News September 18, 2025

తెలంగాణ విద్యార్థులకు UK స్కాలర్‌షిప్‌

image

UK ప్రభుత్వం అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ను కోఫండింగ్ ప్రాతిపదికన TG విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ అంగీకరించారు. ఆమె HYDలో CM రేవంత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విద్యార్థుల కోసం UK వర్సిటీల్లో అడ్మిషన్లు, ఇతర కార్యక్రమాలను HYD నుంచి ఆపరేట్ చేసేలా చూడాలని CM కోరారు. బ్రిటిష్ కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరగా, లిండీ సానుకూలంగా స్పందించారు.

News September 18, 2025

ఆరోగ్యంగా ఉండటమే పెద్ద అదృష్టం: సమంత

image

ఒక్కసారి అనారోగ్యం వస్తే దాని ముందు ఏ సమస్యా అంత పెద్దగా అనిపించదని నటి సమంత అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే మన దృష్టంతా దానిపైనే ఉంటుంది. ఏ ఇబ్బందులూ మనల్ని బాధించవు. ప్రస్తుతం నేను ఫుడ్, స్లీప్, మెంటల్ హెల్త్‌పై శ్రద్ధ వహిస్తున్నా. అందుకే ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నా’ అని అన్నారు. అలాగే ప్రతి అమ్మాయీ వెయిట్ ట్రైనింగ్‌పై దృష్టి పెట్టాలని సామ్ సూచించారు.

News September 18, 2025

వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.

News September 18, 2025

మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

image

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.

News September 18, 2025

HLL లైఫ్‌కేర్‌లో ఉద్యోగాలు

image

<>HLL<<>> లైఫ్‌కేర్ లిమిటెడ్ 25 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఫార్మసీ, ఎంబీఏ, బీఈ, బీటెక్, పీజీడీఎం‌తో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com/

News September 18, 2025

త్వరలో US టారిఫ్స్‌ ఎత్తివేసే ఛాన్స్: CEA

image

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్‌ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్‌కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

News September 18, 2025

పిల్లలు మొబైల్ / టీవీ చూస్తున్నారా?

image

పిల్లలు అల్లరి చేయగానే ఫోన్, టీవీ చూపించడం అలవాటు చేస్తున్నారా? ఇది మీ కోసమే. తాజా అధ్యయనం ప్రకారం పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా నిద్ర తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, శారీరక శ్రమను ప్రోత్సహిస్తే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

News September 18, 2025

మరికాసేపట్లో నీరజ్ ఫైనల్ ఈవెంట్

image

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్ సా.3.53 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియా తరఫున నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. ఫైనల్ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే జూలియన్ వెబెర్(జర్మనీ) పెటెర్స్(గ్రెనెడా), అర్షద్ నదీమ్(పాక్) నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. వారందరినీ వెనక్కి నెట్టి అతడు బంగారు పతకం సాధించాలని కోరుకుందాం.
ALL THE BEST NEERAJ(హాట్‌స్టార్‌లో లైవ్)

News September 18, 2025

వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

image

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్‌తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.

News September 18, 2025

చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

image

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.