India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2025 మొదటి సెషన్లో బెంచ్మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. AUTO, MEDIA, CONSUMPTION షేర్లు దన్నుగా నిలవడంతో సెన్సెక్స్ 78,507 (+368), నిఫ్టీ 23,742 (+98) వద్ద ముగిశాయి. మెటల్, రియాల్టి మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. MARUTI, M&M, LT, BAJAJFIN, TATAMOTORS టాప్ గెయినర్స్. HINDALCO, DRREDDY, ADANIPORTS, ONGC, TATASTEEL టాప్ లూజర్స్. ఫియర్ ఇండెక్స్ INDIA VIX 14.51 వద్ద ఉండటం అనిశ్చితిని సూచిస్తోంది.

కాలం మారింది. మగాడు బలహీనుడయ్యాడు. భార్య అండగా నిలిస్తే కొండలైనా పిండిచేయగలిగే భర్త ఆమె వేధిస్తే తట్టుకోలేకపోతున్నాడు. చట్టాలన్నీ అవతలివారికే చుట్టాలుగా మారడంతో గిలగిలా తన్నుకుంటున్నాడు. ఎంత పోరాడినా న్యాయం దొరకదేమోనన్న బెంగతో ప్రాణం తీసేసుకుంటున్నాడు. మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్. నిన్న ఢిల్లీలో పునీత్ ఖురానా. విడాకుల విచారణలో నలిగిపోతున్న భార్యాబాధితులు బతికేదెలా? భరోసా దొరికేదెలా? మీ comment.

బోర్డర్-గవాస్కర్ సిరీస్లో బ్యాటింగ్, కెప్టెన్సీలో ఘోరంగా విఫలమవుతున్న రోహిత్ శర్మపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతడు రిటైర్ అవ్వాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే చీఫ్ సెలక్టర్ అగార్కర్తో రోహిత్ మాట్లాడినట్లు వార్తలొస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని BCCI వర్గాలంటున్నాయి. BGT మధ్యలో రోహిత్ రిటైర్మెంట్పై ఎలాంటి నిర్ణయం ఉండదని, సిరీస్ ముగిసిన తర్వాతే దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలు వాట్సాప్ వేదికగా జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. గత ఏడాది తొలి మూడు నెలల్లో వాట్సాప్పై 43,797 ఫిర్యాదులు రాగా ఆ తర్వాత టెలిగ్రామ్(22,680), ఇన్స్టాగ్రామ్(19,800)పై వచ్చాయని వెల్లడించింది. గూగుల్ సర్వీస్ ప్లాట్ఫామ్లను ఈ మోసాలకు ఉపయోగించారని తెలిపింది. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారంది.

ముంబై తాజ్ హోటల్ మారణకాండ(26/11) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు తహావుర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది. ముంబై దాడులకు ముందు రాణా రెక్కీ నిర్వహించాడు. అలాగే ప్రధాన సూత్రధారి హెడ్లీకి సాయం చేశాడు. దీంతో అప్పటి నుంచి రాణాను దేశానికి రప్పించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. US తాజా నిర్ణయంతో త్వరలోనే అతడిని IND తీసుకొచ్చి విచారించనున్నారు.

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో పస లేదని కేటీఆర్ అన్నారు. ‘ఈ కేసు ఓ లొట్టపీసు కేసు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది? నాపై ఇది ఆరో ప్రయత్నం. రేవంత్ రెడ్డికి ఏమీ దొరకడం లేదు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. నాపై కేసు పెడితే రేవంత్ రెడ్డిపై కూడా పెట్టాలి. 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది’ అని తెలిపారు.

AP: రాష్ట్రంలో చరిత్ర తిరగరాసిన సంవత్సరం 2024 అని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ‘గత ఐదేళ్లు ప్రజలు, మీడియా, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చింది. రాజధాని అమరావతి నగరం ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.

☛ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు
☛ ఉన్న అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు తీసుకోవద్దు
☛ ఇతరులతో పోల్చుకుంటూ స్థాయికి మించి కార్లు, ఫ్లాట్లు వంటివి కొనుగోలు చేయవద్దు
☛ ఆదాయం పెంచుకునేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి
☛ ఆరోగ్య, జీవిత బీమా తీసుకోవాలి. ఎందుకులే అని నిర్లక్ష్యం చేయవద్దు
☛ ఒక్క ఏడాదిలోనే లక్షాధికారులు అయిపోరనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రణాళిక బద్ధంగా పొదుపు, మదుపు చేయాలి.

AP: CM చంద్రబాబు, Dy.CM పవన్ అన్ని పథకాలను మింగేసి కొండచిలువలా సైలెంటుగా ఉంటున్నారని YCP విమర్శించింది. బాబు రూ.కోట్లకు పడగలెత్తి ప్రజలను రోడ్డున పడేశారని దుయ్యబట్టింది. ‘సంవత్సరం మారింది.. సూపర్ సిక్స్ ఏదీ? విద్యార్థులకు అమ్మఒడి, ఫీజులు, వసతి దీవెన లేవు. రైతన్నలకు భరోసా కరవు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వర్తించదు. బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై పెనుభారం మోపారు’ అని ఫైరయ్యింది.

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. ICC టెస్టు ర్యాంకింగ్స్లో అత్యధికంగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత బౌలర్గా నిలిచారు. గత వారం <<14977764>>అశ్విన్(904p) రికార్డును<<>> సమం చేసిన ఆయన మెల్బోర్న్ టెస్టు ప్రదర్శనతో దానిని అధిగమించారు. ప్రస్తుతం బుమ్రా టెస్టుల్లో తొలి ర్యాంకులో ఉండగా హేజిల్వుడ్, కమిన్స్, రబాడ, జాన్సెన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.