News April 2, 2024

వైసీపీ పాలనలో ప్రజల్లో సంతోషం: వైవీ సుబ్బారెడ్డి

image

AP: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్వతీపురం ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందించాం. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశాం. ఈ సంక్షేమం గ్రామాల్లో కొనసాగాలంటే జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి వైసీపీకి ఓటు వేయించండి.’ అని ఆయన పేర్కొన్నారు.

News April 2, 2024

తెలంగాణలో CAA అమలు చేయం: మంత్రి ఉత్తమ్

image

TG: దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఏఏ, NRC రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వాటిని అమలు చేయమని స్పష్టం చేశారు. కోదాడలో ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, కాంగ్రెస్ పార్టీతోనే వారికి రక్షణ ఉంటుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

News April 2, 2024

మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

image

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో డకౌటై ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన మూడో ఆటగాడిగా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. ఇప్పటివరకు ఆయన 16 సార్లు డకౌట్ అయ్యారు. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ చెరో 17 సార్లు డకౌట్ అయ్యి తొలి స్థానంలో ఉన్నారు. మన్‌దీప్ సింగ్, నరైన్, పీయూష్ చావ్లా 15 సార్లు సున్నాకే వెనుదిరిగారు.

News April 2, 2024

2029 నాటికి చంద్రబాబు కదలలేకపోవచ్చు: VSR

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘జనం వచ్చినా రాకున్నా.. మీ సోది ప్రసంగం వినలేక మధ్యలో వెళ్లిపోయినా.. తిరుగుతూనే ఉండండి చంద్రబాబు. ఎందుకంటే మీకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఇంకెప్పుడూ ఇలా ఎండల్లో తిరిగే అవసరం రాదు. 2029 నాటికి వృద్ధాప్యం వల్ల మీరు కదలలేకపోవచ్చు. ఇప్పటికే బెయిల్ కోసం వంద జబ్బుల లిస్టు బయటపెట్టారుగా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News April 2, 2024

నేటితో వీరి రాజ్యసభ పదవీకాలం ముగిసింది..

image

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. వారిలో AP నుంచి ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, కనకమేడల రవీంద్ర, TG నుంచి రవిచంద్ర, లింగయ్య, జోగినపల్లి సంతోష్ ఉన్నారు. వీరి స్థానంలో APలో YCP నుంచి మేడా శివనాథ్, సుబ్బారెడ్డి, బాబూరావు, TGలో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్(INC), వద్దిరాజు రవిచంద్ర(BRS) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News April 2, 2024

ఏప్రిల్ ఫూల్ చేద్దామని ‘ఉరి’ డ్రామా.. అనూహ్యంగా మృతి

image

స్నేహితుడిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నించి అభిషేక్ అనే విద్యార్థి అనూహ్యంగా మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఉరి తాడుని మెడకు బిగించుకుని ఆ విద్యార్థి.. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేశాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఇంతలో తాను నిలబడ్డ కుర్చీ పడిపోవడంతో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2024

స్టాక్ మార్కెట్లలో ఎన్నికల జోష్ కనిపించదేం?

image

సాధారణంగా ఎన్నికల వేళ జోరు ప్రదర్శించే స్టాక్ మార్కెట్లలో ఈసారి ఆశించినంత జోష్ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ పరిణామాలే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఎలక్టోరల్ బాండ్ల వివాదం, అవినీతి ఆరోపణలు మొదలైన అంశాలు సంచలనమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారట. మార్కెట్ల జోష్‌ BJP గెలుపుతో ముడిపడి ఉందని.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే మార్కెట్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు.

News April 2, 2024

పెన్షన్లు ఆపేసి ప్రతిపక్షాలపై బురద: జనసేన

image

పెన్షన్లపై CM జగన్ ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని జనసేన విమర్శించింది. ‘వాలంటీర్లతో వికృత చేష్టలు చేయించుకోవడం ఇక సాధ్యం కాదు అని తెలిసి పెన్షన్ల పంపిణీకి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నా కూడా పెన్షన్లు ఆపేసి ప్రతిపక్షాలపై బురద చల్లుతున్న అసలైన పెత్తందారుడు జగన్!’ అని ట్వీట్ చేసింది. వాలంటీర్లు లేకుండా కేంద్రం 3 కోట్ల మందికి పెన్షన్లు ఇస్తుంటే.. జగన్ ఇవ్వలేకపోతున్నారని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

News April 2, 2024

భర్త మేనకోడలిని కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్న భార్య

image

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. తన భర్త మేనకోడలిని(మైనర్) కిడ్నాప్ చేసిన భార్య.. ఆ బాలికను పెళ్లి చేసుకుంది. లైంగికంగా వేధించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. తాను లెస్బియన్ అని, బాలికతో శారీరక సంబంధం ఉందని సదరు మహిళ చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2024

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

image

AP: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. పింఛన్ల పంపిణీని సీఎం జగన్ సరిగా నిర్వర్తించటం లేదు. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.