News April 2, 2024

జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తొస్తాయి: సీఎం

image

AP: చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకు రాదని CM జగన్ ఎద్దేవా చేశారు. జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తాయని పేర్కొన్నారు. ‘జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ గుర్తొస్తాయి. లంచాలు లేని పాలన అంటే గుర్తొచ్చేది జగన్. వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ లబ్ధి చేకూర్చాం’ అని తెలిపారు.

News April 2, 2024

జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్

image

AP: మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆ ముఠా నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపు పతి వస్తున్నారు. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.

News April 2, 2024

వివాహేతర శృంగారం నేరం కాదు: రాజస్థాన్ HC

image

ఇద్దరు మేజర్లు ఏకాభిప్రాయంతో వివాహేతర శ‌ృంగారం చేస్తే నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు కిడ్నాప్ చేశారని భర్త పిటిషన్‌ వేశారు. కోర్టులో హాజరైన సదరు భార్య.. ముగ్గురిలో ఒకరితో తాను సహజీవనం చేస్తున్నానని చెప్పింది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెను శిక్షించాలని కోర్టును భర్త తరఫు లాయర్ కోరగా.. ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది.

News April 2, 2024

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు: సీఎం జగన్

image

AP: 99 శాతం హామీలు అమలు చేసిన తమ ముందు 10% హామీలు కూడా అమలు చేయని చంద్రబాబు నిలబడగలరా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. మదనపల్లి సభలో మాట్లాడుతూ.. ‘అధికారం కోసం తోడేళ్లన్నీ కలిసి వస్తున్నాయి. నన్ను ఓడించడానికి CBN, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి వస్తారా? విపక్షాల పొత్తులకు మేం భయపడటం లేదు’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం: సీఎం జగన్

image

AP: తాము ఐదేళ్లుగా విశ్వసనీయమైన పాలన అందించామని సీఎం జగన్ తెలిపారు. మదనపల్లిలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించాం. మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేశాం. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు కళ్ల ముందు కనిపిస్తోంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం. దీనికి మీరంతా సిద్ధమా? 58 నెలల్లో మంచి జరిగితేనే ఓటు వేయాలని మనం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

టాటా మోటార్స్‌కు చైనా ఈవీలతో సవాల్!

image

కేంద్రం ఇటీవల తెచ్చిన ఈవీ కొత్త పాలసీతో టెస్లా వంటి ఫారిన్ ఈవీ కంపెనీలు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియరైంది. ఈ నిర్ణయం దేశీయంగా ఈవీ రంగంలో టాప్‌లో ఉన్న టాటాకు సైతం ఊతమిచ్చిందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కంపెనీ BYD అందుబాటు ధరలకు ఈవీలను తెచ్చే ప్లాన్‌లో ఉందట. ఈ నేపథ్యంలో టాటాకు చైనా సంస్థలు సవాల్‌గా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

News April 2, 2024

సూర్య గ్రహణం రోజున జైళ్లలో లాక్‌డౌన్.. ఖైదీల దావా

image

సంపూర్ణ <<12895461>>సూర్యగ్రహణం<<>> సందర్భంగా ఈ నెల 8న USలోని జైళ్లలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ రోజు కొన్ని నిమిషాలు పూర్తి చీకటిగా ఉంటున్నందున ఖైదీల సందర్శనను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు పవిత్రమైన రోజున మతపరమైన కార్యక్రమాలను నిరోధించడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని పలువురు ఖైదీలు న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.

News April 2, 2024

దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం

image

దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం సిద్ధమవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 50,000 సీట్ల కెపాసిటీతో బీసీసీఐ స్టేడియం నిర్మిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో దీనిని రూపొందిస్తోంది. మిరాజ్ గ్రూప్ సంస్థతో కలిసి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఈ మైదానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ గ్రౌండ్‌లో మొత్తం 12 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే దీని నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

News April 2, 2024

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు: చీకోటి ప్రవీణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. ‘టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరాచకాలకు అంతే లేదు. చాలామంది జీవితాలను నాశనం చేశారు. ఆయనకు రూ.వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటీ. అప్పట్లో నాపై పీడీ యాక్ట్ కేసులు పెడతానని బెదిరించారు. దీనిపై నేను డీజీపీకి ఫిర్యాదు చేశా’ అని ఆయన పేర్కొన్నారు.

News April 2, 2024

ఫోన్ ట్యాపింగ్: మూసీలో హార్డ్ డిస్కుల శకలాలు సేకరణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రణీత్ రావు కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. హార్డ్ డిస్కులను డిసెంబర్ 4న మూసీలో పడేసినట్లు చెప్పారని.. నాగోలు వద్ద మూసీలో వాటి శకలాలను సేకరించామని పేర్కొన్నారు. ప్రణీత్ రావు వాడిన కంప్యూటర్లు, SIB కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు సీజ్ చేశామని వివరించారు. విపక్ష పార్టీ అభ్యర్థుల డబ్బు పంపిణీపై ఆయన దృష్టి పెట్టినట్లు తెలిపారు.