India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాబోయే రోజుల్లో తమిళ సినిమాలు ₹1000 కోట్ల కలెక్షన్ మార్కును చేరుకుంటాయని శివకార్తికేయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెంచకపోవడం, 4 వారాలకే సినిమాలు OTTలోకి వస్తుండటం వల్ల ₹1000Cr కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు కంటెంట్తో మెప్పించిన మూవీలే పాన్ ఇండియా సినిమాలు అవుతాయన్నారు. 4 వారాలకే OTTలోకి రావడంతో థియేటర్లలో లాంగ్ రన్ ఉండట్లేదని పేర్కొన్నారు.

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.35 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

✒ తిథి: బహుళ తదియ సా.6.25 వరకు
✒ నక్షత్రం: రేవతి రా.7.44 వరకు
✒ శుభ సమయములు: ఉ.9.45-ఉ.10.10, సా.4.10-సా.5.10
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: ఉ.8.25-ఉ.9.56
✒ అమృత ఘడియలు: సా.5.28-సా.6.58

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఆసియా కప్-2025 తొలి మ్యాచులో హాంకాంగ్పై అఫ్గానిస్థాన్ 94 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 188/6 స్కోర్ చేసింది. సెదిఖుల్లా అటల్ (73), అజ్మతుల్లా (53) రాణించారు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ 20 ఓవర్లలో 94-9 స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ హయత్ (39) టాప్ స్కోరర్గా నిలిచారు.

* ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన C.P.రాధాకృష్ణన్
* క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి దామోదర
* గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: TG హైకోర్టు
* సీఎంకు, నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి: KTR
* 4 దశల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు: SEC
* ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల
* నేపాల్లో ఆర్మీ పాలన.. ప్రధాని రాజీనామా
* నేపాల్ మంత్రులను తరిమికొట్టిన నిరసనకారులు

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

మన పనులను నిబద్ధతతో చేస్తే గుర్తింపు, అవకాశాలు వాటంతటవే వస్తాయని నిరూపించారు అస్సాంకు చెందిన 27ఏళ్ల సత్యజిత్ బోరా. గ్రామాల్లో జరిగే వాలీబాల్ గేమ్స్ను ఈయన మొబైల్ ద్వారా ప్రసారం చేసేవారు. దీంతో సత్యజిత్ అభిరుచిని గుర్తించిన అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య (FIVB) ప్రపంచ స్థాయి వాలీబాల్ ఈవెంట్ బ్రాడ్ కాస్టింగ్ తీరును దగ్గరుండి చూసేందుకు ఆహ్వానించింది. గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి సత్తా చాటారు.

నేపాల్లో యువత ఆందోళనలతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ X వేదికగా స్పందించారు. ‘నేపాల్లో చోటుచేసుకున్న హింస హృదయవిదారకం. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. శాంతికి మద్దతివ్వాలని నేపాలీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పిలుపునిచ్చారు.

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే సమయానికి నిద్ర లేవాలంటే అలారం తప్పనిసరిగా మారిపోయింది. అయితే అలారం శబ్దంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో రీసెర్చర్ కిమ్ చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. సాధారణంగా మేల్కొనే వారికంటే అలారం వాడే వారిలో BP పెరుగుదల 74% అధికంగా ఉందని, స్ట్రోక్ రిస్క్ ఎక్కువని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.