India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రజల ఓటు విలువ వారి ఐదేళ్ల భవిష్యత్ అని సీఎం జగన్ అన్నారు. ‘ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు.. చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షాన ఉన్నా. ఒక్కడి మీద అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు. మీ ఓటు వల్ల మీ తలరాతలు మారతాయి. ఎవరి వల్ల మంచి జరిగిందో తెలుసుకుని ఓటేయండి. ఈ ఎన్నికల్లో వైసీపీకి తోడుగా ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు.
కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఓ సినిమా షూటింగ్ సెట్స్లో దుమ్ము రేగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తన భార్య గీతా శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
TG: హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఫిలిం ఛాంబర్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. స్వరుచి హోటల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తైవాన్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తైవాన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు. కాగా తైవాన్లో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పటివరకు 9 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2024) రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 2తో గడువు ముగియాల్సి ఉండగా, మరో 3 రోజులు పొడిగించినట్లు తెలిపింది. ఈ పరీక్ష జులై 7న రెండు షిఫ్టుల్లో జరగనుంది. 20 భాషల్లో నిర్వహించనున్నారు.
TG: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది.
TG: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో దారుణం జరిగింది. 30 కోతులు నీటి కోసం వెళ్లి మంచినీటి ట్యాంకులో పడి చనిపోయాయి. ఈ సంగతి తెలియని మున్సిపాలిటీ సిబ్బంది ఆ నీటిని ఇళ్లకు సరఫరా చేశారు. 3 రోజుల క్రితం ఆ కోతులు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఆ నీరు తాగిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఐఐటీల్లో చదివితే జాబ్ గ్యారంటీ అని చాలా మంది భావిస్తుంటారు. అయితే IIT బాంబేలో ఈ ఏడాది 36% మందికి జాబ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ప్లేస్మెంట్ దొరకని విద్యార్థుల సంఖ్య 2.8% పెరిగింది. దీంతో IITలో చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇతర ఇన్స్టిట్యూట్స్లో చదివే వారి పరిస్థితేంటని, నిరుద్యోగ రేటు పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో వస్తున్న మూవీ NBK 109. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. ఇక బాలయ్యకు తగ్గట్లుగా ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘వీరమాస్’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ ఈ సినిమా కోసమేనా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.
బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడాన్ని అభినందిస్తున్నట్లు నటుడు నరేశ్ ట్వీట్ చేశారు. ‘రామ మందిరం కల సాకారం కావడానికి అద్వానీ ముఖ్య కారణం. అయితే, మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వకపోవడం బాధిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆయన్ను అవార్డుతో సత్కరించాలని మోదీని అభ్యర్థిస్తున్నా’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.