News January 2, 2025

ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.

News January 2, 2025

సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు కోసం టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని టాక్. ప్రాబబుల్ జట్టు: బుమ్రా, రాహుల్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, ప్రసిద్ధ్, సిరాజ్.

News January 2, 2025

₹550 CRతో కూతురి పెళ్లి! బికారిగా మారిన తండ్రి!

image

కర్మ! అన్ని సరదాలూ తీర్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. అపర కుబేరుల్లో ఒకరైన లక్ష్మీమిత్తల్ బ్రదరే ప్రమోద్. 2013లో కుమార్తె సృష్టి పెళ్లికి రూ.550CR ఖర్చు చేసిన ఆయన ఇప్పుడు దివాలా తీసి బికారిగా మారి జైలుకెళ్లారు. ఆయన గ్యారంటర్‌గా ఉన్న GIKIL కంపెనీ $116mln రుణం తీర్చకపోవడంతో పతనం మొదలైంది. మోసం కేసులో 2019లో బోస్నియాలో అరెస్టయ్యారు. దివాలా తీసి భార్య, బిడ్డల నుంచి నెలవారీ ఖర్చుల కోసం దేహీ అంటున్నారు.

News January 2, 2025

సాగు చట్టాలను దొడ్డిదారిన తెచ్చే ప్రయత్నం: కేజ్రీవాల్

image

గతంలో ర‌ద్దు చేసిన సాగు చ‌ట్టాల‌నే కేంద్రం ‘విధానాల’ పేరుతో దొడ్డిదారిన అమలు చేయ‌డానికి సిద్ధ‌మవుతోంద‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. మూడేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. హామీల సాధ‌న‌కు ఉద్య‌మించిన పంజాబ్ రైతుల‌కు ఏదైనా జ‌రిగితే ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌తో మాట్లాడ‌క‌పోవ‌డానికి బీజేపీకి ఎందుకంత అహంకారం అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

News January 2, 2025

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిశోర్

image

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష‌ల్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు. ప‌ట్నాలోని గాంధీ మైదాన్‌లో దీక్ష‌ ప్రారంభించిన PK మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. పోస్టుల్ని అమ్మ‌కానికి పెట్టిన అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. Dec 13న జ‌రిగిన 70వ BPSC ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ అభ్య‌ర్థులు ఆందోళనకు దిగారు.

News January 2, 2025

2 ఎకరాలతో రూ.931 కోట్లు ఎలా?: రోజా

image

AP: చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవడంపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ‘ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం సుమారు రూ.1,000 కోట్లతో దేశంలో అత్యంత ఆస్తి కలిగిన సీఎంగా చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా 2 ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు రూ.931 కోట్లు ఎలా సంపాదించారు?’ అని ట్వీట్ చేశారు.

News January 2, 2025

OFFICIAL: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 4న ఏపీలోని రాజమండ్రిలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 10న విడుదల కానుంది.

News January 2, 2025

కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు

image

బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి HK పాటిల్ తెలిపారు. రేట్లు పెంచినా ఏపీ, తెలంగాణ, MH కంటే కర్ణాటకలోనే ఛార్జీలు తక్కువగా ఉంటాయన్నారు. కాగా, కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చవుతోంది. తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం రానుంది.

News January 2, 2025

సిడ్నీ టెస్ట్: ఈ ముగ్గురి నుంచే ముప్పు?

image

BGT ఐదో టెస్ట్ జరగనున్న సిడ్నీలో ఆస్ట్రేలియా బ్యాటర్లు స్మిత్, ఖవాజా, లబుషేన్‌కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ స్మిత్ భారత్‌పై 4 ఇన్నింగ్స్‌లలో 400 రన్స్ చేశారు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఖవాజా మొత్తంగా 12 ఇన్నింగ్స్‌ల్లో 832, లబుషేన్ 10 ఇన్నింగ్స్‌ల్లో 734 పరుగులు చేశారు. ఈ ముగ్గురిని త్వరగా ఔట్ చేస్తేనే భారత్ గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు.

News January 2, 2025

JAN 3న రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

image

TG: ఏటా జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సావిత్రిబాయి ఫూలే జయంతిని ‘మహిళా టీచర్స్ డే’గా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఈ దినోత్సవాన్ని జరిపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సావిత్రిబాయి ఫూలే జయంతిని ఇప్పటికే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.