India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తొలి టీ20లో సౌతాఫ్రికాపై గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది. డర్బన్ గ్రౌండ్లో 100 శాతం విజయాలను సాధించిన జట్టుగా నిలిచింది. అక్కడ భారత్ ఆడిన 8 T20లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. మరొకటి రద్దయ్యింది. పూర్తయిన 6 మ్యాచ్లలోనూ గెలిచింది. అలాగే ఈ ఏడాది అత్యధిక విజయాలు(22) సాధించిన జట్టుగానూ నిలిచింది. టీమ్ విన్నింగ్ పర్సంటేజ్ 95.6. T20 చరిత్రలో ఒక ఏడాదిలో ఇదే అత్యధికం.
ఎవరు పడితే వాళ్లొచ్చి సెటిలవ్వడానికి దేశమేమీ ధర్మసత్రం కాదని కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు. ‘ఝార్ఖండ్లో చొరబాటు దారుల్ని JMM ప్రభుత్వం కీర్తిస్తోంది. ఓటు బ్యాంకుగా చూస్తోంది. వారు ఆధార్, రేషన్ కార్డులు పొందేలా సాయపడుతోంది. దాంతో సంతాల్ పరగణాలో గిరిజనుల జనాభా 44 నుంచి 28%కి పడిపోయింది. ఈ దేశం మనది. ఈ నేల, నీరు, అడవులు, కొండలు, పొలాలు మనవి. వీటిని మన నుంచి లాగేసుకోనివ్వొద్దు’ అని అన్నారు.
AP: వైసీపీ నేతలు ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలవనున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరతారు. మరోవైపు అవసరమైతే తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని వారు హెచ్చరించారు. తమ కార్యకర్తల తరఫున నిలబడి పోరాటం చేస్తామని ప్రకటించారు.
TG: నిన్న CM రేవంత్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులకు బండ్ల గణేశ్ ధన్యవాదాలు తెలిపారు. విషెస్ చెప్పడానికి సమయం లేనివారికి ‘పెద్ద నమస్కారం’ అంటూ Xలో సెటైర్లు వేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే CM కావలెను అంటూ రాసుకొచ్చారు. INC అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదని కొందరు, విషెస్ అడుక్కోవడం ఏందన్నా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
HYDలోని సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి కనిపించేలా, ఎత్తైన పీఠం, దానిపై 20 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. విగ్రహం ముందు గ్రీనరీ, భారీ ఫౌంటేన్, ఆకట్టుకునేలా లైటింగ్ వంటి సుందరీకరణ పనులు చేస్తున్నారు. డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ చేయనుండటంతో చకచకా పనులు జరుగుతున్నాయి. సచివాలయ ప్రధాన ద్వారం ముందే విగ్రహాం ఏర్పాటవుతోంది.
కార్తీకమాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో వస్తుందో దాన్ని కోటి సోమవారంగా పేర్కొంటారని పండితులు చెబుతున్నారు. అదే ఈరోజు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంటుంది. ఈరోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే తెలిసీతెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈరోజు చేసే దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.
AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. CBI తరఫున HYD జోన్ JD వీరేశ్ ప్రభు, విశాఖ SP మురళి రాంబా పేర్లను సంస్థ ప్రకటించింది. FSSAI నుంచి డా.సత్యేన్ కుమార్, రాష్ట్రం తరఫున గుంటూరు రేంజి IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి DIG గోపీనాథ్ జెట్టీలు సిట్లో ఉంటారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమవుతుంది.
కొత్త CJI సంజీవ్ ఖన్నాకు బాధ్యతలు చేపట్టడానికి ముందు ఓ చిన్ని కష్టం ఎదురైంది! ప్రైవసీ లేకపోవడంతో ఆయన మార్నింగ్ వాక్ను వదిలేశారు. తన ఇంటి సమీపంలోని లోధి గార్డెన్ ఏరియాలో కొంత దూరం వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త CJIగా ఆయన్ను నామినేట్ చేయగానే మీడియా ఫోకస్, పబ్లిక్ అటెన్షన్ పెరిగింది. దాంతో సెక్యూరిటీతో వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. దీన్ని ఇష్టపడని ఆయన వాకింగ్ మానేశారు.
AP: ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డ్’లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదులో ఇబ్బందులొస్తున్నాయి. ఆధార్, DOB, స్కూల్ రికార్డుల్లో విద్యార్థుల వివరాలు వేర్వేరుగా ఉండటంతో టీచర్లు తలపట్టుకుంటున్నారు. దీంతో పాఠశాల రికార్డుల్లోనే మార్పులు చేసే అధికారాన్ని HMలు, MEOలకు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఇందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది.
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల అకడమిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కేంద్రం APAARను తీసుకొచ్చింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. స్టూడెంట్ హిస్టరీ మొత్తం ఇందులో ఉండటం వల్ల దేశంలో ఎక్కడ చదవడానికైనా ఇబ్బంది ఉండదు. ఆధార్ తరహాలో ఈ కార్డు శాశ్వతంగా ఉంటుంది. అందుకే పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.