News April 4, 2024

IPL: నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

image

ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య కేవలం 3 మ్యాచులు జరిగాయి. వాటిలో GT రెండింట్లో గెలవగా, PBKS ఒక మ్యాచులో నెగ్గింది. ప్రస్తుత సీజన్‌లో GT ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లో 2, పంజాబ్ 3 మ్యాచుల్లో ఒక విజయం సాధించాయి. నేడు గెలిచేదెవరో కామెంట్ చేయండి.

News April 4, 2024

గురజాల యుద్ధంలో గెలుపెవరిదో?

image

AP: పౌరుషానికి ప్రతీక పల్నాడు(D) గురజాల. గతంలో పల్నాడు యుద్ధం ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 6, TDP 5సార్లు, CPI, YCP ఒక్కోసారి గెలిచాయి. TDP నుంచి Ex MLA యరపతినేని శ్రీనిసరావు(3సార్లు MLA) ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి మాజీ CM కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేశ్ మరోసారి పోటీ చేస్తున్నారు. లోకల్ మేనిఫెస్టోతో ఇద్దరు నేతలు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

ఇవాళ్టి నుంచి జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో ఎండలు నిప్పులకొలిమిలా మారుతున్నాయి. ఈ వేసవిలో తొలిసారిగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భానుడి ప్రతాపం అధికంగా ఉంది. నేటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాల్పులు అధికంగా ఉంటాయని IMD అంచనా వేసింది.

News April 4, 2024

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 35,629 మంది విద్యార్థులు హాజరయినట్లు పేర్కొంది. ఫలితాల కోసం విద్యార్థులు http:apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.

News April 4, 2024

19 నుంచి ఇంద్రకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 22వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణం నిర్వహిస్తారు. 24న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 19న వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవలో ఆది దంపతులు భక్తులకు దర్శనమిస్తారు.

News April 4, 2024

UAEలో రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేయనున్న విజయ్?

image

టాలీవుడ్ రూమర్ ప్రేమజంట విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. రేపు రష్మిక బర్త్ డే కావడంతో విజయ్ UAEలో సెలబ్రేషన్స్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, రష్మిక, విజయ్ ఇద్దరూ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీలలో ఒకే బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఈ రూమర్స్‌కు బలం చేకూరింది. UAEలోని అనంతారా హోటల్‌లో ఉన్నట్లు ఆమె పేర్కొంది. గతంలోనూ వీరు ఒకే లొకేషన్‌కి వెకేషన్‌కు వెళ్లడం గమనార్హం.

News April 4, 2024

నీటి కొరత.. వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ రెట్టింపు

image

TG: HYDలో తాగునీటి కొరత పెరగడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో సమ్మర్ మొత్తం 24గంటలపాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. నల్లాల ద్వారా వచ్చే నీరు సరిపోకపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రోజుకు 9వేల ట్యాంకర్లు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గృహ అవసరాలకు ₹500, కమర్షియల్ అవసరాలకు ₹850గా ధరలను నిర్ణయించారు.

News April 4, 2024

ఇవాళ్టి నుంచి కాల్వలకు తాగునీరు విడుదల

image

AP: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కాల్వలకు ఇవాళ నీరు విడుదల చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలు, గుంటూరు ఛానల్ ద్వారా ఈ నెల 10వ తేదీ వరకు నీరు విడుదల చేయనున్నారు. తాగునీటి కోసమే విడుదల చేస్తున్న ఈ నీటిని చేపలు, రొయ్యల చెరువులు, ఇతర అవసరాల కోసం వాడుకోకూడదని అధికారులు స్పష్టం చేశారు.

News April 4, 2024

డాక్టర్లకు కేంద్రం హెచ్చరిక.. అలా చేస్తే జైలుకే!

image

దేశంలో జులై1 నుంచి నూతన న్యాయ చట్టం అమల్లోకి రానుంది. నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమయ్యే వైద్యులకు 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే ఛాన్సుంది. భారతీయ న్యాయ సంహిత-2023లోని 106 సెక్షన్ ప్రకారం డాక్టర్లకు 5ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. RMP(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు 2ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా వేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. వీటిపై వైద్యులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.

News April 4, 2024

హోరాహోరీగా బొబ్బిలి సమరం

image

AP: చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా బొబ్బిలి. ఈ సెగ్మెంట్‌లో TDP చివరగా 1994లో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లో నెగ్గి బొబ్బిలి గడ్డపై జెండా ఎగరేయాలని టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బొబ్బిలి రాజవంశానికి చెందిన రంగారావు(బేబీనాయన)ని రంగంలోకి దింపింది. ఇటు 2014, 19లో వరుసగా గెలిచిన వైసీపీ అభ్యర్థి శంబంగి చినఅప్పలనాయుడు హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>