News April 4, 2024

ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే: BRS MLA

image

AP అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని HYD జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) జోస్యం చెప్పారు. ‘చంద్రబాబు పని అయిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన చాలా తప్పు చేశారు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవీ తర్వాతి కాలంలో మనుగడ సాధించిన దాఖలాలు లేవు. పొత్తు తర్వాత జతగూడిన పార్టీలను మింగేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

News April 4, 2024

నాయుడుపేటలో నేడు జగన్ బహిరంగ సభ

image

AP: CM జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. గురవరాజుపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. చిన్నసింగమలలో ఉ.11గంటలకు లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ సమావేశమవుతారు. మధ్యాహ్నానికి యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నాయుడుపేటలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గూడూరు బైపాస్, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

News April 4, 2024

12న ఇంటర్ ఫలితాలు!

image

AP: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 12వ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. ఆపై వెంటనే పున:పరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇటు పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 8తో పూర్తి కానుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లో పది ఫలితాలను సైతం విడుదల చేసే అవకాశముంది.

News April 4, 2024

నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు

image

జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరగనుండగా, దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డు, ఫొటో ఐడీ ప్రూఫ్ ఉంటేనే అభ్యర్థులను పరీక్షకు అనుమతించనున్నారు.
* ALL THE BEST

News April 4, 2024

గంభీర్ వచ్చే.. నరైన్ దంచే..

image

నిన్న DCపై KKR ఆల్‌రౌండర్ నరైన్ 39బంతుల్లోనే 85రన్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే.. నరైన్‌ను ఓపెనర్‌గా మార్చిన ఘనత KKR మెంటార్ గంభీర్‌దే. 2017లో KKR కెప్టెన్‌ గంభీర్.. నరైన్‌లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గమనించి ఓపెనర్‌ని చేశారు. నరైన్ కూడా అద్భుతమైన ఆరంభాలు ఇచ్చారు. గౌతీ KKRను వీడాక నరైన్ మళ్లీ లోయర్ ఆర్డర్‌కి వెళ్లారు. ఇప్పుడు గంభీర్ రీఎంట్రీతో నరైన్ మళ్లీ ఓపెనర్‌ అవతారం ఎత్తారు.

News April 4, 2024

శివానందరెడ్డి కేసులో పోలీసుల ప్రకటన

image

నంద్యాల పార్లమెంట్ TDP ఇన్‌ఛార్జ్ శివానందరెడ్డి కేసులో తెలంగాణ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ‘బుద్వేల్‌లో అసైన్డ్ భూమి కాజేసేందుకు శివానందరెడ్డి యత్నించారు. భార్య, కుమారుడి పేర్లతో చట్ట విరుద్ధంగా భూములు బదిలీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ఇటీవల ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు నంద్యాల(D) అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తప్పించుకున్నారు.

News April 4, 2024

టీడీపీలో చేరిన మాదిగాని గురునాథం

image

AP: 3 రాజధానులు కావాలంటూ 4 ఏళ్లుగా అమరావతిలో దీక్షలు చేసిన బహుజన పరిరక్షణ సమితిని TDPలో విలీనం చేస్తున్నట్లు అధ్యక్షుడు మాదిగాని గురునాథం తెలిపారు. నిన్న TDPలో చేరిన ఆయన.. ‘పరిపాలన వికేంద్రీకరణతో లాభం జరుగుతుందని నమ్మి నాలుగేళ్లు ఉద్యమం చేసి చివరకు మోసపోయాం. వికేంద్రీకరణ అస్తవ్యస్తంగా మారింది. దానిపై ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయాం. TDP కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తాం’ అని గురునాథం వెల్లడించారు.

News April 4, 2024

సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 వరకు సెలవులు ఉంటాయని.. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల్లో కాలేజీలు ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అలాగే షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News April 4, 2024

సింగపూర్‌లో ఫోన్‌పే సేవలు

image

ఇక నుంచి సింగపూర్‌లోనూ తమ వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని ఫోన్‌పే వెల్లడించింది. ఈ మేరకు సింగపూర్‌ టూరిజమ్‌ బోర్డుతో ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. తమ యూజర్లు ప్రస్తుత భారతీయ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను తక్షణమే చేసుకోవచ్చని తెలిపింది.

News April 4, 2024

నేటి నుంచి 7 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభం

image

AP: వేసవి, వడగాలుల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉదయం 7 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వనుంది. మిగతా వారు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలి. అటు నిన్న 26 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెల 6వ తేదీలోగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.