India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: నవంబర్ 10, ఆదివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:04 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:05 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు ✒ ఇష: రాత్రి 6.56 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
☛ TGపై మోదీ అబద్ధాల ప్రచారం: CM రేవంత్
☛ వచ్చే ఎన్నికల్లో వందశాతం BRSదే గెలుపు: KCR
☛ TGలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం
☛ విజయవాడ-శ్రీశైలం సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం
☛ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే వదలం: CM CBN
☛ తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: జగన్
☛ మహారాష్ట్రలో మహాయుతి హవా నడుస్తోంది: మోదీ
ఆస్ట్రేలియాలో జరిగే BGT సిరీస్లో తొలి మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నారు. ఆయన గైర్హాజరు కావడాన్ని గవాస్కర్ విమర్శించగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రోహిత్కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఆస్వాదించడం రోహిత్ హక్కని ఫించ్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్పై ఇన్స్టాలో రోహిత్ భార్య రితిక స్పందించారు. ఫించ్ను ట్యాగ్ చేస్తూ సెల్యూట్ ఎమోజీ జత చేశారు.
విశాఖకు చెందిన ఓ రైల్వే మాస్టర్కు ఛత్తీస్గఢ్ మహిళతో 2011లో పెళ్లైంది. ఓ రోజు అతను విధుల్లో ఉండగా భార్యతో ఫోన్లో గొడవైంది. అతను కోపంలో ‘ఓకే’ అనడంతో, సహోద్యోగి పొరబడి గూడ్స్ రైలుకు సిగ్నలిచ్చాడు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి రాత్రి ఆ రైలు వెళ్లడం రూల్స్కు విరుద్ధం కావడంతో రైల్వేకు ₹3cr ఫైన్ పడింది. దీంతో ఆ మాస్టర్ సస్పెండయ్యాడు. భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెళ్లగా తాజాగా మంజూరయ్యాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ట్రంప్ సరికొత్త ప్రణాళికను తెరపైకి తీసుకురానున్నారు. ది టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం.. ఆ రెండు దేశాలకు మధ్య ఐరోపా, బ్రిటిష్ బలగాల రక్షణలో 800 మైళ్ల మేర బఫర్ జోన్ను ఏర్పాటు చేస్తారు. రష్యా డిమాండ్ను గౌరవిస్తూ ఉక్రెయిన్ 20ఏళ్ల పాటు నాటో సభ్యత్వానికి దూరమవ్వాలి. అలా ఉన్నందుకు కీవ్కు అమెరికా భారీగా ఆయుధ సంపత్తిని సమకూరుస్తుంది.
బిహార్లో రైలు ఇంజిన్, బోగీల మధ్య <<14569710>>చిక్కుకొని<<>> ఉద్యోగి చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘మోదీజీ.. మీ పాలనలో సామాన్యులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు? మీరేమో అదానీని రక్షించడంలో బిజీగా ఉన్నారు. ఈ భయానక చిత్రం రైల్వేలో సుదీర్ఘకాలంగా తాండవిస్తున్న నిర్లక్ష్యానికి, అంతంతమాత్రంగానే జరుగుతున్న నియామకాలకు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
భారత బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ రికార్డు స్థాయిలో 28వసారి బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్నారు. దోహాలో జరిగిన IBSF ఛాంపియన్షిప్లో ఇంగ్లండ్కు చెందిన రాబర్ట్ హాల్ను 4-2 తేడాతో ఓడించారు. ఈ టైటిల్ను ఆయన వరుసగా ఏడోసారి గెలుచుకోవడం విశేషం. 2016లో అద్వానీ విజయ పరంపర మొదలైంది.
టెస్టుల్లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో రెండే సెంచరీలు చేశారని గుర్తుచేశారు. ‘2019 నవంబరు తర్వాత విరాట్ కేవలం రెండే టెస్టు సెంచరీలు చేశారు. అది కచ్చితంగా ఆందోళనకరమే. ఇంకెవరైనా ఆటగాడయ్యుంటే అంతర్జాతీయ క్రికెట్ జట్టు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. AUS పర్యటనలో ఆయన పుంజుకోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
AP: రెండేళ్ల క్రితం తన తల్లి విజయమ్మ కారు టైర్ బరస్ట్ అయితే, లేటెస్ట్గా అయినట్లు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఆమె రాసిన లేఖను ఫేక్ అని ప్రచారం చేశారని మండిపడ్డారు. అందుకే తన తల్లి వీడియో మెసేజ్ ఇచ్చి వారిని దుయ్యబట్టిందని ట్వీట్ చేశారు. ‘ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు.
డాలర్ విలువ పెరిగితే రూపాయి విలువ తగ్గుతుంది. దేశాల మధ్య లావాదేవీలు దాదాపు డాలర్లలోనే జరుగుతుంటాయి. అందుకే వస్తువుల ఎగుమతి/దిగుమతుల కోసం భారత్ సహా చాలా దేశాలు డాలర్లను నిల్వ చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగితే మనం ఎక్కువ రూపాయలు చెల్లించి వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటే రూపాయి పడిపోతుంది. డాలర్ నిల్వలు ఖర్చవుతాయి.
Sorry, no posts matched your criteria.