India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్తో T20 సిరీస్లో సంజూ శాంసన్ ఓపెనర్గా వస్తారని కెప్టెన్ సూర్య కుమార్ ప్రకటించారు. సంజూతో అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్లో బ్యాటింగ్కు దిగుతారని చెప్పారు. కాగా ఈ సిరీస్లో రాణిస్తే సంజూకి జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశం ఉంది. అటు అతడికి ఛాన్సులు ఎక్కువగా రాకపోవడం, వచ్చినా ఉపయోగించుకోలేకపోవడంతో జట్టులో చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఈ సిరీస్ సంజూకి గోల్డెన్ ఛాన్స్ కానుంది.
వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్కు అప్డేట్స్ వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. రాజాసాబ్ నుంచి టీజర్, హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్, కల్కి-2 నుంచి అప్డేట్, సందీప్ వంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు డార్లింగ్, ఈశ్వర్ మూవీస్ రీ-రిలీజ్ ఉండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు రెబల్ ఫ్యాన్స్.
TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.
JK, హరియాణా ఎన్నికల్లో BJPకి ప్రతికూల ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 90 స్థానాలున్న JKలో BJP సాధించే సీట్లపై సర్వే అంచనాలు. *పీపుల్స్ పల్స్ 23-27 *దైనిక్ భాస్కర్ 20-25 *గలిస్తాన్ News 28-30 *India Today/CVoter 27-32. హరియాణా: పీపుల్స్ పల్స్ 26 *దైనిక్ భాస్కర్ 19-29 *మ్యాట్రిజ్ 18-24 * ధ్రువ్ రీసెర్చ్ 27-32. BJP రెండు చోట్లా మెజారిటీ మార్క్ సాధించలేదని సర్వేలు తేల్చాయి.
అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!
ఎన్నికల ఫలితాలు వెలువడకముందే JKలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. J&K Reorganisation Act, 2019 సహా జులై, 2023లో చేసిన సవరణల ద్వారా ఐదుగురు MLAలను LG నామినేట్ చేయగలరు. కేంద్ర హోం శాఖ సూచలన మేరకు ఆయన ఐదుగురిని నియమించనున్నారు. వీరికి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కల్పిస్తే Halfway Mark 45కి బదులుగా 48 అవుతుంది. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి.
హరియాణాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్(45-50), CNN(59), రిపబ్లిక్ మ్యాట్రిజ్(55-62), దైనిక్ భాస్కర్(44-54) సంస్థలు అంచనా వేశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ సమస్యలు, అగ్నివీర్ అంశాలు, మహిళా రెజ్లర్ల అందోళన బీజేపీకి ప్రతికూలంగా మారినట్టు పేర్కొన్నాయి.
హరియాణాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 59 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్దే అధికారం అని తేల్చి చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.