News October 8, 2024

తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

image

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.

News October 8, 2024

ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!

image

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్‌తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.

News October 8, 2024

శతక్కొట్టిన సల్మాన్.. పాక్ భారీ స్కోర్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ అఘా సల్మాన్ విధ్వంసం సృష్టించారు. 108 బంతుల్లోనే సల్మాన్ (100*) సెంచరీ బాదారు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు అబ్దుల్లా షఫీఖ్ (102), షాన్ మసూద్ (151) కూడా సెంచరీలు చేయడంతో పాక్ 556 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టారు.

News October 8, 2024

కొండా సురేఖపై నాగార్జున పిటిషన్.. విచారణ వాయిదా

image

మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన నాంపల్లి న్యాయస్థానం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10న తదుపరి విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. కాగా, సురేఖ వ్యాఖ్యలతో తన కుటుంబం పరువుకు భంగం కలిగిందని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు.

News October 8, 2024

BREAKING: జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి విజయం

image

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 46 (మ్యాజిక్ ఫిగర్) సీట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసీ లెక్కల ప్రకారం ఎన్సీ 40, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి. ఎన్సీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు బీజేపీకి 27, పీడీపీకి 3 సీట్లు దక్కాయి.

News October 8, 2024

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్

image

వరుస నష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్లు బ్రేక్ ఇచ్చాయి. మంగళవారం సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 25,013 వద్ద స్థిరపడ్డాయి. ప్రారంభ సెషన్ నుంచి బెంచ్ మార్క్ సూచీలు Higher Highsతో కదిలాయి. సెన్సెక్స్‌లోని 19 షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో Trent, Bel, Adani Ent, Adani Ports, M&M టాప్ గెయినర్స్. Sbi Life, Tata Steel, Titan, Bajaj Finsv, Jsw Steel టాప్ లూజర్స్.

News October 8, 2024

ఫిజిక్స్‌లో ఇద్ద‌రికి నోబెల్ ప్రైజ్‌

image

2024 ఏడాదికిగానూ ఫిజిక్స్‌లో ఇద్ద‌రిని నోబెల్ వ‌రించింది. అమెరికాకు చెందిన J. హాప్‌ఫీల్డ్ , బ్రిటిష్-కెనడియన్ జియోఫ్రీ E. హింటన్‌ల‌కు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. AIలో ఉప‌యోగప‌డే కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మెషీన్ లెర్నింగ్‌కు ఆస్కారం క‌ల్పించే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు గుర్తింపుగా వీరిని పురస్కారం వ‌రించింది.

News October 8, 2024

జమ్మూకశ్మీర్‌లో ఆప్ బోణీ

image

జమ్మూ కశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. జమ్మూ రీజియన్‌లోని దొడ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో మాలిక్‌కు 22,944 ఓట్లు రాగా, రాణాకు 18,174 ఓట్లు వచ్చాయి. కాగా మాలిక్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.

News October 8, 2024

జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న PDP

image

JKలో PDP పట్టుకోల్పోతోంది. 2014 ఎన్నిక‌ల్లో ముఫ్తీ మొహ‌మ్మ‌ద్ సార‌థ్యంలో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 4 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. 2014లో ముక్కోణ‌పు పోటీలో హంగ్ ఏర్ప‌డింది. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు BJPతో PDP చేతులుకలపడం ప్రజలకు రుచించినట్టు లేదు. JK ఓట‌ర్లు ఆ పార్టీని తిర‌స్క‌రించారు. పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె కుమార్తె ఇల్తిజా ఓటమిపాలయ్యారు.

News October 8, 2024

మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవు: ఇరాన్

image

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.