India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని నందికొండ హిల్ కాలనీ మంచినీటి ట్యాంకులో కోతులు పడి <<12985788>>చనిపోయిన<<>> ఘటనపై కేటీఆర్ స్పందించారు. ‘మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయం ఇది. మంచినీటి ట్యాంకుల శుభ్రత, సాధారణ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే రాజకీయాలే ముఖ్యం. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది’ అని దుయ్యబట్టారు.
ఐపీఎల్-2024 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారట. హార్దిక్ కెప్టెన్సీపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నారని ఓ MI ప్లేయర్ చెప్పినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న మెగా ఆక్షన్లో హిట్మ్యాన్ పాల్గొంటారని తెలిపాయి. 5 ట్రోఫీలు అందించిన రోహిత్ను కాదని పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడం పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలో ‘పెద్ద మనిషి’గా పేరున్న జువాన్ విసెంటే పెరెజ్ మోరా కన్నుమూశారు. వెనిజులాకు చెందిన ఆయన వయసు 114ఏళ్లు. మోరా 112ఏళ్లప్పుడు ప్రపంచంలో బతికి ఉన్న ఓల్డెస్ట్ మ్యాన్గా 2022లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఆయనకు 11మంది సంతానం. 2022నాటికి అతడికి మనుమలు 41, మునిమనుమలు 18, మునిమనుమల పిల్లలు 12 మంది ఉన్నారు. 9ఏళ్ల వయసులోనే తండ్రితో వ్యవసాయం చేయడం ప్రారంభించారని గిన్నిస్ సంస్థ తెలిపింది.
AP: విశాఖ లోక్సభ స్థానంలో పోటీపై కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత రానట్లు తెలుస్తోంది. ఈ సీటును బీజేపీ తీసుకోవాలని, జీవీఎల్ నరసింహారావును అభ్యర్థిగా ప్రకటించాలని కమలం నేతలు ఢిల్లీలో పంచాయితీ పెట్టారు. ఈ మేరకు నిన్న జేపీ నడ్డాకు కూడా లేఖ రాసిన నేతలు.. విశాఖ సీటుపై రాష్ట్ర నాయకత్వం గట్టిగా పట్టుబట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ స్థానంలో టీడీపీ భరత్కు టికెట్ ఇచ్చింది.
TG: యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ DS చౌహాన్ స్పష్టం చేశారు. ‘ధాన్యం విక్రయించిన రైతుల అకౌంట్లో 48గంటల్లోనే డబ్బు జమ చేస్తాం. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులు చేసేందుకు 1967తో పాటు 1800 4250 0333 టోల్ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటాయి’ అని వెల్లడించారు.
TG: సంగారెడ్డి(D) చందాపూర్ పేలుడు <<12982731>>ఘటన<<>>లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పారిశ్రామిక వాడలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంపై కార్మికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన రియాక్టర్ల వాడకం, రెగ్యులర్గా తనిఖీలు చేయకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రెండేళ్లలో 40 ప్రమాదాలు జరగగా, 72 మంది మృతిచెందినట్లు, మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ‘కార్యకర్తలను కూడా పవన్ దగ్గరకు ఆయన భద్రతా సిబ్బంది రానివ్వరు. రోజుకు 3 షిఫ్టుల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్ అంటూ <<12968934>>మాట్లాడటం<<>> హాస్యాస్పదంగా ఉంది. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.
మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమె 2019లో SC కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె SC సర్టిఫికెట్ను చట్టవిరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా.. రాణా ఇటీవలే BJPలో చేరారు. ఈ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీలో ఉన్నారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వేసిన కౌంటర్కు సమాధానం ఇవ్వనున్నారు.
KKRతో మ్యాచ్లో DC స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేయడంతో BCCI మరోసారి జరిమానా విధించింది. CSKతో మ్యాచులోనూ DC ఇదే తప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రూ.12 లక్షలు ఫైన్ వేయగా.. రెండోసారి అదే తప్పు చేసినందుకు పంత్కు రూ.24 లక్షల జరిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా ఢిల్లీ ఆటగాళ్లందరికీ రూ.6 లక్షల జరిమానా పడింది. మరోసారి ఇదే జరిగితే పంత్కి రూ.30 లక్షల ఫైన్తో పాటు ఒక మ్యాచ్ నిషేధిస్తారు.
Sorry, no posts matched your criteria.