India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొట్ట ఎంత ఎక్కువ గుండ్రంగా ఉంటే గుండె జబ్బులు అంత ఎక్కువగా వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ఓ కథనం పేర్కొంది. BMIతో పోలిస్తే BRI (బాడీ రౌండ్ ఇండెక్స్) మరింత మెరుగ్గా వీటిని అంచనా వేస్తుందని తెలిపింది. ఆరేళ్లకు పైగా ఎక్కువ BRI ఉంటే ముప్పు 163% వరకు పెరుగుతుందని హెచ్చరించింది. BRIలో హైట్, వెయిట్తో పాటు పొట్ట చుట్టుకొలతా తీసుకుంటారు. ఒబెసిటీతో BP, షుగర్, గుండె జబ్బులు రావడం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ బీర్భూమ్లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. గంగారాంచక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోలిరీలో బొగ్గు తవ్వి తీసేందుకు పేలుళ్లు చేపట్టగా ప్రమాదం జరిగినట్లు సాక్షులు చెబుతున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. తన స్టేట్మెంట్ తెలిపేందుకు రేపు కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది. ఈమేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం 100 డేస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్కు నిర్మాతలు సర్ఫ్రైజ్ ఇచ్చారు. ఖరీదైన BMW కారును హీరో చేతుల మీదుగా అందించారు. ఈ మూవీ ₹110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్ వ్యూస్లోనూ అదరగొట్టింది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్దాస్, అభిరామి, నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.
బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని వస్తోన్న వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. వృద్ధాప్యం దృష్ట్యా తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు.
TG: ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ చెక్కులను ప్రజా భవన్లో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులేటి వారికి అందజేశారు. రూ.796కోట్ల విలువైన చెక్కులను ఇవ్వగా ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ అందింది. సింగరేణిలోని ఒప్పంద ఉద్యోగులకు రూ.5వేల బోనస్ ఇస్తామని భట్టి అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు కట్టాల్సిన అవసరం ఉందని పొంగులేటి అన్నారు.
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘నేతి బీరకాయలోని నెయ్యి ఎంతో ఉచిత ఇసుకలోని ఉచితం అంత!’ అని రాసుకొచ్చారు. కాగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో కొన్ని ప్రాంతాల్లో గతంలో కంటే ఎక్కువ రవాణా ఖర్చవుతోందని విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. రవాణా ఛార్జీల్లో ఏకీకృత విధానం ఉండాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాసేపట్లో కలవనున్నారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బాబుతో భేటీ అవుతారని సమాచారం.
దసరా, దీపావళి సందర్భంగా దేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా విదేశీయులే లక్ష్యంగా రాయబార కార్యాలయాల వద్ద ఈ దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి, ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఎదురు ప్రశ్న సంధించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్లో అన్నారు.
Sorry, no posts matched your criteria.