయ్యాయి. ధర్మం బోధించిన భార్య మండోదరి మాటలను సైతం రావణుడు పెడచెవిన పెట్టాడు. తన అహంకారం కారణంగా సీతను అపహరించి, చివరకు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి, నాశనమయ్యాడు. ఎంత గొప్ప వ్యక్తికైనా దుర్గుణాలు, అహంకారం అపారమైన నష్టాన్ని కలిగిస్తాయని రావణుడి జీవితం తెలియజేస్తోంది.

News September 13, 2025

మీకు ‘చిన్న తిరుపతి’ తెలుసా?

image

AP: ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’. ఇక్కడ స్వామివారు వెంకన్న రూపంలో కొలువై ఉన్నారు. ఇది ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి సంతానానికి, మరొకటి పెళ్లి సంబంధాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు.

News September 13, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

image

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.

News September 13, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.

News September 13, 2025

ఈ నెల 15 నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

image

AP: పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెల 15 నుంచి టీకాలు వేయనున్నారు. వచ్చేనెల 15 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు ఈ టీకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 4 నెలల వయసు పైబడిన పశువులన్నింటికీ ఈ టీకాలు అందిస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు వేస్తారని ఏపీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు తెలిపారు.

News September 13, 2025

ఇంటి ముందు గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలంటే?

image

ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టడానికి అమావాస్య రోజు అత్యంత అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. ఆరోజు సూర్యోదయానికి ముందే గుమ్మడికాయకు పసుపు, కుంకుమ పూసి వేలాడదీయడం ద్వారా నరదిష్టి, కనుదిష్టి తొలగిపోతాయని అంటున్నారు. బుధవారం, శనివారం రోజున కూడా ఇదే పద్ధతిని అనుసరించవచ్చని సూచిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కట్టడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.

News September 13, 2025

పిల్లలు మట్టి తింటున్నారా?

image

పిల్లలు ఎదిగేటప్పుడు చేతికి అందిన వస్తువులన్నీ నోట్లో పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు మట్టి, సుద్ద, బొగ్గులు తింటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో పైకా అంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఐరన్​ లోపం, రక్తలేమి, ఆహారలేమి ఉన్న పిల్లలు ఇలాంటి పదార్థాలు తింటారని వెల్లడిస్తున్నారు. కాబట్టి పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News September 13, 2025

డిగ్రీ అర్హతతో 394 జాబ్స్.. ఒక్క రోజే ఛాన్స్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ(SEP 14). డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు <>www.mha.gov.in<<>> వెబ్‌సైటును సంప్రదించగలరు.
#ShareIt

News September 13, 2025

మేం ఏ జట్టునైనా ఓడిస్తాం: పాక్ కెప్టెన్

image

తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. భారత్‌తో మ్యాచ్ గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌లో ఇంకా బెటర్ అవ్వాలి. ఇటీవల మా ఆటతీరు బాగుంది. ట్రై సిరీస్‌ను కూడా ఈజీగా విన్ అయ్యాం’ అని ఒమన్‌తో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించారు. ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా రేపు భారత్, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే.