India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ను ఫ్రాన్స్ బహిష్కరించింది. ఓ బ్రిటిష్ పౌరురాల్ని పెళ్లాడి నార్మండీలో సెటిలై చాలాకాలంగా పెయింటింగ్స్ వేస్తూ కాలం గడిపిన ఒమర్, గత ఏడాది సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతునిస్తూ కామెంట్స్ పెట్టారు. దీంతో అతడిని దేశం నుంచి బయటికి పంపించిన ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి రాకుండా నిషేధం విధించింది. ఒమర్ ప్రస్తుతం ఖతర్లో ఉన్నట్లు సమాచారం.
AP: ఏపీపీఎస్సీ సభ్యుల ఆఫీస్ల నుంచి వచ్చే అపాయింట్మెంట్ లెటర్లు ఫేక్ అని ఏపీపీఎస్సీ తెలిపింది. అసలు ఏపీపీఎస్సీ మెంబర్లు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వరని స్పష్టం చేసింది. అపాయింట్మెంట్ లెటర్ల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చి మోసపోవద్దని సూచించింది. ప్రతి శాఖలో విధి విధానాలకు లోబడే నియామకాలు జరుగుతాయని పేర్కొంది.
హరియాణాలో ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార BJP ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ని దాటి 3వసారి అధికారాన్ని దక్కించుకుంది. కొద్దిసేపటి క్రితమే చివరి స్థానంలో కౌంటింగ్ ముగిసింది. EC లెక్కల ప్రకారం 90 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, INLD 2, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును స్థానిక పార్టీలు, ఇండిపెండెంట్లు చీల్చడంతో బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది.
హరియాణా ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ఏ పార్టీ గెలవలేదు. తాజాగా దాన్ని బీజేపీ సుసాధ్యం చేసింది. ఇంతకుముందు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో కమలం హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా ఆ లిస్టులో హరియాణా చేరింది.
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రధాని మోదీ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై దృష్టి, ఆయనకున్న ప్రజల మద్దతును మరోసారి చాటి చెప్పిందని అన్నారు. హరియాణా, జమ్మూ&కశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు ఇండియా ఏ జట్టుతో టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం. కాగా ఇండియా ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా ఉన్నారు. జట్టు: మయాంక్ అగర్వాల్, ప్రాతమ్ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుశాగ్ర, షామ్స్ ములానీ, తనుష్ కొఠియాన్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అఖీబ్ ఖాన్.
రాత్రిపూట పడుకునే ముందు తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నైట్ పళ్లు తోముకుంటే దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహారకణాలు తొలగిపోతాయి. బ్యాక్టీరియాకు చెక్ పడుతుంది. అయితే డిన్నర్ చేసిన వెంటనే కాకుండా కనీసం అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
హరియాణాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అంచనా వేసిన కేకే సర్వే పూర్తిగా విఫలమైంది. హరియాణాలో 90 ఎమ్మెల్యే సీట్లకు గాను కాంగ్రెస్ 75, బీజేపీ 11 సీట్లు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్లో పేర్కొంది. కానీ వాస్తవ ఫలితాలను చూస్తే బీజేపీ 48, కాంగ్రెస్ 37 చోట్ల గెలిచాయి. కాగా, ఏపీ ఎన్నికల్లో కూటమికి 160 సీట్లు వస్తాయని అంచనా వేసిన కేకే సర్వే అక్షరాలా నిజమైంది.
AP: రూ.23 కోట్ల అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ప్రచారంపై రెవెన్యూ శాఖ స్పందించింది. రూ.23 లక్షలను రూ.23 కోట్లుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎన్టీఆర్ జిల్లాలో వరదల తక్షణ సాయంగా రూ.139.75 కోట్ల అంచనా వేశాం. రూ.89 కోట్లు విడుదల చేసి రూ.79 కోట్ల చెల్లింపులు చేశాం. మరో రూ.10 కోట్ల నిధులు ఇంకా అందుబాటులో ఉన్నాయి. వరద సాయంపై ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్కి ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత డిమాండ్ నెలకొంది. రజినీకాంత్ నుంచి అల్లు అర్జున్ వరకూ స్టార్ హీరోల మూవీల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పుష్ప’కు ఆయన రూ.3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోగా, పుష్ప-2కి ఏకంగా రూ.7.2 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ డిసెంబరు 6న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్కు ఎడిటింగ్ పూర్తి చేసి లాక్ చేసినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
Sorry, no posts matched your criteria.