News November 9, 2024

కలెక్టర్లు ఎన్యూమరేటర్లతో మాట్లాడాలి: భట్టి

image

TG: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలకు తలెత్తే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని Dy.CM భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సర్వేపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేశారు. ‘కలెక్టర్లు ఎన్యూమరేటర్లతో నిత్యం మాట్లాడాలి. మంత్రులు, MLAలకు సమాచారం ఇవ్వాలి. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోంది. అందరూ చూపించే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకండి’ అని కోరారు.

News November 9, 2024

YCP MLA తాటిపర్తిపై కేసు నమోదు

image

AP: మంత్రి నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 18న లోకేశ్‌పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్‌కు కమీషన్లు అందుతున్నాయని ఎక్స్‌లో చంద్రశేఖర్ పోస్టు చేశారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.

News November 9, 2024

అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్?

image

AP: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యతను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికి అప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.

News November 9, 2024

ప్రాఫిటబుల్ కంపెనీలూ లేఆఫ్స్ వేస్తే ఉద్యోగులు నమ్మేదెలా: ZOHO ఓనర్

image

లేఆఫ్స్ వేసే ప్రాఫిటబుల్ కంపెనీలను ఉద్యోగులెలా నమ్ముతారని ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రశ్నించారు. ‘ఆ కంపెనీ వద్ద $1BNS క్యాష్ ఉంది. వార్షిక ఆదాయం కన్నా ఇది 1.5 రెట్లు ఎక్కువ. 20% గ్రోత్‌రేటుతో లాభాల్ని ఆర్జిస్తోంది. అయినా $400 మిలియన్లతో షేర్లు బయ్‌బ్యాక్ చేసి, 12-13% ఉద్యోగుల్ని తొలగించి వారి విశ్వాసాన్ని ఆశించడం దురాశే’ అని అన్నారు. రీసెంటుగా 660 మందిపై వేటువేసిన ప్రెష్‌వర్క్స్‌ను విమర్శించారు.

News November 9, 2024

ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నా: MLA కైజర్

image

తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నానని NC MLA కైజర్ జంషైద్ వెల్లడించారు. J&K అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పుడు నాతో సహా 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో చేరిన వ్యక్తి గురించి తెలియదనడంతో కొట్టారు. దీంతో తాను మిలిటెంట్ అవ్వాలనుకుంటున్నానని సీనియర్ ఆఫీసర్‌తో చెప్పా. ఆయన తన సహోద్యోగిని మందలించడంతో వ్యవస్థపై నమ్మకం వచ్చింది’ అని పేర్కొన్నారు.

News November 9, 2024

ఎక్కడున్నవాళ్లు అక్కడే వివరాలు నమోదు చేయించుకోవచ్చు: ప్రభుత్వం

image

TG: రెండు రోజులుగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన అధికారులు నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే వివారాలు నమోదు చేయించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌లో అడ్రస్‌తో సంబంధం లేదని పేర్కొంది. అయితే సిబ్బంది వచ్చినప్పుడు ఆధార్, రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాసుపుస్తకం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

News November 9, 2024

మీ ఇంటికి సర్వే స్టిక్కర్ అంటించారా?

image

TG: కులగణనలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది 2 రోజులుగా రాష్ట్రంలోని ఇళ్లకు సర్వే స్టిక్కర్లు అంటించారు. ఇవాళ్టి నుంచి ఆ ఇళ్లకు వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. అయితే HYDతో సహా పలు పట్టణాలు, గ్రామాల్లో కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదు. దీంతో తమ వివరాలను నమోదు చేస్తారా? లేదా? అని ప్రజలు అయోమయంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి మీ ఇంటికి స్టిక్కర్ అంటించారా? కామెంట్ చేయండి.

News November 9, 2024

హమాస్‌ను బహిష్కరించిన ఖతర్

image

హమాస్‌ను బహిష్కరించాలని ఖతర్ నిర్ణయించింది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా బందీల విడుదల, కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హమాస్‌ను బహిష్కరించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలను ఈ మేరకు ఖతర్ అంగీకరించింది. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని హమాస్ నాయకులకు స్పష్టం చేసింది. దీనిపై హమాస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

News November 9, 2024

90 రన్స్ వద్దా బౌండరీ యత్నం.. దటీజ్ శాంసన్: సూర్య

image

తొలి టీ20లో సౌతాఫ్రికాపై సెంచరీ(107)తో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. కొన్నేళ్లుగా కఠోర శ్రమ చేస్తున్న అతనికి ఇప్పుడు దాని ఫలితాలు అందుతున్నాయన్నారు. 90 పరుగుల వద్ద ఉన్నప్పటికీ సంజూ బౌండరీ కోసం ప్రయత్నిస్తారని, జట్టు కోసం ఆడే వ్యక్తి అతనని కొనియాడారు. తాము అలాంటి వారికోసమే చూస్తున్నామని పేర్కొన్నారు.

News November 9, 2024

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్

image

US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు చెందిన నిర్మాణ సంస్థ HYDలో 2 భవనాలు నిర్మించనుంది. మంజీరా గ్రూప్‌తో కలిసి మాదాపూర్‌లోని ఖానామెట్‌లో వీటిని ఏర్పాటు చేయనుంది. అందుకు 2022లోనే 2.92 ఎకరాలను HMDA వేలంలో కొనుగోలు చేసింది. 27 అంతస్థుల్లో 4BHK, 5BHK అపార్ట్‌మెంట్లను నిర్మించనుంది. 4వేల Sft-6వేల Sft విస్తీర్ణంలోని ఈ ఫ్లాట్ల ధరను Sftకి రూ.13వేలుగా గతంలో నిర్ణయించింది. అంటే 4BHK ఫ్లాట్ ధర రూ.5.5 కోట్లు.