India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 11 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేయాల్సి వస్తే సీఆర్పీసీ 41 నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 27న చెంగిచర్లలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వారిని పరామర్శించేందుకు సంజయ్ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.
విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. KKR విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్లు తేలిపోయారు. పంత్(55), స్టబ్స్(54) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. వైభవ్, వరుణ్ చక్రవర్తి 3, స్టార్క్ రెండు, రసెల్, నరైన్ తలో వికెట్ తీశారు.
ఐపీఎల్ 17వ సీజన్లో ఓ అద్భుత రికార్డు నమోదైంది. ఈ సీజన్లో రెండు సార్లు 250కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఒకే సీజన్లో రెండు సార్లు 250కుపైగా స్కోర్లు ఇప్పటివరకూ నమోదు కాలేదు. ఈసారి ఆ ఫీట్ సాధ్యమైంది. కాగా ఇవాళ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 272/7 పరుగులు చేసింది. ఇటీవల ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 277/3 పరుగులు బాదింది.
TG: సార్వత్రిక ఎన్నికల విధుల నుంచి సీనియర్ ఉద్యోగులకు ఈసీ మినహాయింపు ఇచ్చింది. 6 నెలల్లో రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రెచ్చిపోయారు. వెంకటేశ్ అయ్యర్ వేసిన ఒక ఓవర్లో 28 రన్స్ బాదారు. ఆ ఓవర్లో 4, 6, 6, 4, 4, 4 కొట్టారు. దీంతో పంత్ (55) అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆయన ఔటయ్యారు. పంత్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ విజయానికి 42 బంతుల్లో 144 రన్స్ కావాలి.
MP భోపాల్కు చెందిన ఓ వ్యక్తికి జంతువులాగా తలపై కొమ్ము పెరుగుతోంది. దీంతో ఆయన్ను ‘జంతు మనిషి’ అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాగర్ జిల్లాలోని రహ్లి గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ యాదవ్ తలకు 2014లో గాయమైంది. కొన్ని రోజులకు తలపై వింతగా చర్మం పెరగడాన్ని గమనించి కత్తిరిస్తూ వస్తున్నాడు. మరింత వేగంగా పెరగడంతో వైద్యులను సంప్రదించగా.. ఇది అరుదైన చర్మవ్యాధని, క్యాన్సర్కు సంకేతమని తెలిపారు.
AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విభాగాల పెన్షన్ దారులు సచివాలయాలకు రానవసరం లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్లను కోరింది. ఎండల దృష్ట్యా ఉ.7 గంటల నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించింది.
29 సార్లు- చెన్నై
24 సార్లు- ఆర్సీబీ
23 సార్లు- ముంబై
21 సార్లు- కేకేఆర్
21 సార్లు- పంజాబ్
దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్లతో ఫ్యాన్స్కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.
TG: కార్పొరేట్ కాలేజీలపై కొరడా ఝళిపించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను నియంత్రించేందుకు కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల అనంతరం అసెంబ్లీలో చట్టం తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఫీజుల నియంత్రణకు కసరత్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.