India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

వాస్తు శాస్త్రంపై ఏ ఒక్క రుషి రచనను ప్రామాణికంగా తీసుకోవాలన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం వేర్వేరు మార్గాల్లో వెళ్లినా చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినట్లుగా.. ఏ వాస్తు శాస్త్రాన్ని అనుసరించినా దాని లక్ష్యం ఒకటే ఉంటుంది. అందరు మహర్షులు సమాజ హితం కోసమే ఈ రచనలు చేశారు. మీరు ఏ వాస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నా అందులో సూత్రాలు మారవు. బాగా ప్రాచుర్యం పొందిన వాస్తు శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది.

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఓ వ్యక్తి ఆలోచన మాత్రమే కాదు. ఇది అనేకమంది రుషుల జ్ఞానం, అనుభవం నుంచి పుట్టింది. ఇతిహాసాలు, పురాణాలను ఎంతో మంది కవులు, పండితులు తమదైన శైలిలో రచించినట్లే వాస్తు శాస్త్రాన్ని కూడా ఎందరో మహర్షులు సమాజ శ్రేయస్సు కోసం రాశారు. వారి రచనల్లో పదాలు వేరుగా ఉన్నప్పటికీ, పరమార్థం ఒకటే ఉంటుంది. వీళ్లందరూ మానవుల జీవితం సుఖశాంతులతో సాగడానికి సరైన మార్గాన్ని చూపించారు.

TG: ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలని సూచించారు.

AP: వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నర్సీపట్నంలో కాలేజీని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రూ.500 కోట్లతో ఒక్కో కాలేజీ నిర్మాణం చేపట్టామని.. చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. పేదవాడికి వైద్యవిద్య అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తే బాబు వాటిని అమ్మేస్తున్నారని ఫైరయ్యారు.

AP: లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని స్నేహ హౌస్, రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్లో ఉన్న మరో కార్యాలయంలోనూ రైడ్ జరుగుతోంది.

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(<

మనదేశంలో చాలా పోరాటాల తర్వాత 1961లో వరకట్ననిషేధ చట్టం వచ్చింది. ఇందులో సెక్షన్ 2 ప్రకారం పెళ్లిలో విలువైన వస్తువులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకుంటే అది భార్య, వారసుల కోసమే వాడాలి. సెక్షన్ 3 ప్రకారం కట్నం తీసుకున్నట్లు రుజువైతే ఫైన్, జైలుశిక్ష పడుతుంది. సెక్షన్ 4 ప్రకారం కట్నం డిమాండ్ చేయడం నేరం. సెక్షన్ 6 ప్రకారం పెళ్లిలో తీసుకున్న ఆస్తి, డబ్బు 3నెలల్లో అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆ దేశ మీడియా తెలిపింది. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, కాఠ్మండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్మీకి Gen Z సూచించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.