India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రియుడు ఆంథోనీని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్ తమ ప్రేమబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2010లో ఆంథోనీనే తనకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు. ఓ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారని పెళ్లి అయ్యే వరకు దానిని తొలగించలేదన్నారు. తాను నటించిన సినిమాల్లో ఈ విషయాన్ని గమనించవచ్చని తెలిపారు. కాగా గత నెలలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

కొత్త వారికి ఆమడ దూరం ఉంటూ, ఎవరితోనైనా మాట్లాడేందుకు కొందరు జంకుతుంటారు. ఇంటికి బంధువులొస్తే వారితో ఎలా మాట కలపాలి? ఏమడగాలో తెలియక సైలెంట్గా ఉండిపోతారు. ఇలా ప్రతిదానికి మొహమాటపడే వారినే ఇంట్రోవర్ట్ అంటారు. ఏటా JAN 2న ‘ఇంట్రోవర్ట్ డే’ని జరుపుకుంటారు. కోపమొచ్చినా, సంతోషమొచ్చినా, ఏడ్పొచ్చినా లోలోపలే తమ భావాలను వ్యక్తపరుచుకునే ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇంతకీ మీరూ ఇంట్రోవర్టేనా?

2025లో వరుసగా రెండో సెషన్లోనూ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. నిఫ్టీ 23,816 (+73), సెన్సెక్స్ 78,240 (+241) వద్ద ట్రేడవుతున్నాయి. డిఫెన్సివ్ రంగాలైన ఫార్మా, రియాల్టి, హెల్త్కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, ఫైనాన్స్, IT, PVT బ్యాంకు షేర్లకు డిమాండ్ ఉంది. బజాజ్ ట్విన్స్ టాప్ గెయినర్స్.

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర్(33) ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. మంగళవారం అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేశారు. అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. కుక్కకు ఉపయోగించిన చైన్తోనే ఉరేసుకొని చనిపోయాడు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై పోలీసులు చేపట్టిన విచారణపై స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జులై 3న ఆమె అరెస్టవ్వగా 10 రోజులకు బెయిల్పై విడుదలయ్యారు. కాగా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హేమ కోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

TG: రైతు భరోసాపై ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ జరగనుంది. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశముంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ స్పష్టత రానుంది. కాగా ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతులకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరో రెండుమూడేళ్ల వరకూ మహేశ్ బాబు కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన పాత సినిమాల్ని నిర్మాతలు రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, మురారి తదితర సినిమాలు విడుదల కాగా.. వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘అతిథి’ రీ-రిలీజ్ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో 2007లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. మరి రీ-రిలీజ్లో ఎలా అలరిస్తుందో చూడాలి.

AP: విశాఖ పోర్టు ఏర్పాటైన 9 దశాబ్దాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం సరకు రవాణాలో రికార్డ్ సృష్టించింది. DECతో ముగిసిన మూడో త్రైమాసికానికి 60.28M టన్నుల సరకు రవాణా జరిగింది. పోర్టులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాల వల్లే ఇది సాధ్యమైంది. మరింత మెకనైజేషన్ కోసం టెర్మినళ్ల ఆధునికీకరణ, రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు వెల్లడించారు.

బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఇప్పటికే 2-1తో వెనుకంజలో ఉన్న టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. పేసర్ ఆకాశ్దీప్ నడుము నొప్పి కారణంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే 5వ టెస్టుకు దూరం కానున్నట్లు కోచ్ గంభీర్ తెలిపారు. ఈ సిరీస్లో పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ కీలకమైన సిడ్నీ టెస్టుకు దూరమవడం భారత్కు బ్యాడ్న్యూసే అని చెప్పొచ్చు. ఇక అతడి ప్లేస్లో హర్షిత్ రాణాను తీసుకునే ఛాన్స్ ఉంది.

సిడ్నీలో రేపటి నుంచి జరిగే ఆఖరి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్ను తప్పించింది. అతడి స్థానంలో బ్యూ వెబ్స్టెర్ను జట్టులోకి తీసుకుంది. ఆల్రౌండర్గా జట్టులో ఉన్న మార్ష్, 2 విభాగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యారు. నాలుగు టెస్టుల్లో 33 ఓవర్లు వేసి 3 వికెట్లే తీశారు. ఇక బ్యాటింగ్లో కేవలం 73 పరుగులే చేశారు. ప్రస్తుతం మెల్బోర్న్ స్టార్స్ తరఫున BBL ఆడుతున్న వెబ్స్టెర్కి ఇదే తొలి మ్యాచ్ కానుంది.
Sorry, no posts matched your criteria.