News April 3, 2024

కోహ్లీకి కూడా అసాధ్యం: సెహ్వాగ్

image

ఆర్సీబీ 4 మ్యాచుల్లో కేవలం ఒక్క విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఆ జట్టు ప్రదర్శనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ ఈ సీజన్ విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఏడెనిమిది మ్యాచుల్లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం కోహ్లీకి కూడా అసాధ్యమని వ్యాఖ్యానించారు. కాగా ఈ సీజన్‌లో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిన్, మ్యాక్స్‌వెల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.

News April 3, 2024

‘ఇంటింటికీ గ్యారంటీ’ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు కాంగ్రెస్ ‘ఘర్ ఘర్ గ్యారంటీ’ (ఇంటింటికీ గ్యారంటీ) కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. దేశంలోని 8కోట్ల కుటుంబాలకు భారత్ జోడో యాత్ర సమయంలో ప్రకటించిన పాంచ్ న్యాయ్, 25 గ్యారంటీలపై అవగాహన కల్పించనుంది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ పేరుతో ‘పాంచ్ న్యాయ్’ లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

News April 3, 2024

వర్షాలు పడకపోతే తప్పు మాదా?: శ్రీధర్ బాబు

image

TG: వర్షాలు పడకపోతే తమది తప్పా అని మంత్రి శ్రీధర్ బాబు మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘2023 జులై నుంచే సరిపడా వానలు పడలేదు. వాటర్ ట్యాంకర్లకు డబ్బులు తీసుకున్నామని ఎవరైనా చెప్పారా? మిషన్ భగీరథ తప్పుడు పథకం. మీ కంటే ముందే మేము ఊరూరా నీళ్లిచ్చాం. రూ.45వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పుడు నీటి ఇబ్బంది ఎందుకు వచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలి’ అని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

News April 3, 2024

WARNING: బయటకు రాకండి

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాయలసీమ, తెలంగాణలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 3, 2024

అరే ఏంట్రా ఇది.. ఉబర్ ఆటో బుక్ చేస్తే రూ.3 కోట్ల బిల్!

image

ఉబర్ ఆటో బుకింగ్స్‌లో నెలకొన్న సాంకేతిక లోపం వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే నోయిడాలో ఓ వ్యక్తికి రూ.7 కోట్లు, బెంగళూరులో రూ.1 కోటి బిల్ వచ్చిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. తాజాగా పుణేకు చెందిన దీపాంత్ ప్రశాంత్ అనే వ్యక్తి ఆటో రైడ్ పూర్తయిన తర్వాత రూ.3కోట్ల బిల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇది సాంకేతిక లోపమైనప్పటికీ, బిల్లు భారం వారిపై పడుతుందేమోనని డ్రైవర్లు కంగారు పడుతున్నారని ఆయన తెలిపారు.

News April 3, 2024

కేజ్రీవాల్ బరువు తగ్గలేదు: జైలు అధికారులు

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై తిహార్ జైలు అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఏప్రిల్ 1న జైలుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన బరువు 65kgs వద్ద స్థిరంగా ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారని, ఆయన శరీర అవయవాల పనితీరు నార్మల్‌గానే ఉందని చెప్పారు. మరోవైపు ఆయన 4.5kgs తగ్గారని ఆప్ నేతలు చెబుతున్నారు.

News April 3, 2024

‘టిల్లు స్క్వేర్’ సినిమా చూసిన ఎన్టీఆర్!

image

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీక్షించారు. గత రాత్రి నిర్మాత నాగవంశీ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ చూశారు. సినిమాను ఎన్టీఆర్ ఎంజాయ్ చేశారని సమాచారం. స్క్రీనింగ్ తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. కాగా, ఈనెల 8న జరిగే ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్‌కి NTR గెస్ట్‌గా రానున్నారు.

News April 3, 2024

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే వేదికపై 100 టీ20 మ్యాచులు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచారు. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో మ్యాచులో కింగ్ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(వాంఖడే-80 మ్యాచులు), ధోనీ(చెపాక్-69 మ్యాచులు) ఉన్నారు.

News April 3, 2024

లోక్‌సభ పోటీ నుంచి తప్పుకున్న తెలుగు నటి

image

ప్రముఖ నటి సుమలత పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య స్థానం నుంచి పోటీ చేయట్లేదని, తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆమె.. కర్ణాటకలో తొలి స్వతంత్ర మహిళా MPగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హెచ్ డీ కుమార స్వామి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు.

News April 3, 2024

ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? – 1/2

image

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కుటుంబం, స్టార్లకే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. డబుగామ్ అసెంబ్లీ సీటు నుంచి మాజీ MLA భుబ్‌బల్ కుమార్తె లిపికా బరిలో నిలవనున్నారు. ఇక భుజ్‌బల్ నాబరంగపుర్ నుంచి MPగా పోటీ చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి భక్త చరణ్ దాస్, ఆయన కుమారుడు సాగర్.. నార్ల, భవానీపట్న అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
<<-se>>#Elections2024<<>>