News September 4, 2025

విద్యార్థులు ప్లేట్లు కడగడం సిగ్గుపడేదేం కాదు: CJ AK సింగ్

image

TG: ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులు ప్లేట్లు, టాయిలెట్లు కడగడం సిగ్గుపడాల్సిన పనేం కాదని హైకోర్టు CJ AK సింగ్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టారు. ‘చదువుకునేటప్పుడు నేనూ ప్లేట్లు కడిగాను, టాయిలెట్లు క్లీన్ చేశాను. అదేం తప్పుకాదు. ఈ ఘటనలపై వివరణ, నివారణ చర్యల గురించి తెలియజేయాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ SEP 19కి వాయిదా వేశారు.

News September 4, 2025

‘సోనియాపై FIR నమోదుకు ఆదేశించండి’

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని వికాస్ త్రిపాఠి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె భారత సిటిజన్ షిప్ లేకుండానే ఓటు నమోదు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1982లో ఆమె ఓటును డిలీట్ చేసి 1983లో తిరిగి చేర్చారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా సోనియాకు భారత పౌరసత్వం 1983లో లభించింది.

News September 4, 2025

కంప్యూటర్ సైన్స్ చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు

image

డిగ్రీ, పీజీ లెవల్లో కంప్యూటర్స్ చదివిన వారికి ప్రభుత్వ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. మాస్టర్స్, PHD చేసి టీచింగ్/రీసెర్చ్‌లో కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. రైల్వే, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల్లోనూ వీరికి అనేక నియామకాలుంటాయి. రాష్ట్ర స్థాయిలో కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా, సిస్టమ్స్‌ అనలిస్ట్‌గా, సిస్టమ్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

News September 4, 2025

GST: సినిమా టికెట్లు, పాప్ కార్న్‌పై ఇలా..

image

<<17605492>>జీఎస్టీ<<>> శ్లాబుల్లో మార్పుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాస్త ఊరట లభించనుంది. రూ.100, ఆ లోపు టికెట్లపై GSTని 12% నుంచి 5%కి కేంద్రం తగ్గించింది. అయితే రూ.100పైన టికెట్లకు మాత్రం 18% వసూలు కొనసాగనుంది. దీంతో మల్టీప్లెక్స్‌లో ఎప్పటిలాగే టికెట్ల ధరలు ఉండనున్నాయి. ఇక పాప్‌కార్న్ ధరలపై విమర్శలు ఉండగా ప్యాకేజీతో సంబంధం లేకుండా సాల్ట్ పాప్‌కార్న్ 5శాతం, క్యారమిల్ పాప్‌కార్న్‌ 18శాతంలోకి రానుంది.

News September 4, 2025

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించాం: భట్టి

image

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పామాయిల్‌పై సుంకాలను తగ్గించాలని, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లకు ఆర్థిక సాయం అందించాలని కోరామన్నారు. సాయంత్రం అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి కేంద్ర ప్రభుత్వ సాయం కోరతామని చెప్పారు. భట్టి వెంట మంత్రి తుమ్మల ఉన్నారు.

News September 4, 2025

వినాయక విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తారంటే?

image

నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు అనంత చతుర్దశి రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. 9 రోజుల పూజలతో ఆయన విగ్రహానికి లభించిన శక్తులు నిమజ్జనంతో సర్వత్రా వ్యాపిస్తాయని భక్తుల నమ్మకం. ‘అనంత’ అంటే వినాయకుడు అంతం లేనివాడని అర్థం. మట్టి నుంచి ఉద్భవించిన వినాయకుడు నీటిలో కలిసి ప్రకృతికి, మానవాళికి తన శక్తులను ప్రసాదిస్తాడని.. అందుకే భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేయాలని పురోహితులు చెబుతున్నారు.

News September 4, 2025

రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు.. ఎక్కడంటే?

image

AP: రాష్ట్రంలో PPP విధానంలో 10 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ఈ కాలేజీలు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్ఎఫ్‌పీ(రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్) జారీకి మంత్రివర్గం అనుమతిచ్చింది. మొదటి దశలో నాలుగు చోట్ల, రెండో దశలో ఆరు చోట్ల వీటిని ఏర్పాటు చేయనుంది.

News September 4, 2025

భార్గవ్‌పై ఆరోపణలు అవాస్తవం: సజ్జల రామకృష్ణారెడ్డి

image

AP: లిక్కర్ కేసులో భార్గవ్‌పై ఆరోపణలు అవాస్తవమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘భీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయి?. భీమ్ స్పేస్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న గతంలో ఓ టీవీ ఛానల్‌లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ ఛానల్‌‌తో నారా లోకేశ్ సన్నిహితంగా ఉండేవారు. లోకేశ్‌కి ప్రద్యుమ్న సన్నిహితుడు కావొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.

News September 4, 2025

వరదలకు అడవుల నరికివేతే కారణం: సుప్రీం

image

పంజాబ్, HP, ఉత్తరాఖండ్, J&Kలో వరదల బీభత్సంపై SC తీవ్రంగా స్పందించింది. అక్రమంగా అడవుల నరికివేతే విపత్తులకు కారణమంది. పెద్దఎత్తున చెట్ల దుంగలు వరదల్లో కొట్టుకొచ్చినట్లు SMలో వీడియోలు చూసినట్లు పేర్కొంది. దీనిపై 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాలకు నోటీసులు పంపింది. కొండ ప్రాంతాల్లో పర్యావరణ పతనంపై దర్యాప్తు కోరుతూ పర్యావరణవేత్త అనామిక పిటిషన్‌పై విచారణ సందర్భంగా SC ఈ వ్యాఖ్యలు చేసింది.

News September 4, 2025

కోహ్లీ-రోహిత్‌ని ఆడొద్దనే హక్కు లేదు: దీప్‌ దాస్‌

image

కోహ్లీ-రోహిత్ మరికొన్నేళ్లు క్రికెట్ ఆడగలరని టీమ్ ఇండియా మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఏ ఆటగాడినైనా వయసు రీత్యా రిటైరవ్వమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. పర్ఫామ్ చేస్తుంటే కొనసాగడంలో తప్పేంటి? ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పనప్పుడు.. ఎప్పుడు ఆపాలో ఎలా చెప్తారు’ అని ప్రశ్నించారు. కోహ్లీ-రోహిత్ T20, టెస్టుల నుంచి రిటైరైన విషయం తెలిసిందే.