India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ OTTలో అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్లో ఈ సినిమా నంబర్ వన్ ట్రెండింగ్లో నిలిచింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
TG: CM రేవంత్ అన్ని వర్గాలను మోసం చేశారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని ఆయన విమర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 ఏవీ? 40 లక్షల మందికి రుణమాఫీ చేశారనేది బోగస్. రైతుభరోసా అందలేదు. వరిపంటకు బోనస్ ఇవ్వలేదు. రేవంత్ అబద్ధాల ప్రచారం మహారాష్ట్రలో కూడా కొనసాగిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
సౌతాఫ్రికా, భారత్ మధ్య గెబేహా వేదికగా రాత్రి 7.30గం.లకు జరిగే రెండో T20 మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది. టాస్కు సైతం ఇబ్బంది కలిగే అవకాశముంది. వర్షం కారణంగా ఆటను పూర్తిగా కొనసాగించలేని పరిస్థితి ఎదురైతే, 5 ఓవర్లకు కుదించి మ్యాచ్ ఆడిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ను రద్దు చేస్తారు. ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రద్దయితే మిగతా 2 మ్యాచుల్లో ఒకటి గెలిచినా సిరీస్ మనదే అవుతుంది.
రాజకీయ నాయకులే కాదు ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచీ జడ్జిలపై ఒత్తిడి ఉంటుందని CJI చంద్రచూడ్ రిటైర్మెంట్ స్పీచ్లో చెప్పారు. మీడియా, సోషల్ మీడియాతో జడ్జిపై ప్రెజర్ పెట్టి కేసును ఒక దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తారన్నారు. అయితే ఆ ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏవన్న దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. లెఫ్ట్, రైట్ వింగ్స్, ఫారిన్ లాబీయింగ్, సొరోస్ స్పాన్సర్డ్ NGOs అని కొందరి వాదన. మరి మీరేమంటారు?
TG: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.
ప్రతి ఒక్కరూ ఫోన్, ఈమెయిల్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, సోషల్ మీడియా ఖాతాలకు పాస్వర్డ్లు ఉపయోగిస్తుంటారు. కానీ గుర్తుంచుకోవడం సులభమని కొందరు ఈజీ పాస్వర్డ్లు క్రియేట్ చేసుకుంటారు. అవి అత్యంత ప్రమాదకరమని ఓ స్టడీ తెలిపింది. 123456, 123456789, 12345, qwerty, password, 12345678, 111111, 123123, 1234567890, 1234567 పాస్ వర్డ్లు అత్యంత చెత్తవని వెల్లడించింది. ఇలాంటివి వాడకపోవడం మంచిదని పేర్కొంది.
TG: ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను TGPSC విడుదల చేసింది. 17న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30వరకు పేపర్-3 పరీక్ష ఉంటుంది. అర గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 1,388 పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.
వెబ్సైట్: www.tspsc.gov.in/
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బాటేంగే తో కాటేంగే, ఏక్ హై తో సేఫ్ హై నినాదాలు మార్మోగుతున్నాయి. NDA, INDIA వీటిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. బాటేంగే తో కాటేంగేకు విడిపోతే నష్టపోతామని అర్థం. ఏక్ హై తో సేఫ్ హై అంటే ఒక్కటిగా ఉంటే భద్రంగా ఉంటామని అర్థం. కులాల వారీగా విడిపోతే నష్టపోతామని, హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని బీజేపీ అంటోంది. హిందూ ముస్లిములను విడదీస్తే నష్టమన్నది కాంగ్రెస్ వాదన.
తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తున్నట్లు సమాచారం. 300 ఏళ్ల క్రితం అంతఃపుర రాణులకు సేవలు చేసేందుకు తెలుగువారు TN వచ్చారని, ఇప్పుడు వారు కూడా తమిళులమని చెప్పుకుంటున్నారని ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
UK PM కీర్ స్టార్మర్ ఆతిథ్యమిచ్చిన దీపావళి వేడుకల్లో మద్యం, మాంసం వడ్డించడంతో బ్రిటిష్ హిందూస్ షాకయ్యారని తెలిసింది. ‘14 ఏళ్లుగా ప్రధాని నివాసంలో దీపావళి వేడుకలు మద్యం, మాంసం లేకుండానే జరుగుతున్నాయి. ముందే మమ్మల్ని సంప్రదిస్తే బాగుండేది. PM సలహాదారులు మరీ ఇంత నిర్లక్ష్యం, అలసత్వంతో ఉండటం దారుణం’ అని హిందువులు విమర్శిస్తున్నారు. గతేడాది రిషి సునాక్ వేడుకలు నిర్వహించిన తీరును గుర్తుచేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.