News January 2, 2025

భారత్-పాక్ మధ్య అణు స్థావరాల సమాచార మార్పిడి

image

30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భారత్, పాక్ తమ అణు స్థావరాల సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. దౌత్య మార్గాల ద్వారా ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకార ఖైదీలు, కశ్మీర్, సీమాంతర ఉగ్రవాదంపైనా సమాచార మార్పిడి జరిగినట్లు వెల్లడించింది. అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ఒప్పందం ప్రకారం 1992 నుంచి ఏటా జనవరి 1న ఈ కార్యక్రమం జరుగుతోంది.

News January 2, 2025

తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు విటిలిగో వ్యాధి

image

మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీనిని కాస్మోటిక్ మేకప్‌తో కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విటిలిగో(బొల్లి) అనే చర్మ సమస్యతో తాను సతమతమవుతున్నట్లు తెలిపారు. మొదట్లో ఈ విషయమై భయపడినా సినిమాల్లో బిజీ అవడంతో మరిచిపోయినట్లు చెప్పారు. కాగా విటిలిగో అంటు వ్యాధి కాకపోయినా దీనికి కచ్చితమైన నివారణ లేదు.

News January 2, 2025

GST: APలో 6 శాతం తగ్గుదల.. TGలో 10 శాతం పెరుగుదల

image

2024 డిసెంబర్‌లోనూ ఏపీలో <>జీఎస్టీ వసూళ్లు<<>> 6 శాతం మేర తగ్గాయి. 2023 DECలో రూ.3,545 కోట్లు వసూలవగా, ఈసారి రూ.3,315 కోట్లే నమోదైంది. గత నవంబర్‌లోనూ 10 శాతం మేర జీఎస్టీ వసూళ్లు తగ్గిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో 10 శాతం వృద్ధి నమోదైంది. 2023 DECలో రూ.4,753 కోట్లు వసూలవగా, ఈసారి రూ.5,224 కోట్లు వచ్చింది.

News January 2, 2025

ధైర్యముంటే ఆత్మహత్య చేసుకో.. పునీత్ కేసులో సంచలన విషయాలు

image

ఢిల్లీలో భార్యా బాధితుడు <<15038293>>పునీత్<<>> ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మణికా, ఆమె పేరెంట్స్ కలిసి పునీత్‌ను మానసికంగా టార్చర్ చేశారని అతని సోదరి తెలిపింది. ‘నువ్వు ఏమీ చేయలేవు, ధైర్యం ఉంటే ఆత్మహత్య చేసుకో’ అని ప్రేరేపించారని వెల్లడించింది. ‘బేకరీలో వాటా, విడాకుల అంశం కోర్టులో ఉన్నప్పటికీ మణికా వేధించేది. పునీత్ ఇన్‌స్టాను హ్యాక్ చేసి ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించేది’ అని పేర్కొంది.

News January 2, 2025

సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం

image

AP: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గృహాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు కూడా సీఎం హోదాలో చంద్రబాబు అక్కడే నివాసం ఉన్నారు. అయితే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆ నిర్మాణం అక్రమమని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News January 1, 2025

BGT: చివరి టెస్టుకు వర్షం ముప్పు

image

BGTలో భాగంగా సిడ్నీ వేదికగా ఎల్లుండి నుంచి జరిగే చివరి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ రద్దయినా, డ్రా అయినా ఆసీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిస్తే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండులో ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరగగా IND ఒక్కటే గెలిచింది. 5 ఓడిపోగా, 7 డ్రాగా ముగిశాయి.

News January 1, 2025

రాష్ట్రంలో మరో పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్

image

తెలంగాణలో వరుస పోలీసుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. HYD ఫిల్మ్ నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కిరణ్(36) మలక్ పేటలోని తన నివాసంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News January 1, 2025

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..

image

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్-2బీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.

News January 1, 2025

సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ ఎప్పుడంటే

image

సంక్రాంతికి తెలంగాణ-ఏపీ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. ఈ నెల 9, 11న కాచిగూడ-కాకినాడ, 10న హైదరాబాద్(నాంపల్లి)-కాకినాడ మధ్య నడవనున్నట్లు పేర్కొంది. 10, 12 తేదీల్లో కాకినాడ-కాచిగూడ, 11న కాకినాడ-హైదరాబాద్ మధ్య నడవనున్నట్లు తెలిపింది. రేపు ఉదయం 8గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయంది. ఈ రైళ్లు మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

News January 1, 2025

ఈరోజు నుంచి ఇలా చేస్తే బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ దరిచేరవు!

image

న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని వాగ్దానాలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు 10వేల అడుగులు నడుస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నారు. ఒక దగ్గర కూర్చోకుండా శరీరాన్ని కదిలించాలి. రోజూ నడవడం వల్ల అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, క్యాన్సర్‌తో పాటు అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.