News January 1, 2025

TGB ఖాతాదారులకు నూతన మార్గదర్శకాలు

image

TG: రాష్ట్రంలోని 493 ఏపీజీవీబీ బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమయ్యాయి. దీంతో 927 శాఖలతో TGB దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో పాత ఖాతా కలిగిన వారికి TGB మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త ఏటీఎం కార్డు కోసం సంబంధిత బ్రాంచ్‌లో సంప్రదించాలి. పాత చెక్‌బుక్‌ను వెనక్కి ఇవ్వాలి. TGB వాట్సాప్ సేవల కోసం 9278031313ను, ఇంటర్నెట్ సేవలకు www.tgbhyd.inను వాడాలి.

News January 1, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సిమెంట్, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే అందేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు, స్థలం లేని వారికి స్థలం+రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

News January 1, 2025

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: విద్యార్థుల ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించింది. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్‌లు నిద్ర చేసి, వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తరచూ తనిఖీలతో పాటు కలెక్టర్లు నెలవారీ సమీక్షలు నిర్వహించాలని పేర్కొంది.

News January 1, 2025

సూపర్-6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం: CM

image

AP: YS జగన్ సీపీఎస్ రద్దు, మద్యనిషేధం అమలు చేస్తామని అబద్ధాలు చెప్పారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎంత మంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, తాము మాత్రం కచ్చితంగా సూపర్-6 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో పోలవరం పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు. తానెప్పుడూ రాజకీయ కక్షలు తీర్చుకోనని, తప్పు చేసిన వారిని మాత్రం వదలబోనని చిట్‌చాట్‌లో హెచ్చరించారు.

News January 1, 2025

2025లో విమానం ఎక్కి 2024లో ల్యాండ్ అయ్యాడు!

image

డిసెంబర్ 31st అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం సహజం. అయితే, ఓ వ్యక్తికి మాత్రం ఇది రివర్స్ అయింది. 2025లో విమానం ఎక్కగా 2024లో ల్యాండ్ అయ్యాడు. అదెలా అనుకుంటున్నారా? హాంకాంగ్‌లో 2025 జనవరి 1న 12.38 గంటలకు విమానం ఎక్కగా.. లాస్ ఏంజెలిస్‌లో అతను 2024 డిసెంబర్ 31న రాత్రి 8 గంటలకు ల్యాండయ్యాడు. ఎందుకంటే హాంకాంగ్‌ టైమ్ జోన్ లాస్ ఏంజెలిస్ కంటే 16 గంటల ముందుంటుంది.

News January 1, 2025

ప్రజలకు అందుబాటులో ఉండండి.. MLAలకు సీఎం సూచన

image

TG: స్థానిక సంస్థల్లో సమన్వయంతో పని చేసి గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మారాను. మీరూ మారండి. స్థానిక ఎన్నికలు చాలా కీలకం. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నా దగ్గర సమాచారం ఉంది. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండండి’ అని సూచించారు.

News January 1, 2025

సంధ్య థియేటర్ ఘటనపై NHRC నోటీసులు

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట‌పై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల కమిషన్(NHRC) నోటీసులు జారీ చేసింది. పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రేవతి చనిపోయిందని న్యాయవాది రామరావు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలంది. లాఠీఛార్జ్‌పై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని NHRC ఆదేశించింది.

News January 1, 2025

అమరావతిలో రూ.2,322 కోట్ల పనులకు టెండర్లు

image

AP: రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.2,322 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లు ఆహ్వానించాయి. టెండర్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 22వ తేదీగా నిర్ణయించాయి. ఈ నిధులతో రోడ్లు, మంచి నీటి సరఫరా, పవర్, ట్రంక్ ఇన్‌ఫ్రా, నీరుకొండ రిజర్వాయర్ వరద నివారణ పనులను చేపట్టాల్సి ఉంటుంది. సంక్రాంతిలోపు రూ.31వేల కోట్ల పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News January 1, 2025

రోజుకు రూ.48 కోట్ల జీతం.. ఎవరికంటే?

image

ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న భారతీయుడు జగదీప్ సింగ్ అని అన్‌స్టాప్ నివేదిక పేర్కొంది. క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడైన జగదీప్ సింగ్ ఆ కంపెనీ సీఈవోగా ఏడాదికి రూ.17,500 కోట్ల శాలరీ తీసుకుంటున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.1,458 కోట్లు కాగా రోజుకు రూ.48 కోట్లు. క్వాంటం స్కేప్ స్థాపించక ముందు ఆయన పలు కంపెనీల్లో కీలక పదవుల్లో పనిచేశారు.

News January 1, 2025

టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన నితీశ్

image

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ 528 పాయింట్లకు చేరుకోగా 20 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకులో నిలిచారు. మరోవైపు ఓపెనర్ జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఈ సిరీస్‌లో విఫలమవుతోన్న విరాట్ 24, రోహిత్ 40వ స్థానానికి పడిపోయారు.