India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లను పాటించాలి. రాత్రి భోజనం ఆలస్యంగా చేసి ఆలస్యంగా నిద్ర పోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం అనంతరం ప్రొబయోటిక్ ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ, సోంపు వంటివి తినాలి. అనంతరం పావుగంట వాకింగ్ చేస్తే తిన్నది సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే భోజనం అనంతరం వజ్రాసనం వేయడం మంచిది. దీని వల్ల గ్యాస్ సమస్య ఉండదు. దీంతో బరువు కూడా పెరగకుండా ఉంటారు.

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌటైన భారత్ పలు అవాంఛిత రికార్డులను మూటగట్టుకుంది. 2023 నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో 200లోపు అత్యధిక సార్లు(5) ఆలౌటైన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో WI(3), AFG(3), BAN(3), SA(3) ఉన్నాయి. అలాగే 2024 నుంచి 80 ఓవర్లలోపే ఎక్కువసార్లు(14) ఆలౌటైన రెండో టీమ్గా భారత్ నిలిచింది. ఇంగ్లండ్(18) టాప్లో ఉంది. IND తర్వాత NZ(13), BAN(13), WI(12) ఉన్నాయి.

గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇటీవల జరిగిన వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్లో హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ప్రధాని అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హంపి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి.

BGT ఐదో టెస్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ త్వరలోనే టెస్టులతో పాటు వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యను నియమిస్తారని క్రీడావర్గాలు విశ్లేషిస్తున్నాయి. 3 ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించాలని BCCI భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టులకు బుమ్రా/కోహ్లీ, T20లకు సూర్య, ODIలకు హార్దిక్ ఉండొచ్చు.

ఈ నెల 12న విడుదల కానున్న ‘డాకు మహారాజ్’ సినిమా గురించి నిర్మాత నాగవంశీ క్రేజీ న్యూస్ వెల్లడించారు. సమరసింహారెడ్డి మూవీలో గొడ్డలితో బాలకృష్ణ చేసిన మాస్ సీక్వెన్స్ తరహా మ్యాడ్నెస్ ఈ చిత్రం సెకండాఫ్లో ఉందని తెలిపారు. తన మాటలు గుర్తుపెట్టుకోవాలని, దబిడి దిబిడే అని ఊరికే చెప్పట్లేదని పేర్కొన్నారు.

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు ఇచ్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని, రెండు రోజులకు తెలుగులోనూ జారీ చేయాలని స్పష్టం చేసింది.

ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vi) 5G మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను ఈ మార్చిలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. తన ప్రత్యర్థులైన జియో, ఎయిర్టెల్కు గట్టి పోటీ ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకోనుందని ఎకనామిక్ టైమ్స్ (ET) తెలిపింది. 5G ప్లాన్లను ఎంట్రీ లెవల్స్లో 15% వరకు చౌకగా అందించనున్నట్లు పేర్కొంది. ఇది జరిగితే టెలికం రంగంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్ HMPVపై ఆందోళన చెందవద్దని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం మనదేశంలో అలాంటి వైరస్ జాడ లేదని తెలిపింది. కాగా శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) డ్రాగన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. కొవిడ్-19 సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది.

రైళ్ల ఆలస్యం, సరిపడా రైళ్లు లేకపోవడం, స్టేషన్లలో వసతులలేమిపై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. వందేభారత్ స్లీపర్ రైలు 180 KMPH వేగంతో దూసుకెళ్లిన వీడియోను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేశారు. తాను ప్రయాణిస్తున్న రాజధాని రైలు 4 గంటలు ఆలస్యంగా నడుస్తోందని, కొన్ని 10 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాదర్ స్టేషన్లో పరిస్థితి ఇదంటూ ప్రయాణికులు మంత్రికి చురకలంటిస్తున్నారు.

గరమ్ గరమ్ ఛాయ్ అంటే ఇష్టపడనిదెవరు! చలికాలంలో దేశీనెయ్యి వేసుకొని టీ తాగితే బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులోని మేధ్యరస గుణాలు కెఫిన్తో కలిసి మెదడును చైతన్యవంతం చేస్తాయి. మెమరీ పవర్ను పెంచుతాయి. ఇక యాంటీఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ మూడ్ స్వింగ్స్ నుంచి రిలీఫ్ ఇస్తాయి. స్ట్రెస్, లేజీనెస్, వీక్నెస్ను తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి.
Sorry, no posts matched your criteria.