News January 2, 2025

కళ్లలోంచి తలలోకి బాణసంచా దూసుకెళ్లి మృతి

image

AP: న్యూఇయర్ వేడుకల్లో విశాఖలో విషాదం నెలకొంది. GVMC 87వ వార్డులో నివాసముండే శివ డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఇంటి మేడపై న్యూఇయర్ సంబరాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం క్రాకర్స్ పేల్చుతుండగా గన్‌షాట్ క్రాకర్ సరిగా పేలలేదు. దీంతో దాని దగ్గరికెళ్లి చూడగా ఒక్కసారిగా పేలిన క్రాకర్ కళ్లలోంచి తలలోకి దూసుకెళ్లడంతో శివ చనిపోయాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 2, 2025

రైతు భరోసాకూ దరఖాస్తులా? దారుణం: కవిత

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తోందని MLC కవిత ఆరోపించారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించారని, ఇప్పుడు రైతు భరోసాకు కూడా అప్లికేషన్లు తీసుకోవడం దారుణమని అన్నారు. ‘రైతులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఉంటారా? ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News January 2, 2025

VIRAL: తులం బంగారం రూ.113 మాత్రమే

image

ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే. 1959లో తులం బంగారం ధర 113 రూపాయలే. అంటే ఒక్క గ్రాముకు రూ.10 మాత్రమే. 60 ఏళ్ల క్రితం నాటి ఈ గోల్డ్ షాపు బిల్లును చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 60 ఏళ్లలో బంగారం ధర ఇన్ని రెట్లు పెరిగిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే రూ.78వేలు కావాల్సిందే. అప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కొనేందుకు డబ్బులు ఉండకపోయేవని పెద్దలు చెప్తుండేవారు.

News January 2, 2025

BSFపై మ‌మ‌తా బెనర్జీ తీవ్ర ఆరోప‌ణ‌లు

image

చొర‌బాటుదారులు బెంగాల్‌లోకి ప్ర‌వేశించేలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స‌హ‌క‌రిస్తోంద‌ని CM మ‌మ‌త ఆరోపించారు. BSF పరిధిలోని ఇస్లాంపుర్‌, సితాయ్‌, చోప్రా స‌రిహ‌ద్దుల నుంచి చొర‌బాటుదారుల్ని అనుమ‌తిస్తున్నార‌ని అన్నారు. త‌ద్వారా రాష్ట్రాన్ని అస్థిర‌ప‌రిచి, ఆ నెపాన్ని త‌మ‌పై నెడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఈ విష‌యంలో BSF అక్ర‌మాల‌కు మ‌ద్ద‌తిస్తూ త‌మ‌ను నిందించ‌వ‌ద్ద‌ని రాజకీయ ప్రత్యర్థులకు సూచించారు.

News January 2, 2025

కోటి మందికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్: లోకేశ్

image

AP: కోటి మంది TDP కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో MOU కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. ‘తొలివిడతగా పార్టీ తరఫున రూ.42 కోట్లు చెల్లించాం. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News January 2, 2025

దీప్తి ఎవరో తెలుసా?

image

TG: పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అథ్లెట్ జివాంజి దీప్తికి కేంద్రం <<15045760>>అర్జున అవార్డును<<>> ప్రకటించింది. WGL కల్లెడకు చెందిన దీప్తి చిన్నతనం నుంచే మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బందిపడ్డారు. కోచ్ రమేశ్ ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో ప్రపంచ వేదికల్లో సత్తాచాటారు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్ దీప్తి.

News January 2, 2025

GOOD NEWS: వారికి రూ.20,000

image

AP: మత్స్యకారులకు ఏప్రిల్‌లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.

News January 2, 2025

CMR కాలేజీ ఘటనపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

image

TG: మేడ్చల్ (D) కండ్లకోయలోని CMR కాలేజీ <<15044312>>హాస్టల్ ఘటనపై<<>> మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సీపీకి సూచించింది. అమ్మాయిలు బాత్ రూమ్‌లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సీజ్ చేసిన ఫోన్లలో ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.

News January 2, 2025

పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

image

సింగర్ అర్మాన్ మాలిక్ తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆశ్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలను అర్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాలకు ఆయన పాటలు పాడారు. తెలుగులో బుట్ట బొమ్మ, అనగనగనగా అరవిందట తన పేరు, బ్యూటిఫుల్ లవ్ వంటి సాంగ్స్ ఆలపించారు.

News January 2, 2025

CM, Dy.CM న్యూఇయర్ విషెస్

image

AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం మంత్రులు కూడా వీరిద్దరికి విషెస్ చెప్పారు. కాగా ఇవాళ అమరావతిలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.