News September 11, 2025

మన కంపెనీలకు సవాలేనా?

image

చైనా, వియత్నాం నుంచి భారత ఆటోమొబైల్ కంపెనీలకు సవాల్ ఎదురుకానుంది. చైనాకు చెందిన ప్రముఖ ఈవీ కార్ల కంపెనీ BYD.. ఇండియాలో ప్లాంట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటే సుంకాల వల్ల రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Atto 2 SUV EVని రూ.20 లక్షల్లోపు తీసుకురావాలని భావిస్తోంది. అటు వియత్నాం VinFast రూ.16 లక్షలకే VF6 EV కారును లాంఛ్ చేసింది.

News September 11, 2025

గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా

image

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రేపు ఆయన ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.

News September 11, 2025

విటమిన్ డి లోపం ఉంటే ఇవి తీసుకోండి

image

శరీరంలో హెల్తీబోన్స్‌కు కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్‌ను గ్రహించడంలో విటమిన్ డి సాయపడుతుంది. కొవ్వును కరిగించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి, గుండె, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ డి అవసరం. దీనికోసం ఆవు పాలు, పెరుగు వంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. వీటితోపాటు లో ఫ్రీక్వె‌న్సీ సన్‌లైట్‌లో ఉంటే విటమిన్ డి లభిస్తుంది.

News September 11, 2025

మగువల కోసం బ్యూటీ టిప్స్

image

* యాపిల్ సైడర్ వెనిగర్‌ కలిపిన నీటిలో పాదాలను 30 నిమిషాలు ఉంచితే పాదాల దుర్వాసన, పగుళ్లు, మడమ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కాస్త నీటిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేసి 5 నిమిషాల తర్వాత తడి వేళ్లతో స్క్రబ్ చేసి నీటితో కడిగితే మెడపై డార్క్ ట్యాన్ పోతుంది.
* ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై రబ్ చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.

News September 11, 2025

మైథాలజీ క్విజ్ – 3

image

1. అర్జునుడి విల్లు పేరేంటి?
2. యమధర్మరాజు తండ్రి ఎవరు?
3. చైత్ర మాసంలో నవమి నాడు వచ్చే పండుగ ఏది?
4. ఏ రాష్ట్రంలో ఎక్కువ జ్యోతిర్లింగాలు ఉన్నాయి?
5. సంతానం కోసం దశరథుడు ఏ యాగం చేశాడు?
6. అనసూయకు త్రిమూర్తుల అంశతో ఎవరు జన్మించారు?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

News September 11, 2025

నన్ను టార్గెట్ చేస్తున్నారు: గడ్కరీ

image

ఇథనాల్ పెట్రోల్‌పై సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెయిడ్ పొలిటికల్ క్యాంపెయిన్ జరుగుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. E20 పెట్రోల్ సురక్షితం అని, దాన్ని ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయని పేర్కొన్నారు. కాగా E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది.

News September 11, 2025

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే మెదక్‌లో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు దంచికొడుతున్నాయి.

News September 11, 2025

4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

image

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్‌లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

News September 11, 2025

ఏ వాస్తు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?

image

వాస్తు శాస్త్రంపై ఏ ఒక్క రుషి రచనను ప్రామాణికంగా తీసుకోవాలన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం వేర్వేరు మార్గాల్లో వెళ్లినా చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినట్లుగా.. ఏ వాస్తు శాస్త్రాన్ని అనుసరించినా దాని లక్ష్యం ఒకటే ఉంటుంది. అందరు మహర్షులు సమాజ హితం కోసమే ఈ రచనలు చేశారు. మీరు ఏ వాస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నా అందులో సూత్రాలు మారవు. బాగా ప్రాచుర్యం పొందిన వాస్తు శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది.

News September 11, 2025

వాస్తు శాస్త్రాన్ని అంత మంది రుషులు ఎందుకు రచించారు?

image

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఓ వ్యక్తి ఆలోచన మాత్రమే కాదు. ఇది అనేకమంది రుషుల జ్ఞానం, అనుభవం నుంచి పుట్టింది. ఇతిహాసాలు, పురాణాలను ఎంతో మంది కవులు, పండితులు తమదైన శైలిలో రచించినట్లే వాస్తు శాస్త్రాన్ని కూడా ఎందరో మహర్షులు సమాజ శ్రేయస్సు కోసం రాశారు. వారి రచనల్లో పదాలు వేరుగా ఉన్నప్పటికీ, పరమార్థం ఒకటే ఉంటుంది. వీళ్లందరూ మానవుల జీవితం సుఖశాంతులతో సాగడానికి సరైన మార్గాన్ని చూపించారు.