India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్థిక, రాజకీయ అస్థిరత నెలకొన్న కెనడాకు మరో తలనొప్పి మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్రమ వలసల భయం పట్టుకుంది. ట్రంప్ తొలి హయాంలో 2017-2021 మధ్య వేలమంది అమెరికా నుంచి కెనడాకు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్పై ఉక్కుపాదం మోపుతానని, అక్రమంగా ఎవరున్నా దేశం నుంచి పంపేస్తానని శపథం చేశారు. దీంతో వారంతా సమీపంలోని కెనడాకే వస్తారన్న అంచనాతో ఆ దేశం హైఅలర్ట్ ప్రకటించింది.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కిష్ట్వార్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరణించారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులు మరణించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.
AP: ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలను YCP బహిష్కరించడం కరెక్ట్ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసమైనా సభకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పలువురు అంటున్నారు. మెజారిటీ సీట్లు ఇచ్చినప్పుడు అధికార పక్షంగా అసెంబ్లీకి వెళ్లిన వారు, ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సభలో విపక్షం ఉండాల్సిందేనని చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని YS జగన్ నిర్ణయించడంతో గతంలో NTR, YSR, CBN కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. NTR 1993లో, 1995లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 1999-2004 మధ్య YSR కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చివరి రెండేళ్లు సమావేశాలకు వెళ్లలేదు. 2014 తర్వాత జగన్, 2021లో చంద్రబాబు CM అయ్యాకే సభకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఫిన్టెక్ సంస్థలు కస్టమర్ల ప్రొఫైల్ను రూపొందించడం కోసం పాన్ సమాచారాన్ని వాడుతుండటంతో ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది. లింక్ చేయని పక్షంలో పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ లీక్ కావడంపై దర్శకుడు తీవ్రంగా స్పందించారు. తన మూవీ టైటిల్ను లీక్ చేసినది తన టీమ్ వారు కాదన్నారు. తన సినిమానే అని కాకుండా ఎవరి మూవీలో ఏ లీక్ జరిగినా సినిమా కోసం కష్టపడే టీమ్పై నిందలు వేయడం మానేయాలన్నారు. యూనిట్ను నిందించే అలవాటు మానుకోవాలన్నారు. ఈ మూవీ టైటిల్ ‘ది ప్యారడైజ్’గా ఖరారైనట్లు గతంలో సినీ వర్గాలు పేర్కొన్నాయి.
భారత బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఇవాళ SAతో మ్యాచులో శతకం బాదితే T20Iల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా నిలవనున్నారు. ఇప్పటివరకు 34 టీ20లు ఆడిన శాంసన్ 701 పరుగులు చేశారు. ఓపెనర్గా అవతారమెత్తాక గేర్ మార్చి పరుగుల వరద పారిస్తున్నారు.
చలికాలం దృష్ట్యా అయోధ్యలోని రామ్ లల్లాను వెచ్చని దుస్తులతో కప్పి ఉంచాలని ఆలయ నిర్వాహకులు భావించారు. ప్రత్యేక శాలువాలు, ఉన్ని దుస్తులతో ఆయనను అలంకరించాలని నిర్ణయించారు. వీటిని ఢిల్లీకి చెందిన ఓ డిజైనర్ రూపొందిస్తున్నారు. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల ఆయనకు నివేదించే ప్రసాదంలోనూ మార్పులు చేస్తున్నారు. బాలరాముడికి డ్రై ఫ్రూట్స్, పూరీ, హల్వాను నివేదిస్తారు.
AP: అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది. ఆర్థిక సాయం పొందేందుకు CRDAకు అధికారం కల్పించింది. బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది. ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని CRDAను ఆదేశించింది.
అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రత్యేక గీతం ‘కిస్సిక్’లో శ్రీలీల కనిపించనున్నట్లు పేర్కొంది. ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
Sorry, no posts matched your criteria.