India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ను హత్తుకుని దిగిన ఫొటోను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘లవ్ యూ తారక్ అన్నా. దేవర మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. అనిరుధ్ మ్యూజిక్, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఇరగదీశారు. ఈ ఆల్బమ్ అందరికీ నచ్చుతుంది’ అని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్కు విశ్వక్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ త్వరలో రిలీజ్ కానుంది.
AP: శ్రీకాకుళం జిల్లాలో YCPకి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి YCPకి రాజీనామా చేశారు. ‘పార్టీలో నాకు అన్యాయం, అవమానం జరిగింది. కేబినెట్ ర్యాంక్, MP టికెట్ ఇస్తామని మోసం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో? ఎందుకు తీసేశారో తెలియదు. పదవుల కంటే నాకు గౌరవం ముఖ్యం. ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ ఉంటా’ అని ఆమె వెల్లడించారు. అటు ఆమె కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
AP: వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. వాలంటీర్ల స్థానంలో పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ఇచ్చిన వివరణతో న్యాయస్థానం ఏకీభవించింది. పెన్షన్లను వాలంటీర్లతో పంపిణీ చేయకూడదన్న ఈసీ ఆదేశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది.
కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 సినిమాల్లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరో ఇష్యూపై మూవీ తీయనున్నారు. జ్ఞానవాపి మసీదు ఇష్యూపై ‘జ్ఞానవాపి’ అనే టైటిల్తో సినిమా నిర్మించనున్నారు. దీనిని వివిధ భాషల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ది ఢిల్లీ ఫైల్స్, ది ఇండియా హౌస్ చిత్రాలు నిర్మాణంలో ఉండగా.. వీటి తర్వాత ‘జ్ఞానవాపి’ రిలీజయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీకి బీజేపీ లీగల్ నోటీస్ పంపించింది. తనను పార్టీలో చేరాలని లేదంటే అరెస్టుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ బెదిరించినట్టు ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ ఆమెకు పరువునష్టం దావా నోటీస్ పంపింది. తమ పార్టీ తరఫున ఆమెను ఎవరు సంప్రదించారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఆతిశీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తనతో నటించిన వారిలో తనకు ఇష్టమైన కోస్టార్ దుల్కర్ సల్మాన్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. ‘సీతారామం’ షూటింగ్ సమయంలో దుల్కర్ అడుగడుగునా ధైర్యానిచ్చారని తెలిపారు. ఆయన వల్లే సీత పాత్ర చేయగలిగానని చెప్పారు. పలు భాషల్లో నటిస్తున్నానంటే కారణం దుల్కర్ ఇచ్చిన స్ఫూర్తి అని పేర్కొన్నారు.
పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ముద్రించి షాపులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 3& 6 తరగతుల కొత్త సిలబస్ పుస్తకాలు మే నెలలోపు ప్రచురిస్తామంది. 4, 5, 9 & 11 తరగతుల పుస్తకాలు ఈ నెలలో మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించింది.
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్, BRS టామ్ అండ్ జెర్రీ ఫైట్లా ఉందని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘పదేళ్లు BRS ఫోన్ ట్యాపింగ్ చేసింది. అసలు దోషులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిస్తోంది. చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై CBIతో విచారణ చేయించాలి. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తాం. కవితకు బెయిల్ రాలేదంటే ఆధారాలు గట్టిగా ఉన్నాయని తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.
ఎన్నికల వేళ మరో BJP నేత రాజ్యాంగంపై కామెంట్ చేసి ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది’ అని రాజస్థాన్లోని నాగౌర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా పేర్కొన్నారు. కాగా ఇటీవల కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేయగా బీజేపీ ఆయనకు టికెట్ రద్దు చేసింది.
ముంబై కెప్టెన్గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించడంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ భిన్నంగా స్పందించారు. ఇలాంటి వాటిపై తొందరపడి మాట్లాడితే పొరపాటే అవుతుందని అన్నారు. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయి MI ఛాంపియన్గా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడే ఓ అంచనాకు రాకుండా మరో రెండు మ్యాచుల వరకైనా వేచి చూడాలని అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.