News January 3, 2025

ఈ ఊర్లో ఆడపిల్ల పుడితే ఏం చేస్తారంటే?

image

ఆడపిల్ల పుడితే రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లా పిప్లాంత్రి గ్రామంలోని ప్రజలంతా పండుగ చేసుకుంటారు. ఆడపిల్ల పుట్టగానే 111 మొక్కలు నాటే ఆచారం ఇక్కడ ఉంది. దీంతోపాటు ఆడపిల్ల భవిష్యత్తు కోసం గ్రామస్థులు రూ.21 వేలు, తల్లిదండ్రులు రూ.10వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆర్థికంగా తోడ్పాటునిస్తారు. సమాజంలో ఆడపిల్లలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు 2006లో అప్పటి గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ దీనిని ప్రవేశపెట్టారు.

News January 3, 2025

ఏపీని జగన్ భ్రష్టు పట్టించారు: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రాన్ని వైఎస్ జగన్ భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందన్నారు. కేంద్రం సహకారంతో ఆక్సిజన్ అందినట్లు తెలిపారు. మత్స్యకారులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని హామీలు నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. రాష్ట్ర సంపద ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని చెప్పారు. అయినా మత్స్యకారులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

News January 3, 2025

దున్నపోతుపై పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసులు

image

అత్యాధునిక వాహనాలు, గుర్రాలను వినియోగిస్తూ పోలీసులు గస్తీ కాయడం చూస్తుంటాం. అయితే, బ్రెజిల్‌లో కొందరు మిలిటరీ సైనికులు దున్నపోతులపై సవారీ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తారు. వీటిని తడిసిన బురద నేలలో అనుమానితులను వెంబడించేందుకు, మడ చిత్తడి నేలల గుండా వెళ్లడానికి, నదుల్లో ఈదేందుకు ఉపయోగిస్తారు. వర్షాకాలంలో విస్తారమైన ద్వీపం అంతటా నేరస్థులను వేటాడేందుకు ఏకైక మార్గం ఇవే అని పోలీసులు చెబుతున్నారు.

News January 3, 2025

USను లాఫింగ్ స్టాక్‌గా మార్చిన జోబైడెన్: ట్రంప్

image

US చరిత్రలోనే జోబైడెన్ వరస్ట్ ప్రెసిడెంట్ అని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సరిహద్దులను బలహీనపరిచారని ఆరోపించారు. ఫలితంగా అమెరికా ఒక డిజాస్టర్, లాఫింగ్ స్టాక్‌గా మారిందన్నారు. న్యూఇయర్ వేడుకల్లో టెర్రరిస్టు దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. FBI, CIA, DOJ ఇలాంటివి ఆపకుండా, అన్యాయంగా తనపై దాడికే సమయం వృథా చేశాయని పేర్కొన్నారు. అమెరికాలో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం, ఇతర నేరాలు ఊహించలేనంత పెరిగాయన్నారు.

News January 3, 2025

తెలంగాణ ప్రజలకు ‘KA మోడల్’ ఛార్జీల భయం!

image

TG ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు <<15052988>>కర్ణాటక<<>> మోడల్‌నే అనుసరించింది. ఇప్పుడదే కొంపముంచేలా ఉంది. స్కీములకు డబ్బులేక అక్కడి సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తూ, బస్సు సహా అన్ని ఛార్జీలూ పెంచేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా సహా స్కీములకు FY25లో ₹37,850CR తెచ్చిన రేవంత్ సర్కార్ మార్కెట్ సెక్యూరిటీల రూపంలో మరో ₹37,850CR అప్పుచేయనుంది. 10 ఏళ్లలో ₹2.86L CR అప్పు తీర్చాల్సిన TG GOVT ఇక వాయింపులు మొదలుపెట్టనుందా?

News January 3, 2025

జీన్స్ ఎక్కువగా ధరిస్తున్నారా?

image

ట్రెండీగా ఉండేందుకు ఆడ, మగా తేడా లేకుండా జీన్స్ ధరించేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే ఎక్కువగా జీన్స్ ప్యాంట్లు ధరించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌గా ఉండే జీన్స్‌తో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు వీటిని ధరించకపోవడమే మేలని అంటున్నారు. ఫ్రీగా ఉండే జీన్స్‌ను లేదా కాటన్ జీన్స్‌ను మితంగా వేసుకోవాలని సూచిస్తున్నారు.

News January 3, 2025

హైందవ శంఖారావానికి తరలిరండి: VHP

image

AP: విజయవాడ కేసరపల్లి వద్ద JAN 5న జరిగే హైందవ శంఖారావం సభకు హిందువులు తరలిరావాలని VHP పిలుపునిచ్చింది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో 30 ఎకరాల్లో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు హిందూ ఆలయాలను తమ అధీనంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని VHP నేత గోకరాజు గంగరాజు మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాల కోసం పోరాటం చేస్తామన్నారు.

News January 3, 2025

పాపం మగాళ్లు! స్త్రీ‘శక్తి’కి బలవుతున్నారు!

image

<<15048434>>బస్సు<<>> ఛార్జీలను 15% పెంచుతున్న కర్ణాటక సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాంగ్రెస్ ఇస్తున్న ‘బయ్ వన్ గెట్ వన్’ ఆఫర్ అంటూ BJP సెటైర్లు వేసింది. అభివృద్ధికి కీడుచేసే ఫ్రీ శక్తి స్కీములు ఎందుకంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘పాపం మగాళ్లు! ఫ్రీ పేరుతో భార్యల టికెట్ డబ్బులూ చెల్లిస్తూ బలవుతున్నారు’ అని నెటిజన్లు అంటున్నారు. ఉచితాలకు ఆశపడితే ఏదోవిధంగా జేబుకు చిల్లు తప్పదని కొందరి ఫీలింగ్.

News January 3, 2025

ఫ్రీ స్కీములతో ఎకానమీ ‘శక్తి’హీనం

image

శక్తికి మించి వెల్ఫేర్ స్కీములతో శక్తివిహీనులవ్వడం ఖాయమనేందుకు కర్ణాటక నిదర్శనంగా మారిందని నిపుణులు అంటున్నారు. 5 గ్యారంటీల అమలుకు అష్టకష్టాలు పడుతోంది. తలకు మించి అప్పులు చేస్తోంది. Q4లో ప్రతివారం రూ.4K CR చొప్పున రూ.48K CR అప్పు చేయనుంది. FY25లో లక్షకోట్లు అప్పు చేస్తుందని అంచనా. 5 గ్యారంటీలకే రూ.60K CR ఖర్చు చేస్తున్న ప్రభుత్వం డబ్బులు రాబట్టేందుకు తిరిగి జనాల పైనే ఛార్జీల భారం వేస్తోంది.

News January 3, 2025

తొలి రోజు ముగిసిన ఆట.. బుమ్రాకు వికెట్

image

సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 9 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఖవాజా(2)ను తాత్కాలిక కెప్టెన్ బుమ్రా ఔట్ చేశారు. ఆసీస్ ఇంకా 176 పరుగులు వెనకబడి ఉంది. కాగా తొలి రోజు ఆట 75.2 ఓవర్లే సాధ్యపడింది.