India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారతీయులు హెల్తీ ఫుడ్కు ప్రాధాన్యమివ్వలేదని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అదనపు క్యాలరీలు వస్తాయంటున్నా మందులోకి మంచింగ్గా ఆలూ భుజియానే తీసుకుంటున్నారని చెప్తున్నారు. 31st నైట్ బ్లింకిట్లో 2,34,512 pcs ఆర్డరివ్వడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 100gr ప్యాకెట్తో 600 క్యాలరీలు వస్తాయని, వీటిని తగ్గించుకోవాలంటే 45ని. రన్నింగ్ లేదా 90ని. వేగంగా నడవాల్సి ఉంటుందంటున్నారు.

మహారాష్ట్రలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడని వైద్యులు ప్రకటించడంతో ఇంటికి తీసుకెళ్తుండగా బతికాడు. కొల్హాపూర్కు చెందిన పాండురంగ్ ఉల్పే(65)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. మృతదేహాన్ని అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద చేతి వేళ్లు కదిపాడు. మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు.

చూపు లేకపోయినా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి రక్షించే భుల్లు సాహ్నిని నెటిజన్లు అభినందిస్తున్నారు. బిహార్లోని దుమ్దుమాకు చెందిన భుల్లు సాహ్ని ఎందరికో నిజమైన స్ఫూర్తి అని కొనియాడుతున్నారు. ఆయన గంగ, భాగమతి, కమల, బూధి గండక్ వంటి నదుల్లో మునిగిపోయి సాయం కోసం ఎదురుచూసిన 13 మందిని ప్రాణాలతో బయటకు తీశారు. తన తండ్రి నుంచి ఈత, చేపలు పట్టడాన్ని ఆయన నేర్చుకున్నారు. ఈ రియల్ హీరోకు సెల్యూట్.

NDA ప్రభుత్వం దేశంలో సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో సామాన్యుడి జీవితం అతలాకుతలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. పరోక్ష పన్నులతో సామాన్యుల సేవింగ్స్ తగ్గిపోతున్నాయన్నారు. బంగారం రుణాల్లో 50% పెరుగుదల, బంగారు రుణ NPAలలో 30% వృద్ధి, ప్రజల వస్తు-సేవల కొనుగోలు శక్తి మందగించడం, కార్ల కొనుగోళ్లు పడిపోవడం, కీలక రంగాల్లో సరైన వేతన పెంపు లేకపోవడం ఇందుకు నిదర్శనమని వివరించారు.

TG: CMR <<15046521>>కాలేజీ హాస్టల్<<>> వార్డెన్ ప్రీతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్లో జరుగుతున్న ఘటనలకు ఆమెనే కారణమని ఆరోపణలు రావడంతో అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాత్ రూం పక్కనే వంట సిబ్బంది రూం ఉందని, వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎంఆర్ కాలేజీ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రీతిరెడ్డిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

న్యూఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యూత్ తాగి తూగడమే కాదు దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కాశీ, అయోధ్య, పూరీ, మథుర, తిరుమల, శ్రీశైలం, ఉజ్జయిని, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను DEC 31, JAN 1న లక్షల్లో సందర్శించడాన్ని ఉదహరిస్తున్నారు. AP, TG లోనూ ఆలయాలు కిటకిటలాడటం తెలిసిందే. ఇంగ్లిష్ ఇయర్ను ఇండియనైజ్ చేస్తున్నారని కొందరి మాట!

AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన భేటీలో కొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. వీటిపైనే ఆ రోజు తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

క్విక్ కామర్స్ సంస్థ ‘బ్లింకిట్’ అంబులెన్స్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బుక్ చేసిన 10 నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుందని ఆ సంస్థ సీఈవో అల్బిందర్ ప్రకటించారు. తొలుత గురుగ్రామ్ నగరంలో ఐదు అంబులెన్సులతో ఈ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంబులెన్సులో ఆక్సిజన్ సిలిండర్లు, మానిటర్, పారామెడిక్, సహాయకుడు, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటాయి.

లింగం, కులాల ఆధారంగా వివక్ష కొనసాగుతున్న సమాజంలో జీవిస్తున్నందుకు అందరం సిగ్గుపడాలని మద్రాస్ HC జడ్జి జస్టిస్ వెల్మురుగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలోని అన్నా వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై నిరసనకు అనుమతివ్వాలని PMK పార్టీ కోర్టుకెక్కింది. రాజకీయ పార్టీల నిరసనలు మీడియా దృష్టిని ఆకర్షించడానికే తప్పా సదుద్దేశాలతో కాదని ఘాటుగా స్పందిస్తూ పిటిషన్ను కొట్టేసింది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న BGT తర్వాత రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతారని జాతీయ మీడియా పేర్కొంది. సొంతగడ్డలో న్యూజిలాండ్పై, AUSలో BGT టెస్టులో పేలవ ప్రదర్శనతో శర్మపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో విరాట్ కోహ్లీ తిరిగి సారథ్యం వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. కోహ్లీ టెస్టు కెప్టెన్గా 68 మ్యాచులు ఆడగా భారత్ను 40 మ్యాచుల్లో గెలిపించారు.
Sorry, no posts matched your criteria.