India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రేపు మన్యం, అల్లూరి, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది.
స్పామ్ కాల్స్ను అరికట్టేందుకు Airtel నెట్వర్క్లో <<14250922>>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్<<>>ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 27 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గింది. ఈ పదిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 122 మిలియన్ల స్పామ్ కాల్స్, 2.3M మెసేజ్లను బ్లాక్ చేసినట్లు AIRTEL తెలిపింది. ఈ ఫీచర్ ప్రతీ యూజర్కు అందుబాటులో ఉందని పేర్కొంది.
దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్లోని సింధ్లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. దీని ద్వారా RRB మొత్తం 7951 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబర్ 25-29 వరకు, RPF ఎస్సై ఎగ్జామ్స్ డిసెంబర్ 2-5 వరకు, టెక్నీషియన్ ఎగ్జామ్స్ డిసెంబర్ 16-26 వరకు ఉంటాయని వివరించింది.
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయన వారసత్వాన్ని స్వీకరించడానికి కీలక నేతలు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవడమంటే మరణశాసనాన్ని రాసుకున్నట్టే అనే భావనలో ఉన్నారు. ఈ కారణంతో ఇరాన్ మద్దతుగల ఈ సంస్థ పగ్గాలు చేపట్టడానికి కీలక నేత ఇబ్రహీం అమీన్ నిరాకరించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మొత్తం 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: https://ssc.nic.in/
ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలు వర్క్ఫ్రం హోం విధానాల్లో ‘పని వేళల్ని’ స్పష్టంగా నిర్దేశించలేకపోతున్నాయని CM పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన EY సంస్థ ఉద్యోగిని మృతిపై ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. IT పార్కుల్లో లీజుకు ఉండే కంపెనీలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే ఉద్యోగులు న్యాయపరంగా ఎదుర్కోవచ్చన్నారు. ఉద్యోగుల ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
AP: సీఐడీ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై గుంటూరు నగరంపాలెం పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఏడాది జులై 12న రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీల్ వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం అభియోగ పత్రంలో పేర్కొంది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.