India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని కేసీఆర్ అన్నారు. ‘మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికి. రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువ చేశాం’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తామని BRS నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, విద్యార్థులు, పోలీసులు.. ఇలా అన్ని వర్గాల వారు రోడ్లెక్కుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రులు గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరుగుతున్నారని, భూమిపై తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయని సంగారెడ్డి రైతు దీక్షలో అన్నారు.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 29న CBT విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. గతంలో విడుదలైన నోటిఫికేషన్కు దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. అటు రేపు జరిగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది.
TG: దళిత బంధు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ప్రశ్నిస్తే దాడి చేయడమా అని మండిపడ్డారు. పాలకుల వద్ద మెప్పు పొందేందుకు పోలీసులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.
AP: తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, ఆనం, బీసీ.జనార్ధన్తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి 40 నిమిషాల్లో వచ్చామని ప్రెస్మీట్లో చెప్పారు.
AP: వైఎస్ జగన్కు ధైర్యముంటే అసెంబ్లీకి రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ అనేది ఒక వేదిక. అక్కడికి రావడానికి జగన్కు భయం ఎందుకు? అసెంబ్లీకి వెళ్లని వారిని గెలిపించడం ఎందుకని ప్రజలు ఆలోచిస్తారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు NDAకే కట్టబెడతారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
AP: YS జగన్పై అసభ్యకర పోస్టులు పెడుతున్న TDP కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని YCP నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ, అనంతపురం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో ఫిర్యాదులు చేసినట్లు YCP ట్వీట్ చేసింది. పోలీస్ వ్యవస్థ చంద్రబాబు, లోకేశ్ గుప్పిట్లో ఉందని, దీని వల్ల ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని అంబటి రాంబాబు అన్నారు. తమ కార్యకర్తలపై లాఠీ ఎత్తితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
రణ్బీర్ కపూర్-సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ మూవీ 2027లో విడుదలవుతుందని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ‘సందీప్ ‘స్పిరిట్’తో, రణ్బీర్ ‘రామాయణ’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తైన వెంటనే ‘యానిమల్ పార్క్’ షూట్ స్టార్ట్ చేస్తాం. ఈ చిత్రంలో రణ్బీర్ రోల్ మరింత క్రూరంగా ఉంటుంది. బలమైన పాత్రలు, ఊహించనన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. వీటిని చూసి అందరూ థ్రిల్ అవుతారు’ అని ఆయన చెప్పారు.
TG: గ్రూప్-4 అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని.. అందులో భాగంగా గ్రూప్-4కు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జులైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా తుది ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.
TG: ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన కావొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 14న రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ వర్సిటీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.