News January 3, 2025

మహేశ్ వాయిస్‌తో ‘ముఫాసా’ తెలుగు వెర్షన్ సక్సెస్!

image

‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో అదరగొడుతోంది. హాలీవుడ్‌లో రూ.వేల కోట్ల కలెక్షన్లు రాబడుతోంది. అయితే, అమెరికా బాక్సాఫీస్ వద్ద తెలుగు వెర్షన్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు $31,771, హిందీకి $11,240, తమిళానికి $1,659 కలెక్షన్లు వచ్చాయి. మహేశ్ వాయిస్ ఇవ్వడం వల్ల దీనికి మరింత ఆదరణ లభించిందని సినీవర్గాలు తెలిపాయి.

News January 3, 2025

Stock Market: నష్టాల్లోకి.. పార్టీ అయిపోయింది

image

స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. గ‌రిష్ఠాల వ‌ద్ద ప్రాఫిట్ బుకింగ్ జ‌ర‌గ‌డంతో Sensex 720 పాయింట్లు న‌ష్ట‌పోయి 79,223 వ‌ద్ద, నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఉద‌యం నుంచి మిడ్ సెష‌న్ వ‌ర‌కు 2 సూచీల్లో బేర్స్ ర్యాలీ జ‌రిగింది. Niftyలో 24,000 ప‌రిధిలో, Sensexలో 79,250 వ‌ద్ద స‌పోర్ట్ ల‌భించ‌డంతో సూచీలు కొంత‌మేర కోలుకున్నాయి. IT స్టాక్స్ అత్య‌ధికంగా 1.41% న‌ష్ట‌పోయాయి.

News January 3, 2025

సమాజహితం కోసమే సచ్చిదానందస్వామి పనిచేస్తున్నారు: సీఎం

image

AP: విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. గణపతి సచ్చిదానందస్వామి ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం తెలిపారు. సమాజహితం కోసమే స్వామి పనిచేస్తున్నారని చెప్పారు. తన కష్టాలు తొలగాలని ఆయన పూజలు చేశారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

News January 3, 2025

మహిళలకు ఫ్రీ బస్.. బెంగళూరులో ఏపీ మంత్రులు

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ సబ్ కమిటీ కర్ణాటకలోని బెంగళూరులో పర్యటిస్తోంది. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి అక్కడి బస్సులు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో వారు భేటీ అయ్యారు. అక్కడ అమలవుతున్న ఫ్రీ బస్ జర్నీపై వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News January 3, 2025

తెలుగు డైరెక్టర్ కన్నుమూత

image

డైరెక్టర్, రచయిత అపర్ణ మల్లాది(54) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె USలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె ‘ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత తీసిన ‘పోష్ పోరిస్’ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్టయ్యింది. రెండేళ్ల కిందట ప్రిన్స్, అనీషా, భావన ప్రధాన పాత్రల్లో ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈమె పలు చిత్రాలకు కథలను కూడా అందించారు.

News January 3, 2025

యువరాజ్-ఫ్లింటాఫ్ క్లాష్ రిపీట్!

image

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్సులో కోన్స్టస్- బుమ్రా మధ్య జరిగిన గొడవను 2007 T20 WCలో యువరాజ్- ఫ్లింటాఫ్ గొడవతో నెటిజన్లు పోల్చుతున్నారు. ఆ ఇన్నింగ్స్‌లో ఫ్లింటాఫ్‌పై ఉన్న కోపాన్ని యువరాజ్ బౌలర్ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోపాన్ని ఖవాజాను ఔట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

News January 3, 2025

త్వ‌ర‌లో ట్రంప్‌-పుతిన్ స‌మావేశం.. అది కూడా భార‌త్‌లో

image

ఉక్రెయిన్‌తో సంక్షోభ నివారణకు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ఆసక్తిగా ఉన్న రష్యా సరైన వేదిక కోసం వెతుకుతోంది. యుద్ధానికి స్వస్తిపలికేలా కృషి చేస్తాన‌ని ట్రంప్ ఇటీవ‌ల ఉద్ఘాటించారు. ట్రంప్‌తో చర్చలకు తామూ సిద్ధమేనని పుతిన్ తెలిపారు. దీంతో మిత్ర‌దేశం భార‌త్ త‌మ స‌మావేశానికి అనువైన‌ వేదికగా ర‌ష్యా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే త్వ‌ర‌లో ట్రంప్‌-పుతిన్ భార‌త్‌లో స‌మావేశం కావ‌చ్చు!

News January 3, 2025

రైతులు, విద్యార్థులకు రూ.23,112 కోట్లు నష్టం: వైసీపీ

image

AP: సీఎం చంద్రబాబును నమ్మడం, నక్కను నమ్మడం ఒకటేనని మరోసారి నిజమైందని వైసీపీ Xలో విమర్శించింది. ‘ఘరానా దొంగ CBN రైతులను దర్జాగా మోసం చేశారు. రైతు భరోసాకు రిక్త హస్తం చూపారు. దీంతో 54 లక్షల మందికి ఏటా రూ.20వేల చొప్పున అందకపోవడంతో రూ.10,000 కోట్లు నష్టపోయారు. తల్లికి వందనం పథకంలో భాగంగా 87.42 లక్షల మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున అందకపోవడంతో రూ.13,112 కోట్లు నష్టపోయారు’ అని ఆరోపించింది.

News January 3, 2025

13 ఏళ్లకు థియేటర్లలోకి విశాల్ మూవీ

image

తమిళ హీరో విశాల్ నటించిన మదగజరాజ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. 2011లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తైనా పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సంక్రాంతికి తమిళంలో బడా చిత్రాలు లేకపోవడంతో ఈ నెల 12న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి హీరోయిన్‌గా నటించారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సంతానం ఇందులో కీలక పాత్ర పోషించారు.

News January 3, 2025

రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటోంది: కేటీఆర్

image

TG: రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్‌లో చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను తీసేస్తామని చెబుతూ రైతు బంధు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు.